నారాయణపేట టౌన్, మార్చి 15: ప్రస్తుత పరిస్థితుల్లో భూ సర్వే చేయడానికి అ త్యాధునిక పరిజ్ఞానం ఉపయోగించాలని క లెక్టర్ శ్రీహర్ష చెప్పారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో ఇటీవల కొనుగోలు చేసిన డీజీపీఎస్ పరికరాన్ని జిల్లా సర్వే అధికారులకు అందజేశారు. అనంతరం ఆయన మా ట్లాడుతూ అత్యాధునిక పరిజ్ఞానంతో ప్రభు త్వ భూముల సర్వే చేపట్టి హద్దులు నిర్ణయించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్కుమార్, జిల్లా సర్వే అధికారి గిరిధర్, సర్వేయర్లు మూసా, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఈనెల 18 నుంచి ప్రారంభంకానున్న పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్లో పరీక్షల నిర్వహణపై అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో మొత్తం 7,678 మం ది రెగ్యులర్, 95మంది ప్రైవేటు విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు. దీనికో సం 38 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 38మంది డిపార్ట్మెంట్ అధికారులు విధు ల్లో ఉంటారన్నారు.
పరీక్ష సమయంలో కేం ద్రాలను తాసీల్దార్లు తనిఖీ చేయాలని, జి రాక్స్ సెంటర్లను మూసి వేయించాలని చె ప్పారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు తాగునీరు, విద్యుత్, వైద్య సహాయం అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. విద్యార్థులు ఉదయం పరీక్ష కేంద్రాలకు స కాలంలో చేరేందుకు బస్సులు పరీక్ష కేంద్రా ల వరకు నడిపేలా చర్యలు తీసుకోవాలన్నా రు. సమావేశంలో డీఈవో అబ్దుల్ ఘని, ఇతర అధికారులు పాల్గొన్నారు.