దేవరకద్ర, డిసెంబర్ 23 : మండలంలోని చిన్నరాజమూర్ గ్రామంలో వెలసిన ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 24వ తేదీ నుంచి ప్రా రంభం కానున్నాయి. ఆలయాన్ని రం గురంగుల విద్యుద్దీపాలతో నిర్వాహకులు సర్వాంగసుందరంగా ముస్తాబు చేశారు. ఉత్సవాలను తిలకించేందుకు జిల్లాలోని నలుమూలల నుంచే కాకుం డా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు వేలాదిగా తరలిరానున్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులు స్వామి వారికి దాసంగాలు సమర్పించి మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీ.కాగా, ఉత్సవాల సందర్భంగా దేవరకద్ర బస్టాండ్ నుంచి జాతర వరకు ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సు సౌకర్యాన్ని కల్పించారు. ఆలయ ప్రాంగణంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు ఎస్సై వెంకటేశ్ తెలిపారు.
స్వామి వారి ఉత్సవాలు 24 నుంచి 28 తేదీ వరకు నిర్వహించనున్నారు. తొలిరోజు పంచామృతాభిషేకం, అలంకరణ, హనుమత్ వ్రతం, ధ్వజారోహణం, హోమం, రాత్రికి హంసవాహన సేవ. 25న పంచామృతాభిషేకం, అలంకరణ, మహానైవేద్యం, శ్రీనివాస క ల్యాణం, రాత్రికి పల్లకీసేవ. 26న పంచామృతాభిషేకం, అలంకరణ, రాత్రికి అశ్వవాహన సేవ, ప్రభోత్సవం. 27న పౌర్ణమి సందర్భంగా పంచామృతాభిషేకం, మహాలంకరణ, రాత్రికి గజవాహనసేవ, రథోత్సవం. 28న ఉదయం అవభృత స్నా నం, పంచామృతాభిషేకం, అలంకరణ, పల్లకీసేవ నిర్వహించనున్నారు.