ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు జన్మదిన వేడుకలను శుక్రవారం జిల్లావ్యాప్తంగా మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి, కోస్గి ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి, బీఆర్ఎస్ నేతల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అన్నదానం, కేక్లు కట్ చేసి ప్రజలకు పంచిపెట్టారు. పేట అనాథ ఆశ్రమంలో పిల్లలకు అన్నదానం, జిల్లా ప్రభుత్వ జనరల్ దవాఖాన, ప్రభుత్వ పిల్లల దవాఖానల్లో మొక్కలు నాటడంతోపాటు, పండ్లు, బ్రెడ్లు, మిఠాయిలు పంపిణీ చేశారు. జిల్లా రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మక్తల్ లయన్స్ క్లబ్ భవనంలో రక్తదాన శిబిరంలో పలువురు రక్తదానం చేశారు.
పలు గ్రామాల్లో ఉపాధి కూలీలు పని ప్రదేశంలో సీఎం జన్మదిన వేడుకలను జరుపుకొన్నారు. తెలంగాణ రాష్ర్టాన్ని ముఖ్యమంత్రి అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాడని పలువురు కొనియాడారు. దేశానికే ఆదర్శవంతమైన నాయకుడని, ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని పలువురు నాయకులు ఆలయాల్లో పూజలు చేశారు. కార్యక్రమంలో వివిధ సంఘాలు, ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.