తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగులకు రూ.3,016 నుంచి రూ.4,116కు పెంచడంతోపాటు వచ్చే నెల నుంచి అమలు చేస్తామనడంతో జిల్లా కేంద్రంతోపాటు ఆయా మండలాల్లోని పలు గ్రామాల్లో దివ్యాంగులు సీఎం కేసీఆర్, మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. అనంతరం స్వీట్లు పంచుకొని సంబురాలు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో మంత్రి శ్రీనివాస్గౌడ్ దివ్యాంగులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. సీఎం కేసీఆర్ పింఛన్లు పెంచడంతో ఆయనకు రుణపడి ఉంటామని పలువురు దివ్యాంగులు పేర్కొన్నారు.
దేవరకద్ర, జూన్ 10 : తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం దివ్యాంగుల సంక్షేమానికి అనేక సంక్షేమ పథకాలు అందిస్తుంది. అందులో భాగంగా సీఎం కేసీఆర్ దివ్యాంగులకు రూ.3,016 నుంచి రూ.4, 116లకు పింఛన్ను పెంచుతున్నట్లు ప్రకటించడంతో శనివారం దేవరకద్ర నియోజకవర్గ కేంద్రం లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మండల దివ్యాంగులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు జెట్టి నర్సింహారెడ్డి, నాయకులు శ్రీకాంత్యాదవ్, భా స్కర్రెడ్డి, ఆంజనేయులు, చాల్మారెడ్డి, యుగేంధర్రెడ్డి, దివ్యాంగులు పాల్గొన్నారు.
జడ్చర్ల మండలంలో..
జడ్చర్లటౌన్, జూన్ 10 : సీఎం కేసీఆర్ ది వ్యాంగులకు పింఛన్ను రూ.3,016 నుంచి రూ.4,116కు పెంచినందుకు కృతజ్ఞతగా శనివారం జడ్చర్ల మున్సిపాలిటీ ప రిధిలోని అంబేద్కర్ కూడలి లో దివ్యాంగుల సంఘం ఆ ధ్వర్యంలో సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి చిత్రపటానికి దివ్యాంగు లు క్షీరాభిషేకం చేశారు. అదేవి ధంగా మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డులో ది వ్యాంగులు సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మి, కౌన్సిలర్ సతీశ్, నాయకులు బిచ్యానాయక్, శ్రీను, సత్తయ్య, రవి, నిరంజన్, అక్బర్, సైదమ్మ, నిరంజన్ పాల్గొన్నారు.
భూత్పూర్లో..
భూత్పూర్, జూన్ 10 : దివ్యాంగుల పింఛన్ ను రూ.1000 పెంచడంతో మండల కేంద్రంలో దివ్యాంగుల ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్గౌడ్, దివ్యాంగుల సంఘం మం డలాధ్యక్షుడు జాకీర్, యాదయ్య, కృష్ణయ్య, హుస్సేన్, విజయ్కుమార్, లక్ష్మి ఉన్నారు.
మూసాపేటలో..
మూసాపేట, జూన్ 10 : మూసాపేట రెవెన్యూ కార్యాలయం ఎదుట, మూసాపేట రైతు వేదిక వద్ద దివ్యాంగులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు లక్ష్మీనర్సింహయాదవ్, బీసీ సెల్ మండలాధ్యక్షుడు కొండయ్య, సర్పంచ్ స్వరూప, ప్రకాశ్రెడ్డి, దివ్యాంగులు పాల్గొన్నారు.
అడ్డాకులలో..
మూసాపేట(అడ్డాకుల), జూన్ 10 : దివ్యాంగులకు రూ.4,116లు పింఛన్లు అందజేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తూ అడ్డాకుల మండలకేంద్రంలో ఎంపీపీ దోనూ రు నాగార్జునరెడ్డి ఆధ్వర్యంలో అడ్డాకులలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమం లో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, సింగిల్విం డో చైర్మన్ జితేందర్రెడ్డి, తిరుపతిరెడ్డి, కందూరు రామలింగేశ్వరస్వామి ఆలయ చైర్మన్ రమేశ్గౌడ్, కోఆప్షన్ సభ్యుడు ఖాజాగోరి, దివ్యాంగులు పాల్గొన్నారు.
‘సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం’
హన్వాడ, జూన్ 10 : దివ్యాంగులకు రూ.3,016 నుంచి రూ.4,116లు సీ ఎం కేసీఆర్ పెంచడంతో శనివారం మండలంలోని టంకర, హన్వాడ గ్రామా ల్లో దివ్యాంగులు సీఎం కేసీఆర్, మంత్రి శ్రీనివాస్గౌడ్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా దివ్యాంగులు దేశంలో ఎక్కడలేని విధంగా దివ్యాంగులకు సీఎం కేసీఆర్ పింఛన్లు పెంచడంతో ఆయనకు రుణపడి ఉంటామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ బాలరాజ్, నాయకులు రామణారెడ్డి, తేజ, మాధవులు, దస్తయ్య, రాజు, వీరేశ్, నర్సింహులు, కృష్ణయ్య, నర్సమ్మ, మంగమ్మ, యాదయ్య, జహంగీర్, తిరుపతయ్య, దివ్యాంగులు, తదితరులు పాల్గొన్నారు.