జడ్చర్లటౌన్, డిసెంబర్ 25 : క్రైస్తవుల ఆరాధ్యదైవం యేసుక్రీస్తు జన్మదినం సందర్భంగా ఆదివారం క్రిస్మస్ పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. ఈ సందర్భంగా చర్చీ ల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. జడ్చర్ల పట్టణంలోని బేతని ఎంబీ చర్చిలో మతగురువులు యేసుక్రీస్తు సందేశం ఇచ్చా రు. సెంటినరి ఎంబీ చర్చి, ఐపీసీ, ఉసన్న చర్చి, యేసుకృప ప్రార్థనామందిరం, స్విహాన్ ప్రార్థనామందిరం, పెంటకొస్టన్ చర్చి, యేసుక్రీస్తురాజు చర్చీల్లో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. యేసుక్రీస్తును ఆరాధిస్తూ భక్తిగీతాలను ఆలపించారు. కేక్ కట్ చేసి వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు.
రాష్ట్రంలోని క్రైస్తవులకు ప్రభుత్వం అన్నివిధాలా చేయూతనిస్తున్నదని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. జడ్చర్లలోని బేతని ఎంబీ చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని మాట్లాడారు. యేసుక్రీస్తు బోధనలు విశ్వమానవ సహోదరత్వానికి దోహదం చేశాయన్నారు. శాంతి, కరుణ, సహనం, ప్రేమను యేసుక్రీస్తు చాటారని గుర్తు చేశారు. ప్రజలందరికీ యేసుక్రీస్తు దీవెనలు లభించాలని ఆకాంక్షించారు. నియోజకవర్గంలోని క్రైస్తవులకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో గిరిజన కార్పొరేషన్ చైర్మన్ వాల్యానాయక్, జెడ్పీ వైస్చైర్మన్ యాదయ్య, మున్సిపల్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మి, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
-జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
-ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్రెడ్డి, రాజేందర్రెడ్డి
దేవరకద్ర, డిసెంబర్ 25 : ముఖ్యమంత్రి కేసీఆర్ సర్వమతాలకు సముచిత గౌరవం ఇస్తున్నారని, తెలంగాణ సెక్యులర్ రాష్ట్రమని దేవరకద్ర, నారాయణపేట ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్రెడ్డి, ఎస్.రాజేందర్రెడ్డి అన్నారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని దేవరకద్ర రైల్వేస్టేషన్ రోడ్డు చర్చిలో క్రైస్తవులతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని పండుగలకు సమప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. దేశంలో సర్వమతాలకు ప్రతీకగా తెలంగా ణ నిలుస్తుందన్నారు. అనంతరం ఎమ్మెల్యేలను క్రైస్తవులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండ ల నాయకులు పాల్గొన్నారు.
మూసాపేట(అడ్డాకుల), డిసెంబర్ 25 : శాంతికి ప్రతిరూపం యేసుప్రభువు అని జెడ్పీటీసీ నల్లమద్ది రాజశేఖర్రెడ్డి అన్నారు. అడ్డాకుల ఎంబీ చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా క్రైస్తవులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమంలో పాస్టర్ ఎం.చంద్రశేఖర్, ఎంబీ మార్కు, ఆనందం, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు బొక్కలపల్లి తిరుపతిరెడ్డి, సింగిల్విండో చైర్మన్ జితేందర్రెడ్డి, కోఆప్షన్ సభ్యుడు ఖాజాగోరి, ఎంపీటీసీ రంగన్నగౌడ్, దానియేలు, జహంగీర్గోరి, రమేశ్, శ్రీనివాసులు పాల్గొన్నారు.
మహబూబ్నగర్టౌన్, డిసెంబర్ 25 : జిల్లా కేంద్రంలోని హౌసింగ్బోర్డుకాలనీ రెమా చర్చిలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం మున్సిపల్ పారిశుధ్య కార్మికులను సన్మానించి ప్రోత్సాహకాలను అందజేశారు. కార్యక్రమంలో రెమావర్షిస్ సెంటర్ డైరెక్టర్ రెవా పాస్టర్ బీఎస్ పరంజ్యోతి, గోపాల్, లక్ష్మన్న, దేవయ్య, బల్రాం, భరత్ తదితరులు పాల్గొన్నారు.
మిడ్జిల్, డిసెంబర్ 25 : మండలకేంద్రంతోపాటు వాడ్యా ల్, రెడ్డిగూడ, మున్ననూర్, చిల్వేర్, దోనూర్, కొత్తూర్ తదితర గ్రామాల్లో క్రిస్మస్ వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. ఈ సందర్భంగా క్రైస్తవులు భక్తిగీతాలు ఆలపిస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం చర్చీల్లో క్రిస్మస్ కేక్ కట్ చేసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చిన్నారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
రాజాపూర్, డిసెంబర్ 25 : మండలంలోని ఈద్గాన్పల్లి, రంగారెడ్డిగూడ గ్రామాల్లో క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా చర్చీల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేశారు. అనంతరం ఒకరినొకరు పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.
దేవరకద్ర రూరల్, డిసెంబర్ 25 : కౌకుంట్ల, చిన్నచింతకుంట మండలకేంద్రాలతోపాటు పలు గ్రామాల్లో క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా చర్చీల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పలువురు ప్రజాప్రతినిధులు చర్చికి వెళ్లి క్రైస్తవులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ స్వప్నాకిషన్రావు, నాయకులు అబ్దుల్ జహంగీర్, సాంబశివుడు, పాస్టర్ సువార్తరాజు, కృపదానం, రాజన్న, గట్టన్న పాల్గొన్నారు.
భూత్పూర్, డిసెంబర్ 25 : మున్సిపాలిటీలోని సియోన్ చర్చిలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్గౌడ్ పాల్గొని క్రైస్తవులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా కేక్ కట్ చేశారు. అనంతరం నూతన సంవత్సరం క్యాలెండర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు సత్తూర్ నారాయణగౌడ్, మురళీధర్గౌడ్, పాస్టర్లు ప్రభుదాస్, సామ్రాట్, ఆనంద్ పాల్గొన్నారు.