మహబూబ్నగర్ టౌన్, మార్చి 26 : ఓటు హ క్కు ఉన్న ప్రతి ఒక్కరూ పోలింగ్లో పాల్గొనాలని మహబూబ్నగర్ అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్ పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేర కు స్వీప్ (సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎ లక్టోరల్ పార్టిసిపేషన్) ఆధ్వర్యంలో మంగళవారం స్టేడియం నుంచి 5కే రన్ ఓటరు చైతన్య ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని అదనపు కలెక్టర్ జెండా ఊ పి ప్రారంభించగా.. బస్టాండ్, తెలంగాణ చౌరస్తా, ప్రధాన రహదారి మీదుగా కొనసాగింది. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఓటు చాలా విలువైనదని, ప్రతి ఓటరూ పార్లమెంట్ ఎన్నికల్లో వినియోగించుకొని, ఓటింగ్ శాతం పెంచాలని పిలుపునిచ్చారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనదే అనే విషయాన్ని గుర్తు చేశారు. 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్టీవో నవీన్, జిల్లా స్వీప్ కార్యక్రమాల నోడల్ అధికారి శ్రీధర్, జిల్లా క్రీడాశాఖ అధికారి శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.