చారకొండ, ఆగస్టు 6: రైతుల సంక్షేమానికి అనేక పథకాలను ప్రవేశపెట్టి అండగా నిలుస్తున్న రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ అని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. శనివారం మండలంలోని శిరుసనగండ్లలో విప్ గువ్వల జెడ్పీ వైస్చైర్మన్ బాలాజీసింగ్తో కలిసి రైతువేదికను ప్రారంభించారు. అంతకుముందు ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విప్ గువ్వల మాట్లాడుతూ దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని అన్నారు. రైతులకు పెట్టుబడి సాయం, 24గంటల విద్యుత్, రైతుబీమా ద్వారా రూ.5లక్షలు అందజేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం రైతాంగాన్ని నిర్వీర్యం చేసేందుకు కార్పొరేట్ విధానాలు అవలంభిస్తున్నదని ధ్వజమెత్తారు.
మండలంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించి సస్యశామం చేస్తానన్నారు. రైతువేదిక స్థల దాతలకు శాలువా, పూలమాలతో విప్ సన్మానించారు. అనంతరం కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ యాతం శారద, ఎంపీపీ నిర్మల, సింగిల్విండో చైర్మన్ గురువయ్యగౌడ్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు గజ్జె యాదయ్యగౌడ్, డీఏవో వెంకటేశ్వర్లు, తాసిల్దార్ నాగమణి, ఏవో చిన్నహుస్సేన్, ఏఈవో వంశీ, పీఆర్ఏఈ మౌనిక, సర్పంచులు అనిశెట్టి శ్రీను, నరేందర్రెడ్డి, ప్రశాంత్నాయక్, మహేశ్, రాజునాయక్, నరేశ్నాయక్, ఎంపీటీసీ లక్ష్మణ్నాయక్, ఉపసర్పంచ్ శ్రీను, మండల కోఆప్షన్ సభ్యుడు సలీం, పార్టీ మండల అధ్యక్షుడు రవీందర్, నాయకులు జగ్జీవన్రెడ్డి, మోహన్రెడ్డి, కృష్ణారెడ్డి, రమేశ్, రాంకొండ, రామకృష్ణ, చండీశ్వర్, కమలాకర్రావు, శ్రీనుగౌడ్ పాల్గొన్నారు.