మహబూబ్నగర్, ఫిబ్రవరి 8 : కంటివెలుగు కార్యక్రమాన్ని అందరూ సద్వినియో గం చేసుకోవాలని కలెక్టర్ జి.రవినాయక్ అన్నారు. సమీకృత కలెక్టరేట్లో బుధవారం కంటివెలుగు శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఐడీవోసీలో సు మారు 45 శాఖలకుపైగా ఉన్నాయని, ఇక్కడ పనిచేసే ఉద్యోగుల సౌకర్యార్థం కంటివెలుగు శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపా రు. కంటివెలుగు కార్యక్రమాన్ని విజయవం తం చేసేందుకుగానూ జిల్లావ్యాప్తంగా 45 బృందాలను నియమించినట్లు చెప్పారు. ఇప్పటివరకు లక్షమందికిపైగా కంటి పరీక్ష లు చేయించుకున్నారని వెల్లడించారు. అలాగే జిల్లా కోర్టు సముదాయంతోపాటు పోలీస్ హెడ్క్వార్టర్స్లో కూడా కంటివెలుగు శిబిరాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఉద్యోగులందరూ కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సీతారామారావు, డీఎంహెచ్ వో కృష్ణ, డిప్యూటీ డీఎంహెచ్వో భాస్కర్నాయక్, శశికాంత్, కంటివెలుగు ప్రోగ్రాం అ ధికారి వినోద్రెడ్డి, డాక్టర్లు మోతీలాల్, సం ధ్య, కిరణ్మయి, శ్వేత, జరీనా పాల్గొన్నారు.
కోయిలకొండ, ఫిబ్రవరి 8 : మండలం లో ఏర్పాటు చేసి న కంటివెలుగు శిబిరాల్లో 18ఏండ్లు నిండిన ప్రతిఒక్కరూ పరీక్షలు చేయించుకోవాలని ఎంపీపీ శశికళాభీంరెడ్డి అన్నారు. మండలంలోని గార్లపాడ్లో కంటివెలుగు శిబిరాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంధత్వరహిత తెలంగాణ నిర్మాణానికి ప్రభుత్వం కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని, మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమం లో సర్పంచ్ ఆంజనేయులు, ఎంపీటీసీ విజయలక్ష్మి, ఉపసర్పంచ్ రామకృష్ణారెడ్డి, నా యకులు యాదిరెడ్డి, నవీన్ పాల్గొన్నారు.
జడ్చర్లటౌన్, ఫిబ్రవరి 8 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటివెలుగు కార్యక్రమం విజయవంతంగా సాగుతున్నది. మున్సిపాలిటీలోని 3వ వార్డులో 170మందిని పరీక్షించి 28మందికి కండ్లద్దాలను పంపిణీ చేశారు. మరో 19మందికి అద్దాల కోసం ఆర్డర్ పెట్టారు. 16వ వార్డులో 178 మందికి పరీక్షలు నిర్వహించి 44మందికి అద్దాలను పంపీణీ చేశారు. మరో 27మందికి అద్దాల కోసం ఆర్డర్ పెట్టినట్లు అర్బన్ హెల్త్సెంటర్ డాక్టర్ శివకాంత్ తెలిపారు. అలాగే మండలంలోని చర్లపల్లిలో 106 మందిని పరీక్షించి 8మందికి కండ్లద్దాలు పంపిణీ చేశారు. మరో 10మందికి అ ద్దాల కోసం ఆర్డర్ పెట్టారు. గంగాపురంలో 183 మందిని పరీక్షించి ఇద్దరికి అద్దాలు పంపిణీ చేశారు. మరో ముగ్గురికి అద్దాల కోసం ఆర్డ ర్ పెట్టినట్లు డాక్టర్ సమత తెలిపారు.
మూసాపేట, ఫిబ్రవరి 8 : మండలంలోని అచ్చాయిపల్లిలో ఏర్పాటు చేసిన కంటివెలుగు శిబిరాన్ని జెడ్పీటీసీ ఇంద్రయ్యసాగర్ ప్రారంభించారు. అనంతరం గ్రామంలో నిర్మిస్తున్న డబుల్బెడ్రూం ఇండ్ల ప నులను పరిశీలించారు. కార్యక్రమంలో ఎం పీడీవో సరోజ, సర్పంచ్ చంద్రశేఖర్, గూప ని కొండయ్య, రవి, వెంకటేశ్, ఆంజనేయు లు తదితరులు పాల్గొన్నారు.
మహ్మదాబాద్, ఫిబ్రవరి 8 : కంటివెలుగు కార్యక్రమంలో భాగంగా మహ్మదాబాద్, కంచన్పల్లి గ్రామాల్లో 339 మందికి పరీక్షలు నిర్వహించినట్లు మండల వైద్యాధికారి మహ్మద్ తెలిపారు.
రాజాపూర్, ఫిబ్రవరి 8 : మండలంలోని అగ్రహారం పొట్లపల్లిలో 169మందిని పరీక్షించి 18మందికి అద్దాలు పంపిణీ చేసినట్లు డాక్టర్ మధుసూదన్రావు తెలిపారు. మరో 15మందికి అద్దాల కోసం ఆర్డర్ చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో కంటివెలుగు కోఆర్డినేటర్ శ్రీనివాసులు, డాక్టర్లు మౌనిక, రవికుమార్, ఉత్తరయ్య పాల్గొన్నారు.
మిడ్జిల్, ఫిబ్రవరి 8 : మండలకేంద్రంతోపాటు మల్లాపూర్లో 397మందికి కంటి పరీక్షలు నిర్వహించి 23మందికి అద్దాలను పంపిణీ చేసినట్లు వైద్యాధికారి మనుప్రియతెలిపారు. మరో 26మందికి అద్దాల కోసం ఆర్డర్ చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో డాక్టర్ కృష్ణకుమార్, సిబ్బంది దేవ య్య, జంగయ్య పాల్గొన్నారు.
బాలానగర్, ఫిబ్రవరి 8 : మండలంలోని మోతీఘణపూర్లో 155మందిని పరీక్షించి 39మందికి కండ్లద్దాలు పంపిణీ చేసినట్లు డాక్టర్ సృజన తెలిపారు. మరో 25మందికి అద్దాల కోసం ఆర్డర్ చేసినట్లు పేర్కొన్నారు. అలాగే పెద్దరేవల్ల్లిలో 161మందిని పరీక్షించి 40మందికి అద్దాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. మరో 14మందికి అద్దాల కోసం ఆర్డర్ చేసినట్లు పేర్కొన్నారు. మోతీఘణపూర్లో కంటివెలుగు శిబిరాన్ని సర్పంచ్ మాలతీయాదిరెడ్డి పరిశీలించారు.
నవాబ్పేట, ఫిబ్రవరి 8 : కంటివెలుగు కార్యక్రమంలో భాగంగా నవాబ్పేటలో 226మందిని పరీక్షించి 12మందికి కండ్లద్దాలను పంపిణీ చేశారు. కోళ్లగుట్టతండాలో 152మందికి పరీక్షలు నిర్వహించి 24మందికి అద్దాలు అందజేశారు. మరో 15మంది కి అద్దాల కోసం ఆర్డర్ చేశారు. యన్మన్గండ్లలో 215మందిని పరీక్షించి 25మందికి అద్దాలను పంపిణీ చేశారు. మరో 17మందికి అద్దాల కోసం ఆర్డర్ పెట్టారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి విజయలక్ష్మి, సిబ్బంది బీచుపల్లిగౌడ్, శకుంతల, శ్రీనివా స్, శరభలింగం, అవినాశ్ పాల్గొన్నారు.
మహబూబ్నగర్ మెట్టుగడ్డ, ఫిబ్రవరి 8 : కంటివెలుగు కార్యక్రమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు లక్షా 84వేల 92మందికి పరీక్షలు నిర్వహించినట్లు వైద్యారోగ్యశాఖ జిల్లా అధికారి కృష్ణ తెలిపారు. బుధవారం 45 శిబిరాల్లో 7,588మందికి కంటి పరీక్షలు నిర్వహించి 1,038మందికి అద్దాలను పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. దూరంచూపు సమస్య ఉన్న 584మందిని గుర్తించి అద్దాల కోసం ఆర్డర్ చేసినట్లు తెలిపారు. కాగా, పలు శిబిరాలను క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ డాక్టర్ మోతీలాల్ పరిశీలించారు.