అమ్రాబాద్, సెప్టెంబర్ 7 : అచ్చంపేట నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ త్వరలో పర్యటించనున్నారని విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తెలిపారు. బుధవా రం మన్ననూర్ గ్రామంలో నిర్వహించిన ముఖ్య కా ర్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అచ్చంపేట, అమ్రాబాద్, పదర మండలాలకు సాగునీరు అందించాలన్న ఉద్దేశంతో నిర్మించనున్న ఉమామహేశ్వర, చెన్నకేశవస్వామి రిజర్వాయర్లకు శంకుస్థాపన చే యనున్నారని తెలిపారు.
వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్కు భారీ మెజారిటీ వచ్చేలా కృషి చేయాలని కోరారు. అ నంతరం వెంకటేశ్వర్లబావి గ్రామానికి చెందిన 20 మంది కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి విప్ సమక్షం లో టీఆర్ఎస్లో చేరారు. వీరికి కండువాలు కప్పి పా ర్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రవీందర్రెడ్డి, సర్పంచులు శారద, శ్రీరాంనాయక్, నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.