మహబూబ్నగర్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని పార్టీలు ఉమ్మడి జిల్లాపై ఫోకస్ పెట్టాయి. మహబూబ్నగర్లో వరుసగా మూడుసార్లు విజయం సాధించిన గులాబీ పార్టీ ఈసారి కూడా గెలుపుపై ధీమాలో ఉన్నది. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలోని రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో అ భ్యర్థులకు మద్దతుగా గులాబీ బాస్ ప్రచారం చేపట్టనున్నారు. సీఎం రేవంత్రెడ్డి ఇప్పటికే రెండుసార్లు ప్రచారంలో పాల్గొనగా బీజేపీ కూడా ప్రధాని మోదీ, అమిత్షాతో ప్రచారానికి ప్లాన్ చేస్తున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక జరుగుతున్న మొదటి పార్లమెంట్ ఎ న్నికలు, సీఎం రేవంత్ సొంత జిల్లా కావడంతో అన్ని పార్టీలు పాలమూరుపైనే దృష్టి పెట్టాయి. ఎలాగైనా అధికార పార్టీని ఓడించాలని బీఆర్ఎస్, బీజేపీ కంకణం క ట్టుకున్నాయి. ఇప్పటికే రెండు ఎంపీ స్థానాలకు అభ్యర్థులు ఖరారు కాగా వారంతా ప్రచారంలో బిజీ అయిపోయారు. మరోవైపు అధికార యంత్రాంగం ఎన్నికల నియమావళి ప్రకారం నామినేషన్ల ప్రక్రియను కొనసాగిస్తున్నారు. రెండో రోజు ఉమ్మడి జిల్లాలో మొత్తం ఆరు నామినేషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్కు సీఎం హాజరై అభ్యర్థితో కలిసి రిటర్నింగ్ అధికారికి నామపత్రాలను అందజేశారు. నాగర్కర్నూల్ పా ర్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి బీఆర్ఎస్ అ భ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ తన నామినేషన్ పత్రాన్ని రిటర్నింగ్ అధికారికి అందజేశారు. మహబూబ్నగర్ పార్లమెంట్ నుంచి ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేశారు..
పార్లమెంట్ ఎన్నికలు సీఎం సొంత జిల్లాలో ఆ పా ర్టీకి ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. అభ్యర్థి తరఫున సీఎం రెండుసార్లు ప్రచారం చేయడమే ఇందుకు నిదర్శ నం. అంతకుముందు కోస్గిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవానికి వచ్చిన సీ ఎం ఏకంగా పాలమూరు పార్లమెంట్ అభ్యర్థిని ప్రకటిం చి ఆశావహుల ఆశలపై నీళ్లు చల్లారు. ఆ తర్వాత నారాయణపేటలో జరిగిన జనజాతర సభలో సీఎం పాల్గొని అభ్యర్థి తరఫున ప్రచారం చేశారు. సొంత జిల్లా కావడం తో ఏకంగా నామినేషన్కు సైతం హాజరయ్యారు. కాగా హస్తం అభ్యర్థికి బీఆర్ఎస్, బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదురవుతున్నది. ఈ నేపథ్యంలోనే గులాబీ, కమలం పార్టీ నేతలకు కాంగ్రెస్ నాయకులు గాలం వేస్తున్నారు.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పట్టు సాధించేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తున్నది. కేసీఆర్ 2009లో ఎంపీగా గెలిచి 2014లో తెలంగాణ రాష్ర్టాన్ని సాధించా రు. ఆ తర్వాత జరిగిన వరుస ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. నాగర్కర్నూల్ పార్లమెంట్లో కూడా 2014, 2019లో గులాబీ అభ్యర్థులు గె లుపుజెండా ఎగురవేశారు. ఈసారి కూడా గులాబీ బా వుటా ఎగురవేయాలని నేతలు కృత నిశ్చయంతో ముం దుకు సాగుతున్నారు. ఈక్రమంలోనే ఎంపీ అభ్యర్థుల ప్రచారానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రానున్నారు. ఈ మేరకు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కేసీఆర్ టూర్ షెడ్యూల్ను ఖరారు చేస్తున్నారు.
రెండోరోజైన శుక్రవారం మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఐదు, నాగర్కర్నూల్ పార్లమెంట్కు ఒకటి మొత్తం ఆరు నా మినేషన్లు దాఖలయ్యాయి. మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానానికి బీఆర్ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డి తరఫున ప్రతిపాదకులు టి.శ్రీధర్రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. నాగర్కర్నూల్ పార్లమెంట్ స్థానానికి బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్.. మాజీ మంత్రి నిరంజన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, మర్రి జనార్దన్రెడ్డి, జైపాల్యాదవ్తో కలిసి నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశా రు. మహబూబ్నగర్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి రెండు సెట్లను దాఖలు చేశా రు. స్వతంత్ర అభ్యర్థులుగా హరీందర్రెడ్డి, ఎస్. సరోజనమ్మ, ఉమాశంకర్ నామినేషన్ వేశారు.