వనపర్తి టౌన్, సెప్టెంబర్ 22 : వనపర్తి నియోజకవర్గం అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నానని, భావితరాల కోసం బలమైన పునాది వేస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. వనపర్తి జిల్లా కేంద్రం లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం మంత్రి విలేకరులతో మాట్లాడారు. తనను గెలిపించిన నియోజకవర్గ ప్రజలు ఊహించిన దానికంటే ఎక్కువగానే అభివృద్ధి చేశానని, రాష్ట్రస్థాయిలో వ్యవసాయ శాఖకు వన్నె తీసుకొచ్చానన్నారు. 29న మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా రూ.10 కోట్లతో చేపట్టనున్న ఐటీ టవర్, రూ.50 లక్షలతో జర్నలిస్ట్ భవన్, రూ.5 కోట్లతో పెబ్బేరు సంత అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తామన్నారు.
ప్రజలు ఊహించిన దానికి మించి అభివృద్ధి చేసి భవిష్యత్ తరాలకు బలమైన పునాది వేశామని మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. రా ష్ట్రస్థాయిలో వ్యవసాయ రంగానికి వన్నె తెచ్చి వనపర్తి కీర్తిని చాటిచెప్పానని స్పష్టం చేశారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణంలో రూ.10కోట్లతో చేపట్టనున్న ఐటీ టవర్ పనులను ఈ నెల 29న ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారని చెప్పారు. భావితరాలకు బలమైన పునాదులు వేసేందుకు అహర్నిశలు శ్రమిస్తూ నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతున్నానన్నారు. జర్నలిస్ట్ భవన నిర్మాణానికి రూ.50లక్షలు, పెబ్బేర్ సంత అభివృద్ధికి రూ.5కోట్లు, టఫ్ ఐడీసీ కింద మంజూరైన మరో రూ.50కోట్లతో జిల్లాలో మిగిలిపోయిన పనులను వేగంగా పూర్తి చేస్తామన్నారు.
రూ.200కోట్లతో కందకంలో నిర్మించిన సమీకృత మార్కెట్, డబుల్ బెడ్రూంల వద్ద అంతర్గత రోడ్లు, పాలిటెక్నిక్ కళాశాలలో హాస్టల్ పునరుద్ధరణ, భవిష్యత్లో ఇబ్బందులు రాకుండా జెర్రిపోతుల వాగు, రామ టాకీస్, కంచిరావుపల్లిలోని చేపల వాగు తదితర హైలెవల్ బ్రిడ్జిల నిర్మాణం పూర్తయ్యిందన్నారు. త్వరలో జర్నలిస్టులందరికీ ఇండ్లు, ఇండ్ల స్థలాలు, దశలవారీగా పేదలకు ఇంటి స్థలాలు కేటాయిస్తామన్నారు. జిల్లా కేంద్రంలో జర్నలిస్ట్ భవన నిర్మాణానికి రూ.50లక్షలు కేటాయించామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. ఈనెల 29న మంత్రులు వేముల ప్రశాం త్రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. చెరువుల పునరుద్ధరణతో పట్టణాల్లో భూగర్భజలాలను పెంచుతూ సుందరీకరణ పనులు చేపడుతుంటే మాజీ మంత్రి చిన్నారెడ్డి అవగాహన రాహిత్యం తో విమర్శిస్తున్నారని మండిపడ్డారు. పొంతనలేని విమర్శలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. ఈనెల 29న నిర్వహించే బహిరంగ సభకు ప్రజలు అధి కసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని మంత్రి పి లుపునిచ్చారు. ప్రజలు ఆశీర్వదించి మరోసారి గెలిపిస్తే వ నపర్తి భవిష్యత్కు బలమైన పునాదులు వేస్తానన్నారు. స మావేశంలో మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, మా ర్కెట్కమిటీ చైర్మన్ రమేశ్గౌడ్, వైస్చైర్మన్ శ్రీధర్, పెబ్బేర్ వైస్చైర్మన్ కర్రెస్వామి, కురుమూర్తియాదవ్, బీఆర్ఎస్ పట్టణ ఇన్చార్జి ప్రకాశ్ తదితరులున్నారు.
అభివృద్ధి పనుల పరిశీలన
జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను మం త్రి నిరంజన్రెడ్డి పరిశీలించారు. శుక్రవారం ఉదయం పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణాన్ని పరిశీలించి వ్యాయామానికి వచ్చిన వారితో కాసేపు షటిల్ ఆడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేడీఆర్ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థుల కోసం ని ర్మించే వసతి గృహాలకు, రాజభవన పునర్నిర్మాణ పనులకు త్వరలో శంకుస్థాపన చేస్తామన్నారు. నాగవరం వద్ద రూ. 1.02కోట్లతో నిర్మించిన భూసార పరీక్ష కేంద్రం, రూ.50లక్షలతో నిర్మించిన ఎనిమల్స్ కేర్ కేం ద్రం, రూ. కోటితో నిర్మించిన సెగ్రిగేషన్ షెడ్డును కూడా ప్రారంభిస్తామన్నారు. రూ.5.08 కోట్లతో రాజాపేటలో ని ర్మించిన 96 డబుల్ బెడ్రూం ఇండ్లను లబ్ధిదారులకు అందజేస్తామని చెప్పారు. బైపాస్ రహదారుల నిర్మాణానికి రూ.73కోట్లతో శ్రీకారం, రూ.425కోట్లతో నిర్మించిన మి షన్ భగీరథ పనులను త్వ రలో ప్రారంభిస్తామన్నారు. కా ర్యక్రమంలో కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, మార్కెట్కమిటీ చైర్మన్ రమేశ్గౌడ్, మున్సిపల్ వైస్చైర్మన్ శ్రీధర్, బీఆర్ఎస్ పట్టణ ఇన్చార్జి ప్రకాశ్, బీఆర్ఎస్ నాయకులు, ఇతర నేతలు పాల్గొన్నారు.
ఆడబిడ్డలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలి
వనపర్తి అర్బన్, సెప్టెంబర్ 22 : ఆడబిడ్డలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలని మంత్రి సూచించారు. చేతివృత్తులు చేసుకొనే మహిళలకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్నదని ఆయన తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాయలంలో 270మంది మైనార్టీ మహిళలకు మంత్రి కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. ప్రభుత్వం అందిస్తున్న ఉపకరణాలను పొందిన వారు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీవో పద్మావతి, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.