మహబూబ్నగర్ మెట్టుగడ్డ, జనవరి 26 : జిల్లా అభివృద్ధికి అందరి సహకారం ఉండాలని మహబూబ్నగర్ కలెక్టర్ జి.రవినాయక్ కోరారు. భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఆయన జిల్లా కేం ద్రంలోని పోలీసు పరేడ్ మైదానంలో జాతీయ పతాకా న్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో భాగంగా మహాలక్ష్మి పథకం కింద జిల్లాలో ఇప్పటి వరకు 13,86,853 మంది ప్రయాణికులు పల్లెవెలుగు, ఎక్సైప్రెస్ బస్సులు ద్వారా ఉచిత ప్రయాణాన్ని చేసినట్లు తెలిపారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద 10 లక్షలకు పెంచారన్నారు. అంతకుముందు కలెక్టర్ పోలీ సు గౌవర వందనాన్ని స్వీకరించారు. పరేడ్ కమాండర్ ఆర్ఐ నాగేశ్ ఆధ్వర్యంలో సాయుధ బలగాల కవాతు ని ర్వహించారు. ఈ సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధు లు వకీల్ భీమయ్య, సుఖాదాదేవిని శాలువా, పూలమాలతో కలెక్టర్, ఎస్పీ, మహబూబ్నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి సత్కరించారు. అనంతరం విద్యార్థులచే నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమానికి హాజరైన వైస్చైర్మన్ యాదయ్య, వివిధ శాఖల ద్వారా ఏర్పాటు చేసిన స్టాల్స్ను సందర్శించారు. అదనపు కలెక్టర్ శివేంద ప్రతాప్, రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎస్.మోహన్రావు, డీఆర్వో రవికుమార్, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
నారాయణపేట రూరల్, జనవరి 26 : పేట జిల్లా కేం ద్రంతో పాటు మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో శుక్రవారం గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ మయాంక్మిట్టల్ జాతీయజెండాను ఎగురవేశారు. కాం గ్రెస్పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే పర్ణికారెడ్డి, బీఆర్ఎ స్ కార్యాలయంలో పట్టణాధ్యక్షుడు విజయ్సాగర్ జాతీయజెండాను ఎగురవేశారు. డీపీఆర్వో కార్యాలయంలో డీపీఆర్వో రషీద్, జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ యోగేశ్ గౌతమ్, జెడ్పీ కార్యాలయంలో చైర్పర్సన్ వన జ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సీఈవో శైలజ జాతీ య పతాకాన్ని ఆవిష్కరించారు. జిల్లాకోర్టు ఆవరణలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ఫ్రీ పో లీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
భూత్పూర్, జనవరి 26 : గణతంత్ర దినోత్సవం సం దర్భంగా మండలంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో అధికారులు, నాయకులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎంపీడీవో కార్యక్రమంలో నిర్వహించి న గణతంత్ర వేడుకకు మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్గౌడ్, ఎంపీపీ శేఖర్రెడ్డి, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
బాలానగర్, జనవరి 26 : మండల కేంద్రంలోని ఎస్సీకాలనీలో సర్పంచ్ విజయలక్ష్మి సొంత ఖర్చులతో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని శుక్రవారం ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి ఆవిష్కరించారు. అలాగే అంబేద్కర్ విగ్రహానికి పూలమాలల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ విజయలక్ష్మి, తిరుపతి, దత్తాత్రేయ, శంకర్ నాయక్ ఉన్నారు.