గిరిజన రైతుల్లో ‘పట్టా’నంత ఆనందం వెల్లివిరుస్తున్నది. దశాబ్దాల పోడు భూముల సమస్యకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపింది. చట్టబద్ధంగా హక్కులు కల్పిస్తూ పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా కొల్లాపూర్లో పట్టాల పండుగ అట్టహాసంగా జరిగింది. ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి 759 మందికి 1763.80 ఎకరాల భూ హక్కు పత్రాలను కర్షకులకు పంపిణీ చేశారు. భూ యజమానులందరికీ రైతుబంధు వర్తింపజేస్తామని ప్రకటించారు. గతంలో అటవీ శాఖ పెట్టిన కేసులను ఎత్తేస్తామని తీపికబురును అందించారు. దీంతో అన్నదాతల మోములో సంతోషం వెల్లివిరిసింది.
కొల్లాపూర్, జూలై 1 : పోడు భూముల పట్టాల కోసం ఎదురుచూసిన గిరిజనుల చిరకాల స్వప్నం ఎట్టకేలకు సీఎం కేసీఆర్ నెరవేర్చారు. పట్టణంలోని ఎస్ఎం గార్డెన్లో శనివారం కొల్లాపూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని పెద్దకొత్తపల్లి, కోడేరు, కొల్లాపూర్, పెంట్లవెల్లి మండలాల్లోని మొత్తం 759మంది గిరిజనులకు 1763.80 ఎకరాల పోడుభూముల పట్టాలను ఆర్డీవో హనుమానాయక్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీరం మాట్లాడుతూ.. పోడు పట్టాదారులందరికీ రైతుబంధు పథకం వర్తింపజేయనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా పోడు భూముల సాగు సందర్భంలో గిరిజనులపై అటవీశాఖ అధికారులు పెట్టిన కేసులన్నీ ఎత్తివేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయాన్ని ఎమ్మెల్యే గుర్తుచేశారు. దశాబ్దాలుగా ఎంతో మంది ముఖ్యమంత్రులు మారినా గిరిజనుల కుటుంబాల జీవనోపాధి కోసం సాగు చేసుకుంటున్న పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించలేదని, చరిత్రతో నిలిచిపోయేలా సీఎం కేసీఆర్ పట్టాలు అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపారని కొనియాడారు. మొదట్లో కొల్లాపూర్ మండలంలో అటవీ అధికారులు సర్వే చేసి కేవలం 56ఎకరాల భూమినే గుర్తించారని తెలిపారు. ఆర్డీవో తనకు చెప్పిన వెంటనే అటవీశాఖ అధికారులు అశాస్త్రీయంగా సర్వే చేశారని గుర్తించి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి మళ్లీ రీసర్వే చేయించి సాగులో ఉన్న 284మందికి 769.56 ఎకరాల పోడు భూములకు పట్టాలు ఇప్పించడం జరిగిందన్నారు. సాగులో ఉన్న ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలన్నదే తన ధ్యేయమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. మీ పరిపాలన మీరే చేసుకోవాలన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ 500 జనాభా కలిగిన తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి అన్ని రకాల మౌలిక వసతులు కల్పించారని గుర్తుచేశారు. తాగు, సాగునీరు, విద్యుత్, సీసీ రోడ్లు ఇవే కాకుండా మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు.
గతంలో ఎమ్మెల్యేగా జూపల్లి కృష్ణారావు ఈ ప్రాంత అభివృద్ధికి ఒరగబెట్టిందేమీ లేదని విమర్శించారు. తన ఉనికిని కాపాడుకోవడానికి సోషల్ మీడియా, కొన్ని ఛానళ్లను అడ్డం పెట్టుకొని బురదజల్లే పనులు చేస్తున్నారన్నారు. నియోజకవర్గ ప్రజలు గత ఎన్నికల్లో బుద్ధి చెప్పారని, చట్ట వ్యతిరేకంగా అపార్ట్మెంట్లు నిర్మించడం, చనిపోయిన వారి పేర్ల మీద బ్యాంకు రుణాలు పొందిన ఘనుడని ఆరోపించారు. వీపనగండ్ల మండలంలో కొంతమందితో ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తున్నారని, తన స్వార్థం కోసమే పదవులు తప్పా ప్రజలకు ఒరుగబెట్టిందేమీ లేదని మండిపడ్డారు. ఎవరెన్ని కుట్రలు చేసినా నిజాయితీ పనిచేసే ప్రభుత్వానికి ప్రజలు అండగా ఉంటారని తెలిపారు. చంద్రబండతండాలో సాంకేతిక కారణాల వల్ల కొంత మందికి పట్టాలు రాలేదని, సమస్య పరిష్కారమతుందని ఎమ్మెల్యే బీరం పేర్కొన్నారు.
నాగర్కర్నూల్ జిల్లాలోనే అత్యధికంగా పోడుపట్టాలు మంజూరుకావడం వెనుక ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి కృషి ఎంతో ఉన్నదని ఆర్డీవో హనుమానాయక్ అన్నారు. గిరిజనుల కోసం 40ఏండ్లుగా పోడు భూములు సాగుచేసుకుంటున్న గిరిజనులకు పండుగ వాతావరణంలో పట్టాలు పంపిణీ చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. డివిజన్ పరిధిలో మండలాల వారీగా ఎంత మందికి, ఎన్ని ఎకరాలకు పట్టాలు మంజూరైయ్యాయో చదివి వినిపించారు. అంతకు ముందుగా సభా ప్రాంగణంలో సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే బీరం చిత్రపటాలకు గిరిజనులు క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కిషన్నాయక్, వైస్ చైర్మన్ సోమనాథ్నాయక్, ఎంపీపీ భోజ్యానాయక్, మాజీ ఎంపీపీ వెంకటేశ్వర్రావు, మాజీ చైర్మన్ నరేందర్రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ జాఫర్, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి కమలాకర్రెడ్డి, సింగిల్ విండో చైర్మన్లు కృష్ణయ్య, కట్టా రాజేందర్గౌడ్, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు నిరంజన్, జెడ్పీటీసీ గౌరమ్మ, జంబులయ్య, బీఆర్ఎస్ నాయకులు చంద్రశేఖర్నాయక్, రామచంద్రయ్య, వెంకటేశ్వర్లు, రాజేశ్, గణేశ్రావు, గాలియాదవ్, ఎంపీటీసీలు శంకర్నాయక్, పాండునాయక్ తదితరులు పాల్గొన్నారు.
మా తాతల కాలం నుంచి పోడు భూములను సాగు చేస్తున్నాం. 40 ఏండ్ల నుంచి మాకున్న రెండెకరాల 30 గుంటల్లో పంటలు పండిస్తున్నం.. గతంలో ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా.. ఎందరో సీఎంలుగా ఉన్నా మా సమస్యను పట్టించుకోలే. అయినా సాగు చేస్తూ వచ్చాం. పట్టాల విషయంలో అప్పుడు.. ఇప్పుడు అంటూ కాలం గడిపిండ్రు. ఓట్లు వేయించుకుండ్రు. మమ్మల్ని మోసం చేసిండ్రు. కానీ తెలంగాణ సర్కారు వచ్చాక మా కష్టాలను పట్టించుకుండ్రు. సీఎం కేసీఆర్ గిరిజనుల సాదక, బాధకాలను గుర్తించిండు. సర్కారు ఆదేశాల మేరకు ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి పోడు భూమికి పట్టా ఇచ్చిండు. మా బాధలను గుర్తించి అండగా నిలిచిన సీఎం సారు రుణం తీర్చుకోలేం..
ఏండ్లుగా భూములను సాగుచేస్తున్నాం. భూములు దక్కవని.. ఎలా బతికేదని దిగులు చెందుతున్న సమయంలో సీఎం కేసీఆర్ మా బాధల్ని అర్థం చేసుకున్నడు. పట్టాలు రావడం తో గుండెపై చేయివేసుకొని భూములు సాగుచేసుకొ ని జీవిస్తాం. – హంస్య, అక్కారం గ్రామం, అచ్చంపేట మండలం
సీఎం కేసీఆర్ మా కష్టాలను తె లుసుకొని దేవుడిలా పోడు భూ ములకు పట్టా లు ఇప్పించిండు. భూమి పట్టా లు ఇచ్చి మాపై పెట్టిన కేసులను కూడా ఎత్తేస్తామనడం చెప్పడం పెద్ద మనస్సున్న వ్యక్తి కేసీఆర్ సారు.
– లావుడ్య బాల్యనాయక్, గున్యానాయక్
తండా, కోడేరు మండలం
తాతల కాలం నుంచి భూమి సాగుచేసుకొని జీవిస్తున్నాం. సాగుచేసే ప్రతిసారి ఫారెస్టోళ్లు వచ్చి ఇబ్బంది పెట్టేటోళ్లు. పట్టాలు లేనందునా రైతుబంధు, రైతుబీమా రాలేదు. ఎంతో నిరాశ చెందిన మాకు సీఎం కేసీఆర్ దేవుడిలెక్క పట్టాలు ఇప్పించి ఆదుకున్నడు. సీఎం సారుకు జీవితాంతం రుణపడి ఉంటాం.
– కేతావత్ సువాలి, జోగ్యతండా, అచ్చంపేట మండలం