దళిత, బీసీబంధు తరహాలో ఆర్థికంగా వెనుకబడిన మైనార్టీ వర్గాలను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ ‘మైనార్టీబంధు’ పథకానికి శ్రీకారం చుట్టారు. వంద శాతం సబ్సిడీతో రూ.లక్ష ఆర్థిక సాయం అందించేందుకు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారు. లబ్ధిదారుల ఎంపికను చేపట్టేందుకుగానూ సోమవారం నుంచి వచ్చే నెల 14వ తేదీ వరకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. జూన్ 2023 నాటికి 21 ఏండ్లు నిండి.. వార్షిక ఆదాయం గ్రామాల్లో రూ.1.50 లక్షలు, పట్టణాల్లో రూ.2లక్షలలోపు ఉన్న వారు మాత్రమే ఐప్లె చేసుకోవాలి. దరఖాస్తుల ప్రక్రియ ముగిసిన తరువాత ఆర్థిక చేయూతను అందించనున్నారు. దీంతో మైనార్టీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
– నాగర్కర్నూల్, జూలై 30 (నమస్తే తెలంగాణ)
నాగర్కర్నూల్, జూలై 30 (నమస్తే తెలంగాణ) : దళితబంధు, బీసీబంధు తరహాలో ఆర్థికంగా వెనుకబడిన మైనార్టీ వర్గాలను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ మైనార్టీ బంధు పథకాన్ని తీసుకొచ్చారు. ఈ పథకంలో భాగంగా వందశాతం సబ్సిడీతో రూ.లక్ష ఆర్థికసాయం అందించేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ను చేపట్టేందుకు గానూ ముందుగా సోమవా రం నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆ గస్టు 14వరకు దరఖాస్తులను స్వీకరించిన త ర్వాత పేద ముస్లిం, క్రిష్టియన్లకు ప్రభుత్వం ఆర్థికంగా చేయూతను అందించే బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించనున్నది.
రూ.లక్ష సాయానికి దరఖాస్తులు..
మైనార్టీ బంధు పథకం అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సీఎం కేసీఆర్ పేదల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ పథకాలు అమలు చేస్తూ ఇప్పటికే ఆసరా పింఛన్లు, డబుల్ బెడ్రూం ఇండ్లు, రైతుబంధు, రైతుబీమా, అంబేద్కర్ ఓవర్సీస్, చేపలు, గొర్రెల పంపిణీ, ఐటీడీఏ ద్వారా గిరిజనులకు, కంటి వెలుగు, కేసీఆర్ కిట్, కేసీఆర్ న్యూట్రీషన్ కిట్, ఆరోగ్యలక్ష్మి, గురుకులాలు, కార్పొరేట్ విద్యాపథకం, దళిత కుటుంబాలకు ఉచిత కరెంట్, నాయీబ్రాహ్మణులు, రజకులకు 250యూనిట్ల విద్యుత్ సబ్సిడీవంటి పథకాలను అమలు చేస్తోంది. ఈ క్రమంలో దళితులకు రూ.10లక్షలతో దళితబంధు అమలు చేస్తుండగా, ఇటీవలే బీసీల్లోని చేతివృత్తులను చేపడుతున్న 15కులాల ప్రజలకు రూ.లక్షతో బీసీ బంధు పథకాన్ని అమలు చేస్తున్నారు. దళితబంధుతో వేలాది మంది దళిత కుటుంబాలు ఆర్థిక చేయూతను పొంది ఆర్థికంగా బలపడుతున్నారు. బీసీబంధుతో ఈ వారంలో రూ.లక్ష సాయం అందనుంది. ఇలా ఆయా పథకాలు పేదల కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపుతున్నాయి.
ఈ క్రమంలో మైనార్టీలకు ఆర్థికంగా చేయూతను ఇచ్చేందుకు మైనార్టీ బంధు పథకాన్ని తీసుకురావడం గమనార్హం. దీనివల్ల ఒక్కో కుటుంబానికి బీసీబంధులా రూ.లక్ష సాయం అందనుంది. ఈ మేరకు గత ఆదివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఇప్పటికే మైనార్టీలకు షాదీ ముబారక్ పథకం ద్వారా పేద ఆడపడుచుల పెండ్లికి రూ.లక్ష ఆర్థికసాయం అందిస్తోంది. అలాగే 2015 నుంచి రంజాన్ను అధికారికంగా నిర్వహిస్తోంది. ప్రతి సంవత్సరం ఇఫ్తార్లు ఇస్తోంది. అలాగే 2017 నుంచి పేద ముస్లింలకు గిఫ్ట్ ప్యాకెట్ల రూపంలో బట్టలను పం పిణీ చేస్తోంది. అలాగే మైనార్టీ గురుకులాల తో మెకానిక్ పనులు చేసే ముస్లింలు ఉన్నత విద్యావంతులుగా మారుతున్నారు. ముఖ్యమంత్రి విదేశీ విద్యా స్కాలర్షిప్ పథకంతో ఉన్నత విద్యకు రూ.20లక్షల గ్రాంట్ను అందిస్తున్నది. ఇక ఇమామ్, మౌజమ్లకు గౌరవ వేతనాన్నీ ఇస్తున్నారు. ఇటీవలే కుట్టు మిషన్లు అందించే పథకానికి దరఖాస్తులను స్వీకరించింది. ఇక క్రైస్తవులకు అధికారికంగా క్రిస్మస్ పండుగను నిర్వహిస్తోంది. క్రిస్మస్ విందులు, పేదలకు దుస్తులను ఇస్తున్నది. చర్చీలకు రూ.2లక్షల చొప్పున అందజేసిం ది. మొత్తమ్మీద సీఎం కేసీఆర్ దళిత, గిరిజన, బీసీలతోపాటు పేదవర్గాలైన మైనార్టీలకు మైనార్టీ బంధు పథకం ద్వారా ఆర్థిక చేయూ త ఇచ్చేందుకు నిర్ణయించడంతో ఆయా వర్గాల్లో సంతోషం వ్యక్తమవుతోంది.
దరఖాస్తులు, అర్హతలు, ఎంపిక విధానం..
నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ..
మైనార్టీబంధు పథకం అమలుకు చర్యలు తీసుకుంటున్నాం. ఆన్లైన్లో దరఖాస్తులను సోమవారం నుంచి ప్రారంభించి ఆగస్టు 14వరకు స్వీకరిస్తాం. అర్హులైన ముస్లిం, క్రిష్టియన్ మైనార్టీలు నిర్దేశిత ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలి. లబ్ధిదారుల ఎంపిక తర్వాత ఒక్కో కుటుంబానికి రూ.లక్ష చొప్పున మైనార్టీ బంధు పథకం కింద ఆర్థికసాయం అందుతుంది.
– ఉదయ్కుమార్, కలెక్టర్, నాగర్కర్నూల్