మహబూబ్నగర్, డిసెంబర్ 6 : ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ ‘మన ఊరు-మనబడి’కి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే ఆంగ్లబోధన ప్రారంభంకాగా.. మౌలిక వసతులు కల్పించేందుకు నడుం బిగించింది. మహబూబ్నగర్ జిల్లాలో 835 పాఠశాలలు ఉండగా.., 88 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇందులో మొదటి విడుతగా 291 పాఠశాలలను అధికారులు ఎంపిక చేశారు. పూర్తిస్థాయిలో వసతులు కల్పించేందుకుగానూ రూ. 112.404 కోట్లు మంజూరు చేశారు. ఇప్పటివరకు రూ.6 కోట్లతో పను లు చేపట్టారు. మహబూబ్నగర్ అర్బన్ మండలంలోని 14 పాఠశాలల్లో పనులకుగానూ నాలుగుసార్లు టెండర్లు ఆహ్వానించినా.. ప్రక్రియ పూర్తి కాలేదు. కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఐదోసారి టెండర్లకు ఆహ్వానించి పనులు అప్పజెప్పేందుకు కృషి చేస్తున్నారు. మిగిలిన అన్ని పాఠశాలల్లో పనులు జరుగుతున్నాయి. రాజాపూర్, బాలానగర్ మండలాల్లో మూ డు పాఠశాలలు, మిగిలిన మండలాల్లో 2 పాఠశాలల చొప్పున ఇప్పటివరకు 34 పాఠశాలల్లో పనులు పూర్తయ్యాయి.
మన ఊరు-మనబడి కింద మహబూబ్నగర్ జిల్లాలో 291 పాఠశాలలను ఎంపిక చేశారు. చాలా పాఠశాలల్లో పనులు పూర్తయ్యాయి. త్వరలోనే పనులు పూర్తి కానున్నాయి. విద్యార్థులకు ఆహ్లాదకరంగా వాతావారణం అందించేలా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నాం. అధికారులతో పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. అన్ని రకాల వసతులు కల్పిస్తాం.
– ఎస్.వెంకట్రావు, కలెక్టర్, మహబూబ్నగర్