శ్రీరంగాపూర్, సెప్టెంబర్ 19 : మండలకేంద్రానికి చెందిన రంగస్వామి అనారోగ్యంతో బాధపడుతున్న విషయాన్ని బీఆర్ఎస్ నాయకుడు రాధాకృష్ణ మంత్రి నిరంజన్రెడ్డికి వివరించాడు. తక్షణమే స్పందించిన మంత్రి సీఎంఆర్ఎఫ్ కింద రూ.లక్ష మంజూరు చేశారు.
అందుకు సంబంధించిన ఎల్వోసీని మంగళవారం హైదరాబాద్లోని మంత్రుల నివాసంలో బాధితుడికి మంత్రి అందజేశారు. ఆపద సమయంలో ఆదుకున్న మంత్రికి బీఆర్ఎస్ నాయకులు, బాధితుడు రంగస్వామి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.