పెబ్బేరు రూరల్, జనవరి 16: మండలంలోని పాత పల్లి సమీపంలో కొలువైన చింతలకుంట ఆంజనేయస్వామి జాతర వైభవంగా కొనసాగింది. సంక్రాంతి పర్వదినం సంద ర్భంగా మూడు రోజులపాటు జరిగే జాతరకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచేగాక ఇతర జిల్లాల నుంచి భక్తులు వేలాది గా తరలివచ్చారు. భక్తులు స్వామివారికి మాంసాహారాన్ని నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
ఈ సారి జాతరకు భక్తుల తాకిడి అధికంకావడంతో వాహనాల పార్కింగ్ సమస్య ఏర్పడింది. దీంతో వాహనాలను చెరువు గట్టు మీద , పంట పొలాల్లో నిలిపివేశారు. జాతరలో పోలీ సులు బందోబస్తు నిర్వహించి వాహనాల రాకపోకలను నియంత్రించారు.