నారాయణపేట టౌన్, మార్చి 11 : ఉద్యోగులు సమయపాలన పాటించాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. సోమవారం పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సమయంలో ఒకరిద్దరు ఔట్ సోర్సింగ్ సిబ్బంది, అటెండర్లు తప్ప మిగతా ఉద్యోగులు ఎవరూ లేకపోవడంతో కార్యాలయంలోని హాజరు రిజిస్టర్, బయోమెట్రిక్ యంత్రాన్ని పరిశీలించా రు. బయోమెట్రిక్ హాజరు లిస్టును ప్రింట్ తీసి తనకు పంపించాలని ఉద్యోగిని ఆదేశించారు. ఎలాంటి ముంద స్తు సమాచారం లేకుండా కార్యాలయానికి సమయానికి హాజరుకాని అధికారులు, ఉద్యోగులు, సిబ్బందికి రెండురోజుల వేతనాన్ని నిలిపి వేయాలన్నారు. అన్ని విభాగాలను పరిశీలించి ఎవరెవరు ఏఏ విధులు పరిశీలిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. మున్సిపల్ కమిషనర్ ఈనెల 13వరకు సెలవు పెట్టినట్లు సిబ్బంది తెలిపారు.
ఆర్టీఐ ద్వారా వచ్చిన దరఖాస్తులను పరిష్కరించాలని కలెక్టర్ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. సోమవారం పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. జిల్లా కు చెందిన అధికారిక వెబ్సైట్ను అప్డేట్ చేయాలని, ప్రభుత్వ శాఖలకు సంబంధించి ఎలాంటి కార్యక్రమాలకు నిర్వహించినా ఆయా కార్యక్రమాల ఫొటోలను అప్లోడ్ చేయాలన్నారు. అన్ని శాఖల అధికారులకు ఎపిక్ కార్డులు అందజేయాలన్నారు. ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డుల కోసం ఆన్లైన్లో వారంలోపు వివరాలు నమోదు చేయాలన్నారు. సమావేశంలో ఏవో నర్సింగరావుతోపాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
నారాయణపేటరూరల్, మార్చి11 : ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు సోమవారం ప్రశాంతగా జరిగాయి. ఫిజిక్స్, ఎకనామిక్స్ పరీక్షకు సెట్ నెంబర్ ఏ ప్రశ్నాపత్రం ఎంపిక చేశారు. మొత్తం 4,402 మంది జనరల్ విద్యార్థులకు గానూ 4,188 మంది హాజరుకాగా 214 మంది గైర్హాజరయ్యారు. అలాగే ఒకేషనల్లో 607మంది విద్యార్థులకు గానూ 577మంది హాజరుకాగా 30మంది గైర్హాజరైనట్లు పరీక్షల కన్వీనర్ సుదర్శన్రావు తెలిపారు. పేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ కోయ శ్రీహర్ష తనిఖీ చేశారు. అదేవిధంగా డీఈసీ బృందం మాగనూర్, నారాయణపేటలో, ఫ్లయింగ్స్వా డ్ బృందం మరికల్లో, సిట్టింగ్ స్వాడ్ బృందం మక్తల్, దామర్గిద్దలోని పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు.