పరిగి, నవంబర్ 3 : ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చే ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ అని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పరిగి మున్సిపాలిటీ పరిధిలోని ఎనిమిదో వార్డులో ఎమ్మెల్యే మహేశ్రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత రెండు పర్యాయాలలో జరిగిన ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడం ద్వారా సీఎం కేసీఆర్ ప్రజాభిమానాన్ని చూరగొన్నారని చెప్పారు. ఎన్నికల సమయంలో చెప్పని అనేక పథకాలు రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మీ, షాదీముబారక్, కేసీఆర్ కిట్ వంటివి అమలు చేసిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందని అన్నారు. ఈసారి మ్యానిఫెస్టోలో పొందుపరిచిన 16 అంశాలు నెరవే రుస్తారనే భరోసా తెలంగాణ ప్రజలలో ఉందని, సీఎం కేసీఆర్ అంటేనే పేదలకు అండ అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదని కాలమే చెబుతుందన్నారు. గతంలో అధికారంలో ఉన్న సమయంలో ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసిందన్నారు.
ఇటీవల కర్నాటక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు కాం గ్రెస్ నెరవేర్చలేదని, మరోవైపు తెలంగాణలో హామీల పేరిట ప్రజలను ఏమార్చే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ను, ఆ పార్టీ హామీలను ప్రజలు నమ్మడం లేదని ఎమ్మె ల్యే తెలిపారు. రాష్ట్రంలో మరోసారి గులాబీ జెండా రెపరెపలాడడం ఖాయమన్నారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోపై ప్రజల్లో చక్కటి స్పందన కనిపిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్, మాజీ ఎంపీపీ కల్లు శ్రీనివాస్రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఆంజనేయులు, సీనియర్ నాయకుడు ప్రవీణ్కుమార్రెడ్డి, సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు అశోక్ వర్దన్రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ భాస్కర్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మంగు సంతోష్, కౌన్సిలర్లు వేముల కిరణ్, ఎదిరె కృష్ణ, మునీర్, బీఆర్ఎస్ నాయకులు అశోక్, మేడిగడ్డ శ్రీనివాస్, రవికుమార్, రాంరెడ్డి, శంకర్, సమద్ తదితరులు పాల్గొన్నారు.