ఊట్కూర్: సీఎం రిలీఫ్ ఫండ్ పేద ప్రజలకు వరం లాంటిదని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోన్రెడ్డి అన్నారు. మండలంలోని నిడుగుర్తి గ్రామానికి చెందిన ఎస్. సుధాకర్రెడ్డికి రూ. 52 వేలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును మంగళవారం ఎమ్మెల్యే అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అనారోగ్యానికి గురై దవాఖాన ఖర్చులు భరించ లేని వారికి ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. సీఎం సహాయ నిధికి కృషి చేసిన ఎమ్మెల్యేకు బాధిత కటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నిడుగుర్తి మాజీ సర్పంచ్ విజయభాస్కర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.