నారాయణపేట, ఏప్రిల్ 1 : వరి కొనుగోలు కేంద్రాలకు ఆరబెట్టిన ధాన్యాన్ని తీసుకురావాలని అదనపు కలెక్టర్ అశోక్కుమార్ అన్నారు. సోమవారం సింగారం చౌ రస్తా సమీపంలో పీఏసీసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి న కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఏ గ్రేడ్ రకానికి రూ.2,203, సాధారణ రకానికి రూ.2,183 మద్దతు ధరను ప్రభుత్వం ప్రకటించిందన్నారు. రైతులు బయటి మార్కెట్లో కాకుండా కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. జిల్లాలో మొత్తం 123 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వివరించారు. శనివారం మరిన్ని ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తామని చె ప్పారు. వీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ జిల్లా అధికారి సుదర్శన్, జిల్లా మేనేజర్ దేవదాస్, పీఏసీసీఎస్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
భూత్పూర్, ఏప్రిల్ 1 : ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ మోహన్రావు కోరారు. సోమవారం మండలంలోని మద్దిగట్లలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 190 కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో పీఏసీసీఎస్ ఆధ్వర్యంలో 87, ఐకేపీ ఆధ్వర్యంలో 98, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో 4, మెప్మా ఆధ్వర్యంలో ఒక కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి శ్రీనివాస్, జిల్లా సహకారశాఖ అధికారి పద్మ, సీఈవో రత్నయ్య, ఏఈవో లక్ష్మి, సిబ్బంది వెంకటేశ్, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.
దేవరకద్ర, ఏప్రిల్ 1 : రైతులు సాగు చేసిన ప్రతి గిం జనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని సహకార సం ఘం సీఈవో శ్రీనివాసులు అన్నారు. సోమవారం మం డలకేంద్రంలోని వ్యవసాయమార్కెట్లో పీఏసీసీఎస్ ఆ ధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రా న్ని ప్రారంభించి మాట్లాడారు. నాణ్యమైన, తేమ శాతం తక్కువగా ఉన్న ధాన్యాన్ని కేంద్రానికి తీసుకురావాలని, అదేవిధంగా పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్కార్డు, వ్యక్తిగత బ్యాంకు బుక్ జిరాక్స్లు, సాగు పత్రము వెంట తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో ఏవో రాజేంద్ర అగర్వాల్, మార్కెట్ కార్యదర్శి జయలక్ష్మి పాల్గొన్నారు.
మరికల్, ఏప్రిల్ 1 : మండల కేంద్రంలోని సింగిల్విండో భవనంలో వ్యవసాయశాఖ అధికారులు, సింగిల్విండో అధికారులు సోమవారం వరి కొనుగోలు కేం ద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏ గ్రేడ్ రకానికి క్వింటాకు ధర రూ. 2,203, సా ధారణ రకానికి రూ.2,183 ఇస్తామన్నారు. కార్యక్రమం లో ఎంపీటీసీలు సుజాత, గోపాల్, సింగిల్విండో డైరెక్ట ర్లు, సీఈవో వెంకట్రాములు, జిల్లా నాయకులు సూర్యమోహన్, గొల్ల కృష్ణయ్య, నాయకులు పాల్గొన్నారు.
ధన్వాడ, ఏప్రిల్ 1 : మండలంలోని గోటూర్లో ధ న్వాడ సింగిల్విండో ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేం ద్రాన్ని విండో సీఈవో వెంకట్రాములు ప్రారంభించారు. కార్యక్రమంలో మాజీ స ర్పంచ్ నాగేశ్వర్రెడ్డి, నా యకులు బాలరాజు, కిషన్గౌడ్, నర్సింహులు, కృష్ణయ్య, మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కృష్ణ, ఏప్రిల్1 : మండలంలోని హిందూపూర్, మురహరిదొడ్డి గ్రామాల్లో తాసీల్దార్ దయాకర్రెడ్డి, ఎంపీవో రాములు ధా న్యం కొనుగోలు కేంల్రను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతు లు ధాన్యాన్ని దళారులకు కాకుండా కొనుగోలు కేం ద్రాల్లోనే విక్రయించి లా భం పొందాలన్నారు. కార్యక్రమంలో మహిళా సమాఖ్య అధ్యక్షురాలు మారెమ్మ, ఏపీ ఎం బస్వరాజ్, కమిటీ సభ్యులు, రైతులు పాల్గొన్నారు.
ఊట్కూర్, ఏప్రిల్ 1: మండలంలోని తిప్రాస్పల్లిలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని జిల్లా మార్కెటింగ్ శాఖ మానిటరింగ్ అధికారి షాకీర్ పాషా, పీఏసీసీఎస్ చైర్మన్ హుస్సేన్ రైతులతో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో పీఏసీసీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.
మూసాపేట(అడ్డాకుల), ఏప్రిల్ 1 : అడ్డాకులలో సింగిల్విండో ఆధ్వర్యంలో, చిన్నమునుగల్చేడ్, తిమ్మాయిపల్లి, బలీదుపల్లి, వర్నె గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను డీఆర్డీవో నర్సింహులు సోమవారం ప్రారంభించారు. కార్యక్రమంలో తాసీల్దార్ మదన్మోహన్గౌడ్, ఎంపీడీవో శ్రీనివాసులు, ఏవో శ్రీనివాసులు, సింగిల్విండో చైర్మన్ జితేందర్రెడ్డి, ఏపీఎం సుధీర్తోపాటు ఆయా గ్రామాల ఏఈవోలు, వీవోలు, సీసీలు తదితరులు పాల్గొన్నారు.