మహబూబ్నగర్, మార్చి 17 : గ్రామపంచాయతీల్లోని డంపింగ్యార్డుల్లో కంపోస్టు ఎరువును తయారు చేయాలని కలెక్టర్ రవినాయక్ అన్నారు. కలెక్టరేట్ నుంచి శుక్రవారం ఎంపీడీవోలు, ఎంపీవోలతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అధికారులు గ్రామాలకు వెళ్లినప్పుడు డంపింగ్యార్డులను సందర్శించి ఎరువుల తయారీని పరిశీలించాలని సూచించారు. అలాగే వైకుంఠధామాలను అందుబాటులోకి తేవాలన్నారు. ఉపాధి హామీ పనుల్లో కూలీల సంఖ్యను పెంచాలని, నర్సరీల్లో షెడ్నెట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
దళితబంధు పథకం లబ్ధిదారుల వివరాలను మొబైల్యాప్లో 93శాతం అప్లోడ్ చేశారని, మిగ తా వారి వివరాలను పూర్తిస్థాయిలో నమోదు చేయాలన్నారు. అలాగే ఈనెలాఖరు నాటికి అన్ని గ్రామపంచాయతీల్లో పన్ను వసూలును పూర్తి చేయాలని తెలిపారు. మైనార్టీ సంక్షేమశాఖ అమలు చేస్తున్న ఆర్థిక చేయూత పథకం కింద లబ్ధిదారుల జాబితాను పంపించాలని సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన డిజైన్కు అనుగుణంగానే గ్రామీణ క్రీడాప్రాంగాణాలు నిర్మించాలని తెలిపారు. ఈ-శ్రామ్లో అసంఘటిత కార్మికులందరికీ రిజిస్ట్రేషన్ చేయించాలని, సోషల్ ఆడిట్ రికవరీపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. వీసీలో అదనపు కలెక్టర్ సీ తామారావు, డీఆర్డీవో యాదయ్య, ఏపీడీ జకియాసుల్తానా, డీపీవో వెంకటేశ్వర్లు ఉన్నారు.