ఊట్కూర్, మా ర్చి 29 : ప్రజల కో సం నిరంతరం పా టుపడుతున్న బీఆర్ఎస్ సర్కార్కు రాను న్న ఎన్నికల్లో ఓట్లు వేసి హ్యాట్రిక్ విజయాన్ని అం దించాలని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి కోరా రు. బుధవారం మండలంలో ని ఇడ్లూరు శంకరలింగేశ్వర స్వామి కల్యాణ మండపంలో బీ ఆర్ఎస్ మండలాధ్యక్షుడు లక్ష్మారెడ్డి అధ్యక్షతన ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ఎన్నికల్లో తనకు 50 వేల మెజార్టీ అందించారని, ఈ సారి లక్ష మెజార్టీతో గెలిపించాలని కోరారు. మక్తల్ నియోజకవర్గాన్ని బ్ర హ్మాండంగా తీర్చిదిద్దామన్నారు. రెండు హైవే లేన్లు, కొత్తగా రైల్వేలైన్ ఏర్పాటు చేశామని, ఎక్స్ప్రెస్ రైళ్ల రాకపోకలకు త్వరలో అ నుమతులు తీసుకొస్తామన్నారు. సీఎం కేసీఆర్ తనకు దైవంతో సమానులని, బీఆర్ఎస్ కుటుంబసభ్యులు ఆయన ప్రసాదించిన వరం అని అన్నారు. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రం ప్రగతిపథంలో దూసుకెళ్తున్నదన్నారు. ఉమ్మడి పాలనలో పూర్తిగా వెనుకబడిన గ్రామాలు.. నేడు అభివృద్ధి బాటన పయనిస్తున్నాయని వివరించారు.
తెలంగాణ ఏర్పడక ముందు, ఇప్పుడు ఉన్న పరిస్థితులను ప్రజలకు తెలియజేయాలన్నారు. మక్తల్ను బీఆర్ఎస్ కంచుకోటగా మార్చాలన్నారు. త్వరలోనే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా మండలానికి సాగు నీరందిస్తామన్నారు మూరుమూలన ఉన్న కొత్తపల్లి నుంచి ధన్వాడ, గున్ముక్ల గ్రామాలకు రూ.1.25 కోట్లతో రోడ్డు పనులను ప్రారంభించామన్నారు. ఊట్కూర్ను మున్సిపాలిటీగా మారుస్తామని హామీ ఇచ్చారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి నియోజవర్గంలో మూడో విడుత గొర్రెల పంపిణీ ప్రారంభిస్తామన్నారు. 1100 మందిని దళితబంధు పథకానికి ఎంపిక చేస్తామని, ఖాళీ జాగా ఉండి, గుడిసెలో బతుకుతున్న మూడు వేల కుటుంబాలకు ఇల్లు నిర్మించుకునేందుకు రూ.3 లక్షల చొప్పున ఇస్తామన్నారు.యువతకు ఉపాధి కల్పన కోసం పరిశ్రమలను ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రగతికి ఆకర్షితులై కర్ణాటక ప్రజలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరుతున్నట్లు తెలిపారు. ట్రేడ్ యూనియన్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవరి మల్లప్ప మాట్లాడుతూ దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ గాలి వీస్తున్నదని, సీఎం కేసీఆర్కు లభిస్తున్న ఆదరణను చూసి మోదీ ప్రభుత్వం ఎమ్మెల్సీ కవిత, మంత్రులపై ఈడీ దాడులు నిర్వహిస్తున్నదని మండిపడ్డారు. బీజేపీ తాటాకు చప్పుళ్లకు భయపడేదిలేదన్నారు. అంతకుముందు నాయకులు, కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ లక్ష్మి, జెడ్పీటీసీ అశోక్కుమార్గౌడ్, పీఏసీసీఎస్ చైర్మన్ బాల్రెడ్డి, సర్పంచుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు సూర్యప్రకాశ్రెడ్డి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు సుధాకర్రెడ్డి, మాజీ జెడ్పీటీసీ అరవింద్కుమార్, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి శివరామరాజు, ఎంపీటీసీల సంఘం జిల్లా అధ్యక్షుడు రాఘవరెడ్డి, మండలాధ్యక్షుడు రవిప్రసాద్రెడ్డి, నాయకులు విజయసింహారెడ్డి, విజయభాస్కర్రెడ్డి, రహెమాన్, ఆనంద్రెడ్డి, తరుణ్, వెంకటేశ్గౌడ్, కతలప్ప, శ్రీనివాసులు, జయప్రకాశ్రెడ్డి, గోపాల్రెడ్డి, శంకర్రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, సింగిల్విండో డైరెక్టర్లు పాల్గొన్నారు.