సీఎం కేసీఆర్ తీసుకున్న చర్యలతో రాష్ట్రంలో నీలి విప్లవం సంతరించుకున్నదని, మత్స్య సంపదలో రాష్ట్రం దేశంలోనే నెంబర్వన్గా నిలిచిందని పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం వనపర్తి జిల్లా పెబ్బేరు పట్టణంలోని పీవీ నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయంలోని మత్స్య కళాశాల బాలికల వసతి గృహం, చేపల చెరువు, సీసీ రోడ్డును మంత్రి నిరంజన్రెడ్డితో కలిసి తలసాని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ స్వరాష్ట్రం ఏర్పాటయ్యాక జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఎగుమతులు చేసే దశకు మత్స్య సంపద పెరిగిందన్నారు.
వనపర్తి, మే 21 (నమస్తే తెలంగాణ) : మత్స్య సంపదలో తెలంగాణ నెంబర్వన్గా నిలిచిందని మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఎగుమతులు చేసే దశకు మత్స్యసంపద పెరిగిపోయిందన్నారు. వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డితోకలిసి మంత్రి పెబ్బేరు పట్టణంలోని పీవీ నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయంలోని మత్స్యకళాశాల బాలికల వసతిగృహాన్ని, చేపల చెరువు, సీసీరోడ్డును మంత్రి తలసాని శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి తలసాని మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో మత్స్యకారులను గుర్తించలేదని, తెలంగాణ రాష్ట్రం వచ్చాక ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు మత్స్యసంపదను పెంచేందుకు కృషి చేశారని అన్నారు. రూ.4.55కోట్లతో మత్స్య కళాశాలను ప్రారంభించినట్లు, రూ.1.20 కోట్లతో సీసీరోడ్డు, రూ.0. 30 కోట్లతో చేపల చెరువులు ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. మత్స్య సంపద వల్ల రాష్ట్రంలోని 30లక్షల మంది మత్స్యకారులు లబ్ధిపొందుతున్నారని, 23వేల చెరువులను జియోట్యాగింగ్ చేసినట్లు ఆయన చెప్పా రు.
ప్రభుత్వం నుంచి మత్స్యకారులకు ఉచితంగా చేపపిల్లలను అందజేస్తున్నామన్నారు. 2018లో ప్రారంభమైన మత్స్యకారులకు చేపల పెంపకం కార్యక్రమం నేడు గ్రామగ్రామానా విస్తరించిందన్నారు. నీరుఉన్న ప్రతిచెరువులో ఉచితంగా చేపపిల్లలను వదిలి మత్స్యకారులకు అప్పగించి వారి జీవనోపాధికి అవకాశం కల్పిస్తున్నామన్నారు. గతంలో కరెంటు ఉండేది కాదని ప్ర స్తుతం ఇరవై నాలుగు గంటలు ఉచితంగా కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రమని వివరించారు. మిషన్కాకతీయ ద్వారా వేలాది చెరువుల్లో పూడికతీసి కట్టుదిట్టంచేసి నీటి నిల్వలు పెంచడం వల్ల మత్స్యకారులకు ఉపా ధి లభిస్తుందన్నారు. మత్స్య కళాశాల కోసం కరీంనగర్, ఖమ్మం జిల్లా నుంచి పోటీ ఉన్నప్పటికీ మంత్రి నిరంజన్రెడ్డి కృషివల్లే పెబ్బేరుకు మత్స్యకళాశాల వచ్చిందని తలసాని చెప్పారు.
చేపల పెంపకంతో మంచి ఆదాయం
చేపల పెంపకంతో అధిక ఆదాయం వస్తుందని వరిపంటకు మించి ఆదాయం లభిస్తుందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అభిప్రాయపడ్డారు. పెబ్బేరు మత్స్య కళాశాల దేశానికే ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామన్నారు. మత్స్య కళాశాలను పీజీ కళాశాలగా అప్గ్రేడ్ చేసి పరిశోధన కూడా ఉండేలా కృషి చేస్తామన్నారు. నలభై ఎకరాల్లో దీనిని విస్తరించనున్నామని అన్నారు. రాష్ట్రంతోపాటు ఇతర రాష్ర్టాల విద్యార్థులు కూడా పీజీ కళాశాలలో చదువుకునేందుకు వస్తారని అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కళాశాలను తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. టన్నులకొద్దీ చేపలను ఉత్ప త్తి చేసే ఏకైక రాష్ట్రంగా తెలంగాణ అభివృద్ధి సాధించిందన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో చేపలకు మం చి డిమాండ్ ఉందని, అదే కోవలో మత్స్యకారులు ఆర్థికాభివృద్ధి చెందుటకు అవకాశం కల్పిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. మత్స్యకళాశాల ఏర్పాటు చేయడం ద్వారా ఉద్యోగావకాశాలు పుష్కలంగా ఉంటాయని మంత్రి వివరించారు. కార్యక్రమంలో భాగంగా చేపల కట్లెట్ బ్రోచర్లను మంత్రులు విడుదల చేశారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ లోక్నాథ్రెడ్డి, కలెక్టర్ షేక్ యాస్మిన్బాషా, మున్సిపల్ చైర్పర్సన్ కరుణశ్రీ, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్యామల, ఎంపీపీ శ్యామల, మున్సిపల్ వైస్చైర్మన్ కర్రెస్వామి, వీసీ రవీందర్రెడ్డి, మత్స్య కళాశాల అధికారులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధిని చూసే పార్టీలోకి వలసలు
వనపర్తి రూరల్, మే 21 : నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాలను చూసి ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలోకి వలస వస్తున్నారని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాం పు కార్యాలయంలో రాజపేట గ్రామానికి చెందిన 50 మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సర్పంచ్ జ్యోతి మాధవరెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్లో చేరారు. వీరికి మంత్రి గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆ హ్వానించారు. కార్యక్రమంలో ఎంపీపీ కిచ్చారెడ్డి, రాజపేట టీఆర్ఎస్ నాయకులు మాధవరెడ్డి, బాలరాజు, కంచెమోని రాములు, రాజు, కురుమన్న, సత్యన్న, వెం కట్రాములు, గోపాల్, రాజు, ఆంజనేయులు, మహేశ్, యేసు, పుట్టలయ్య, వినయ్, నాగరాజు పాల్గొన్నారు.
సీఎం సహాయనిధి కొండంత అండ
వనపర్తి, మే 21 : అనారోగ్యం బారినపడి మెరుగైన వైద్యం చేయించుకున్న బాధితులకు సీఎం సహాయనిధి కొండంత అండ అని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 66 మంది బాధితులకు సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ.19, 68,500 చెక్కులను మంత్రి నిరంజన్రెడ్డి అందజేశారు. అనంతరం బాధితులతో కలిసి అల్పాహారం చేశా రు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, వైస్చైర్మన్ వాకిటి శ్రీధర్, ఎంపీపీ కిచ్చారెడ్డి, గొర్రెల కాపరుల సహకార సంఘం జిల్లా అధ్యక్షుడు కురుమూర్తియాదవ్, కౌన్సిలర్లు పాకనాటి కృష్ణయ్య, బాష్యానాయక్, బండారు కృష్ణ, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు రమేశ్గౌడ్, ప్రధాన కార్యదర్శి ఆవుల రమేశ్, మండల యువజన సంఘం అధ్యక్షుడు చిట్యాల రాము, నాయకులు తిరుమల్, రహీం, జోహెబ్, శివ, రాము, శరవం ద, పరంజ్యోతి, వెంకటేశ్తోపాటు వివిధ గ్రామాల నా యకులు పాల్గొన్నారు.