గద్వాల అర్బన్, డిసెంబర్ 26 : మండలంంలోని పూడురు గ్రామంలో మంగళవారం క్రిస్మస్ వేడకలను ఘనంగా నిర్వహించారు. గ్రామస్తుల ఆహ్వానం మేరకు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి గ్రామానికి చేరుకొని చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం గ్రామంలోని బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యేకు పూలమాలతో సన్మానించారు. అనంతరం పూడురుకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్త నర్సయ్యశెట్టి ఇటీవల రోడ్డుప్రమాదంలో గాయపడగా ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. కార్యక్రమంలో నాయకులు నరేందర్ రెడ్డి, సూరిబాబురెడ్డి, కేశవ్ రెడ్డి, భాస్కర్ గౌడ్, రమేశ్ నాయుడు,ఆశన్న ఉన్నారు.