వనపర్తి, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ) : సీఎం కేసీఆర్ వనపర్తి జిల్లా పర్యటన దాదాపుగా ఖరారైంది. వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవా లు చేయనున్నారు. ఇందుకు సంబంధించి రూట్మ్యాప్ సిద్ధమైంది. ఈ నెల 18 లేదా 19వ తేదీన పర్యటన ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఆగస్టులోనే సీ ఎం రానుండగా, వివిధ అభివృద్ధి పనులు, ముఖ్యమైన సమావేశాలు, ఎన్నికలు, కోడ్ నిబంధనలు ఉండడంతో కుదరలేదు. వనపర్తి కలెక్టరేట్తోపాటు మార్కెట్యార్డు, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, డబుల్ బెడ్రూం ఇం డ్లు, టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాలు నిర్మాణం పూ ర్తి చేసుకొని ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి. క్యాంపు కార్యాలయానికి సంబంధించి మంచి రోజులు ఉండడంతో కేవలం పూజా కార్యక్రమాలు చేశారు. కాగా, సీఎం కేసీఆర్ జిల్లా పర్యటన నేపథ్యంలో వాటిని ప్రారంభించనున్నారు. అలాగే మెడికల్, నర్సింగ్ కళాశాల నిర్మాణాల పరిశీలనతోపాటు గొర్రెల పునరుత్పత్తి కేంద్రం, వేరుశనగ పరిశోధన కేంద్రం, వనపర్తి ఇంటిగ్రేటెడ్ మార్కెట్, ఖిల్లాఘణపురంలోని కర్నెతండా లిఫ్ట్కు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. సీఎం పర్యటనకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పెండింగ్లో ఉన్న పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు. ఈ పనులను వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, కలెక్టర్ షేక్ యాస్మిన్బాషా ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. అధికారులతో సమీక్ష జరిపి బాధ్యతలు అప్పజెప్పారు. అన్ని శాఖల ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశానికి హాజరుకాని అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రూట్మ్యాప్..
సీఎం కేసీఆర్ పర్యటనకు రూట్మ్యాప్ సిద్ధమైంది. హైదరాబాద్ నుంచి రోడ్డుమార్గంలో లేదా హెలిక్యాప్టర్ లో ఖిల్లాఘణపురం చేరుకుంటారు. అక్కడ కర్నెతండా లిఫ్ట్కు శంకుస్థాపన చేస్తారు. ఇందుకుగానూ సోమవా రం ఇరిగేషన్ ఎస్ఈ సత్యశీలారెడ్డి, ఏఈ శంకర్, డీఈ సత్యనారాయణగౌడ్, దానయ్య, ఎంపీపీ కృష్ణానాయక్ సభా ప్రాంగణం, పార్కింగ్, హెలీప్యాడ్ ప్రాంతాన్ని పరిశీలించారు. లిఫ్ట్ శంకుస్థాపన తరువాత రోడ్డు మార్గంలో చిట్యాలకు చేరుకొని డబుల్బెడ్రూం ఇండ్లు, నాగవరంలోని టీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. వేరుశనగ పరిశోధన కేంద్రానికి శంకుస్థాపన చేసిన అనంతరం మార్కెట్యార్డును ప్రారంభిస్తారు. అనంతరం గొర్రెల పునరుత్పత్తి కేంద్రానికి శంకుస్థాపన చేసి.. కొత్తగా నిర్మించిన కలెక్టరేట్ను ప్రారంభిస్తారు. కలెక్టరేట్ నుంచి హైదరాబాద్కు హెలిక్యాప్టర్లో తిరిగి వెళ్లనున్నారు. కర్నెతండా, చిట్యాల మార్కెట్యార్డులో బహిరంగ సభ ఉంటుంది. పర్యటనలో భాగంగా 500 మంది రైతులతో కలిసి చిట్యాల మార్కెట్యార్డులో సహపంక్తి భోజనం చేయనున్నారు. భోజనం అనంతరం రైతుబంధు సమితి జిల్లా నాయకులు, పార్టీ మండలాధ్యక్షులు, ఆరుతడి పంటలతో అధిక దిగుబడులు సాధిస్తున్న రైతులతో ముచ్చటించనున్నారు.