మద్దూర్, డిసెంబర్ 15 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా చే పట్టిన పాఠశాలల మౌలిక సదుపాయల కల్పన పనులు త్వ రగా పూర్తి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. మండలంలోని వివిధ గ్రామాల ప్రభుత్వ పాఠశాలలను గురువారం తనిఖీ చేశారు. మన ఊరు మన బడి పనులను పక్షం రోజుల్లో పూర్తి చేయాలని అధికారులు, కాంట్రాక్టర్లకు సూచించారు. అలాగే ఉన్నత పాఠశాలలను తిరిగి పరిశీలించి పనులను ప్రారంభించకపోవడంపై అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరగా పనులు ప్రారంభించాలని లేనిపక్షంలో ఇతరులకు అప్పగించాలని అధికారులను ఆదేశించారు. పెదిరిపాడ్ ప్రాథమికోన్నత పా ఠశాలలో ఐదో తరగతి విద్యార్థులతో మమేకమై తెలుగు పద్యాలను వారి నుంచి చదివి వినిపించుకోని తాత్పర్యాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేజీబీవీ పాఠశాలలో విద్యార్థులు తయారు చేసిన బో కేలను కలెక్టర్కు ఇచ్చి స్వాగతం పలికారు.
అక్కడ పరిసరాలను పరిశీలించి వంట గదిని పరిశుభ్రంగా ఉంచుకోవాలని నిర్వాహకులను ఆదేశించారు. విద్యార్థులతో హాస్టల్ వసతులపై అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన భోజనా న్ని విద్యార్థులకు అందించాలన్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనా న్ని అందించాలన్నారు. అనంతరం మండలంలోని మన ఊరు మన బడికి ఎంపిక చేసిన నా గంపల్లి, పల్లెర్ల, నందిపహాడ్, జదవరావుపల్లి, దోరెపల్లి, ద మ్గాన్పూర్ తదితర పాఠశాలల్లో సాగుతున్న పనులను ప ర్యవేక్షించారు.
పల్లెర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తి చేయాలని ఎస్ఎమ్సీ సభ్యులు, సర్పంచ్కు ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం చేయవాల్సిన పనుల్లో జప్యం లేకుండా విద్యుత్, ప్లోరింగ్, మరుగుదొడ్లు, ప్రహరీ నిర్మాణ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు.
పనులు నత్తనడక సాగుతున్నాయని ఏఈ, డీఈలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎఫ్ఎల్ఎన్ క్లాసులు సమయనుసారంగా పూర్తి చేయాలని, ప్రతి విద్యార్థి ఓ ప్రణాళిక ప్రకా రం సిద్ధం చేసుకోవాలని, అందుకు సంబంధించిన మెటీరియల్, రికార్డులను పరిశీలించారు. తొలిమెట్టు కార్యక్రమా న్ని బాధ్యతాయుతంగా నిర్వహించాలన్నారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని సూచించారు. కార్యక్రమంలో రోడ్డు భవనల శాఖ జిల్లా అధికారి రాములు, వి ద్యాశాఖ సెక్టోరియల్ అధికారి శ్రీనివాస్, ఎంఈవో గోపాల్నాయక్, ఎంపీడీవో విజయలక్ష్మి, ఏఈ విష్ణు, ఆయా గ్రా మాల సర్పంచులు, అధికారులు తదిరులు పాల్గొన్నారు.