కొత్తకోట, మే 15 : గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించాలని జెడ్పీవైస్ చైర్మన్ వామన్గౌడ్ అన్నారు. మండలస్థాయి సీఎం కప్ పోటీలను జెడ్పీవైస్ చైర్మన్తో పాటు మున్సిపల్ చైర్పర్సన్ సుకేశిని,ఎంపీపీ గుంతమౌనిక సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులు క్రీడల్లో రాణించి మండలానికి, జిల్లాకు పేరు ప్రఖ్యాతులు తేవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో రవీందర్బాబు, తాసీల్దార్ బాల్రెడ్డి, సీడీసీ చైర్మన్ చెన్నకేశవరెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ వంశీధర్రెడ్డి, మాజీ జెడ్పీటీసీ విశ్వేశ్వర్, ఉమ్మడి జిల్లాల అధికార ప్రతినిధి ప్రశాంత్, కౌన్సిలర్లు సంధ్యారవీందర్రెడ్డి, పద్మాఅయ్యన్న, తిరుపతయ్య, ఆకుల శ్రీను, శ్రీనుజీ, వహీద్, చింటూ, వికాస్, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.
క్రీడారంగానికి ప్రభుత్వం పెద్దపీట
పాన్గల్,మే15: రాష్ట్రప్రభుత్వం క్రీడారంగానికి పెద్దపీట వేసిందని ఎంపీపీ శ్రీధర్రెడ్డి, జెడ్పీటీసీ లక్ష్మి అన్నారు. మండలకేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో మండలస్థాయి సీఎంకప్ పోటీలను సోమవారం వారు ప్రారంభించా రు. కార్యక్రమంలో ఎంపీడీవో నాగేశ్వర్రెడ్డి, తాసీల్దార్ చక్రపాణి, ఎంఈవో లక్ష్మణ్నాయక్, ఏపీఎం సక్రూనాయక్, సర్పంచ్ గోపాల్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు చంద్రశేఖర్నాయక్, హనుమంతురెడ్డి, బీరయ్య, క్రీడాకారులు పాల్గొన్నారు.
వనపర్తి మండలంలో..
వనపర్తి రూరల్, మే 15 : మండలంలోని పెద్దగూడెం గ్రామంలోని తెలంగాణ క్రీడ ప్రాంగణంలో సోమవారం సీఎం కప్ పోటీలను అధికారులు ప్రారంభించారు.ఈ పోటీలు బుధవారం ముగు స్తుందని ఎంపీడీవో సుదర్శన్ తెలిపారు.
ఖిల్లాఘణపురం మండలంలో..
ఖిల్లాఘణపురం, మే 15 : ప్రభుత్వం గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు సీఎం కప్ క్రీడలను నిర్వహిస్తుందని ఈ పోటీల్లో గ్రామీణ క్రీడాకారులు ప్రతిభను కనబర్చాలని ఎస్సై శ్రీహరి అన్నారు. మండలకేంద్రంలో సీఎం కప్ క్రీడా పోటీలను తాసీల్దార్ పరమేశ్, ఎంపీడీవో విజయ్కుమార్లతో కలిసి ఎస్సై సోమవారం ప్రారంభించారు.
గోపాల్పేట మండలంలో..
గోపాల్పేట, మే 15 : మండలకేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో మండలస్థాయి సీఎం కప్ క్రీడా పోటీలను సోమవారం ఎంపీపీ అడ్డాకుల సంధ్య, జెడ్పీటీసీ మందభార్గవి ప్రారంభించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ చంద్రశేఖర్, సర్పంచ్ శ్రీనివాసులు, ఎంపీటీసీ కేతమ్మ, కోఆప్షన్ సభ్యులు ఎండీ మతీన్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గాజుల కోదండం, తాసీల్దార్ సునీత, ఎంపీడీవో హుస్సేనప్ప, హెచ్ఎం రమా కాంత్, వ్యాయామ ఉపాధ్యాయులు సురేంధర్రెడ్డి పాల్గొన్నారు.
అట్టహాసంగా ఆటల పోటీలు ప్రారంభం
రేవల్లి, మే15 : మండలకేంద్రంలో సీఎం కప్ ఆటల పో టీలు సోమవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. క్రీడా పోటీలను ఎంపీపీ సేనాపతి, జెడ్పీటీసీ భీమయ్యతో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో తాసీల్దార్ శ్రీరాములు, ఎంపీడీవో సుజాత, ప్రధాన ఉపాధ్యాయులు ప్రసాద్, పీఈటీలు గోవింద్, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
క్రీడలతో మానసికోల్లాసం
వీపనగండ్ల, మే 15 : క్రీడలు మానసికోల్లాసాన్ని కలిగిస్తాయని ఎంపీపీ కమలేశ్వర్రావు అన్నారు. సీఎం కప్ మండల స్థాయి పోటీలను మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణంలో ఎస్సై రామన్గౌడ్, ఎంపీడీవో కథలప్ప, సింగిల్ విండో చైర్మన్ రామన్గౌడ్తో కలిసి ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ నరసింహారెడ్డి, ఎంపీటీసీ భాస్కర్రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్, నాయకులు సాయిబాబా, రవీందర్రెడ్డి పాల్గొన్నారు.
మదనాపురం మండలంలో..
మదనాపురం, మే 15 : మండలకేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్లో సోమవారం సీఎం కప్ క్రీడలను ఎంపీడీవో నాగేం ద్రం, తాసీల్దార్ నరేందర్ ఆధ్వర్యంలో అధికారులు, నాయకులు ప్రారంభించారు. కార్యక్రమంలో డీటీ అశోక్, ఎస్సై మురళి, జెడ్పీటీసీ కృష్ణయ్య, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వెం కట్నారాయణ, సర్పంచ్ రాంనారాయణ, ఏఎస్సై గోపా ల్రెడ్డి, ఎంపీటీసీల సంఘ మండల అధ్యక్షుడు కుర్మయ్య, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు యాదగిరి, యూత్ అధ్యక్షుడు రాజ్కుమార్, పంచాయతీ కార్యదర్శులు విక్రమ్గౌడ్, లక్ష్మీనారాయణ, పీఈటీలు శ్వేత, రామచంద్రమ్మ, బీఆర్ఎస్ నాయకులు లక్ష్మయ్య, మనోజ్కుమార్, డీలర్ వెంకట్ పాల్గొన్నారు.
పెద్దమందడి మండలంలో..
పెద్దమందడి, మే 15: మండలస్థాయి సీఎం కప్ క్రీడా పోటీలను సోమవారం మండలకేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల మైదానంలో తాసీల్దార్ సంధ్య, ఎంపీడీవో అఫ్జల్, ఎస్సై హరిప్రసాద్ ప్రారంభించారు. కార్యక్రమంలో పీఈటీలు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
సద్వినియోగం చేసుకోవాలి
చిన్నంబావి, మే 15 : రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న మండలస్థాయి సీఎం కప్ క్రీడా పోటీలను గ్రామీణ క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ సోమేశ్వరమ్మ, జెడ్పీటీసీ వెంకట్రామమ్మ అన్నారు. సోమవారం మండలకేంద్రంలో సీఎం కప్ క్రీడా పోటీలను తాసీల్దార్ ఘాన్షీరాం, ఎస్సై వస్త్రం నాయక్, ఎంపీడీవో రవినారాయణలతో కలిసి వారు ప్రారంభించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, క్రీడాకారులు, పీఈటీలు తదితరులు పాల్గొన్నారు.
అమరచింత మండలంలో..
అమరచింత, మే 15: అమరచింత పట్టణంలో సీఎం కప్ క్రీడలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. జెడ్పీ పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన క్రీడలను మున్సిపల్ చైర్పర్సన్ మంగమ్మగౌడ్, తాసీల్దార్ షేక్ చాంద్పాషా, ఎంపీడీవో జ్యోతి పరూషియా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ గెలుపొందిన క్రీడాకారులకు ఈనెల 23న ప్రో త్సాహక బహుమతులు అందజేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్యార్డ్ కమిటీ చైర్మన్ నాగభూ షణంగౌడ్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.