దేవరకద్ర, నవంబర్ 5 : దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో సోమవారం జరిగే ప్రజా ఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. శాసనసభ ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్ వస్తున్న సందర్భంగా నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ బా లుర ఉన్నత పాఠశాల సమీపంలో 11 ఎకరాల 8 గుంటల స్థలంలో సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి మూడు రోజులుగా సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. 70వేల మంది ప్రజలు కూర్చునేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. అదేవిధంగా సభ వద జర్నలిస్టులు, మహిళలు, పురుషులు వేర్వేరుగా కూర్చునేలా బారికేడ్లను ఏర్పాట్లు చేశా రు. సభకు వచ్చే ప్రజల వాహనాల రాకపోకలతో ఎలాంటి ఇబ్బంది లేకుండా మూడు ప్రాంతాల్లో వాహనాలు అపేందుకు పార్కింగ్ స్థలాలు ఏర్పా టు చేశారు. సీఎం కేసీఅర్ సభకు నియోజకవర్గంలోని 8 మం డలాల నుంచి పెద్ద ఎత్తున్న ప్రజలు తరలిరానున్నారు. మూ డోసారి సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి గెలిస్తే నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని ప్రజలు భావిస్తున్నారు.
ప్రజా ఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్ హాజరుకానుండడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటలకు నిర్వహించే సభకు సీఎం కేసీఆర్ హెలికాప్టర్లో రానున్నారు. ఈ క్రమంలో సభతోపాటు హెలీప్యాడ్, కాన్వాయ్, పార్కింగ్, సభాప్రాంగణం, ప్రధాన రహదారులు తదితర ప్రాంతాల్లో దాదాపు 500 మందికిపైగా పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎస్పీ హర్షవర్ధన్రెడ్డి ఆధ్వర్యంలో ముగ్గురు ఏఎస్పీలు, ఐదుగురు డీఎస్పీలు, 40 మంది ఎస్సైలతోపాటు పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా అగ్నిమాపక శాఖ ఫైర్ ఇంజిన్తో పాటు సిబ్బందిని ఏర్పాటు చేశారు.
భూత్పూర్, దేవరకద్ర మండలాల్లోని వివిధ గ్రామాల నుంచి వచ్చే వాహనాలను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద పా ర్కింగ్ చేయాలి. చిన్నచింతకుంట, దేవరకద్రలోని గ్రామాల నుంచి వచ్చే వాహనాలను రైయిచూర్ రోడ్డు పెట్రోల్ బంక్ ఎదుట పార్కింగ్ చేయాలి. కొత్తకోట, మధనాపూర్, అడ్డాకుల, చిన్నచింతకుంట, దేవరకద్ర వైపు నుంచి వచ్చే వాహనాలను అమ్మాపూర్ రోడ్డు హెచ్పీ గ్యాస్ సీలిండర్ గోదాం వద్ద పార్కిగ్ చేయాలి.