కోడేరు, మే 6 : పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ గెలుపు ఖా యమని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి పేర్కొన్నారు. కోడేరులో సోమవారం నిర్వహించిన రోడ్ షోలో ఆర్ఎస్పీతో కలిసి పాల్గొని మాట్లాడారు. రైతులను నమ్మించి మోసం చేసి గద్దెనెక్కిన సీఎం రే వంత్రెడ్డికి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని సూచించారు. కేసీఆర్ హయాంలో వడ్లను గిట్టుబాటు ధర కు కొన్నామని.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ. 2,500 మద్దతు ధరతోపాటు క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తామన్న రేవంత్ ఇప్పుడు రైతులు రూ. 1,800కే అమ్ముకుంటుంటే ఏం చేస్తున్నాడని ప్ర శ్నించారు. ఒక్క హామీని అమలుచేయని కాంగ్రెస్ పార్టీకి ఓటు ఎలా వేస్తారని ప్రశ్నించారు. లంకె బిం దెలున్నాయనుకున్నా అంటాడు.. ముఖ్యమంత్రి స్థా యిలో ఉండి ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడి తె లంగాణ పరువు తీస్తున్న ప్రభుత్వాన్ని ఓడించాలని ప్రజలకు సూచించారు. ఓట్ల కోసం కాంగ్రెసోళ్లు వ స్తే మహిళలు చీపుర్లతో బుద్ధి చెప్పాలన్నారు. అనంతరం పాన్గల్ మండలం కదిరేపాడుకు చెందిన వీరపాగ కృష్ణయ్య సహా పదిమంది బీఎస్పీ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ సమక్షంలో కారెక్కా రు. వారికి మాజీ ఎమ్మెల్యే బీరం గులాబీ కండువా లు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్ఎస్పీ గెలుపు కోసం బీఎస్పీని వదిలి బీఆర్ఎస్లో చేరుతున్నామని ప్రకటించారు. పార్టీలో చేసిన వారిలో కృష్ణయ్య, శాంతిప్రకాశ్, నరేశ్, బాలకృష్ణ ఉన్నారు. రోడ్ షోలో నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి ఆంజనేయగౌడ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రఘువర్ధన్రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాజశేఖర్గౌడ్, ఎంపీపీ వెంకట్రాధ, మార్కెట్ కమిటీ చైర్మన్ కిషన్నాయక్, లిటిల్ సోల్జర్స్ యూత్ అసోసియేషన్ సభ్యులు ఉన్నారు.