మక్తల్ (ఊట్కూర్), నవంబర్ 6: మక్తల్ పట్టణంలో ఎల్లమ్మకుంట గార్లపల్లి రోడ్డు వద్ద సోమవారం నిర్వహించిన సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ సక్సెస్ అయ్యింది. సభకు అనుకున్న దానికంటే ఎక్కువ సంఖ్యలో ప్రజలు తరలిరా వడంతో గులాబీ శ్రేణుల్లో ఫుల్ జోష్ నిండింది. మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సభకు నియోజకవర్గంలోని ఆత్మకూర్, అమరచింత, ఊట్కూర్, నర్వ, మాగ నూర్, కృష్ణ మండలాలతో పాటు మక్తల్ పరిసర గ్రామాల నుంచి జనం తండోప తండాలుగా తరలివచ్చారు. మహిళలు, వృద్ధులు, రైతులు, కార్మికులు పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా తరలి రావడంతో సభా ప్రాంగణం పడమటి అంజన్న జాతరను తలపించింది. గ్రామాల నుంచి ప్రజలు, డోళ్లు, డప్పులతో తరలిరాగా మక్తల్ పట్టణం డప్పు చప్పుళ్ల మోత మోగింది. మెడలో బీఆర్ఎస్ కండువా, చేతిలో గులాబీ జెండాతో యువతీ యువకులు, మహిళలు కేరింతలు కొడుతూ రహదారుల వెంబడి నృత్యం చేశారు. జై తెలంగాణ.. జైజై కేసీఆర్..చిట్టెం రామన్న నాయకత్వం వర్దిల్లాలి అంటూ నినాదాలతో హోరెత్తించారు. నా యీబ్రాహ్మణులు బ్యాండు మేళాలు, గిరిజన మహిళల నృత్యాలతో ఉత్సవ వాతావరణం నెలకొంది. ప్రజా ఆశీర్వాద సభకు హాజరై ప్రజలకు కూర్చున్న చోటుకే బీఆర్ఎస్ కార్యకర్తలు నీళ్ల బాటిళ్లను అందించారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు సీఎం కేసీఆర్ను చూపించేందుకు వెంట తీసుకురావడంతో వారు సంబురపడి నృత్యం చేశారు.
సాయంత్రం 5:15 గంటలకు హెలిప్యాడ్ నుంచి నేరుగా సభా ప్రాంగణానికి చేరుకోగానే సీఎం కేసీఆర్ వేదికపై నుంచి ప్రజ లకు అభివాదం చేశారు. ఈ సందర్భంగా ప్రజలు తమ అభి మాన నేత గులాబీ దళపతికి ఈలలు, చప్పట్లతో స్వాగతం పలికారు. ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కుర్చీలు పూర్తిగా నిండి వేలాది మంది సభ వెలుపలనే ఉండి కేసీఆర్ ప్రసంగాన్ని ఓపికగా విన్నారు. 5:20 గంటలకు సీఎం ప్రసంగాన్ని ప్రారంభించి 5:25 కు ముగించారు. ప్రజలు ఎన్నికల్లో విచక్షణతో ఓటు వే యాలని కోరారు. పాలమూరు జిల్లాను కాంగ్రెస్ పార్టీ నాషనం పట్టించిందని, వాల్మీకి బోయలను ముంచిందే కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండే రోజున ఆంధ్ర బోయలను ఎస్టీలుగా పెట్టి మన తెలంగాణ బోయలను మాత్రం బీసీలుగా పెట్టారన్నారు. కాంగ్రెస్ మొదటి ముఖ్యమంత్రి చేసిన పాపమే మనం నేటికి బాధపడుతున్నా మని చెప్పారు. సంగంబండ, భీమా ప్రాజెక్టు పనులను ఏండ్ల తరబడి పెండింగ్లో పెట్టారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధి కారంలోకి వచ్చిన తర్వాతనే ప్రాజెక్టును పూర్తి చేసుకుని అతి ఎక్కువ ఆయకట్టుకు సాగునీరు అందించుకున్నామన్నారు. మక్తల్ కూడా నెంబర్ వన్ స్థానంలో ఉండటం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే (చిట్టెం రామ్మోహన్రెడ్డి) మాట జర గట్టిగా ఉంటది కానీ మనసు మాత్రం వెన్నలాంటిదని చెప్పగానే ప్రజలు ఈలలు, చప్పట్లతో కేరింతలు కొట్టారు.
అర్ధరాత్రి అయినా మక్తల్ చేరుకుంటారని హైదరాబాద్లో ఉండే వ్యక్తి కాదన్నారు. ఎమ్మెల్యే హయాంలో మక్తల్ బ్రహ్మండమైన అభివృద్ధి సాధించిందని మెచ్చుకున్నారు. హెలికాప్టర్ మొరాయించడంతో కనీసం మీ అందరినీ కలిసి సమస్కారం చేసి పోదామని వచ్చానని, 30 తారీఖున కారుగుర్తుకు ఓటేసి మీ ఎమ్మెల్యేను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికలు అయిన తర్వాత మీకు ఒక హామీ ఇస్తున్నాను…నేనే స్వయంగా మక్తల్ వస్తాను రామ్మోహన్రెడ్డి ఇంట్లోనే ఉంటాను ఒక దినం మొత్తం పార్టీ, నాయకులు, అధికారులతో గడిపి మక్తల్ తాలుకాలో ఉన్న పనులన్నీ కూడా స్వయంగా చేసి పెడతానన్నారు. రామ్మోహన్రెడ్డిని గతంకంటే 10 వేలు ఎక్కువ మెజార్టీతో గెలిపించాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే చిట్టెం సతీమణి, రైతు బంధు సమితి జిల్లా సభ్యురాలు చిట్టెం సుచరిత, ఎన్నికల ఇంఛార్జి ఆంజనేయగౌడ్, రాష్ట్ర గిడ్డంగుల శాఖ కార్పోరేషన్ చైర్మన్ వేద రజిని, వివిధ మండలాల ఎంపీపీలు ఎల్కోటి లక్ష్మి, వనజ, జయరాములు శెట్టి, సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు సూర్యప్రకాశ్రెడ్డి, జడ్పీటీసీలు అశోక్కుమార్గౌడ్, ఆత్మకూర్ మున్సిపల్ చైర్మన్ గాయత్రి, వెంకటయ్య, నాయకులు శ్రీనివాస్గుప్త, మహిపాల్రెడ్డి, నర్సింహాగౌడ్, అరవింద్కుమార్, సుధాకర్రెడ్డి, ఎల్లారెడ్డి, ఆశిరెడ్డి, లలిత ముదిరాజ్, వివిద గ్రామాల సర్పంచులు, తదితరులు పాల్గొన్నారు.
తమ అభిమాన నాయకుడు, బీఆర్ఎస్ రథసారథి కేసీఆర్ కోసం వివిధ గ్రామాల నుంచి ప్రజలు ఉదయం 11 గంటలకే సభా వేదిక వద్దకు చేరుకున్నారు. దేవరకద్ర, గద్వాల సభలను ముగించుకుని మక్తల్ సభకు వచ్చేందుకు సాయంత్రం 5 గంటలు దాటినా యువకులు, మహిళలు కుర్చీల నుంచి కదలకుండా కళాకారులు అమరచింత డీసీ రాజశేఖర్ బృందం, మానకోట ప్రసాద్ ఆట పాటలకు గులాబీ జండాలతో నృత్యం చేశారు.