మహబూబ్నగర్ మెట్టుగడ్డ, ఆగస్టు 28 : ఆపదలో ప్రాణాలు కాపాడే వైద్యులను ప్రజలు దైవంగా భావిస్తారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. సోమవారం మహబూబ్నగర్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 2017వ బ్యాచ్ ఎంబీబీఎస్ విద్యార్థులకు నిర్వహించిన రెండో స్నాతకోత్సవ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డాక్టర్ వృత్తి దేవుడిచ్చిన గొప్పవరమని, ప్రాణాలు కాపాడే వారిని దైవంగా భావిస్తారన్నారు. నిస్వార్థంగా సేవ చేయాలని కోరారు.
రాష్ట్రం ఏర్పడక ముందు 70ఏండ్లలో ఒక్క మెడికల్ కళాశాల కూడా తెలంగాణకు లేదన్నారు. రాష్ట్రం సిద్ధించాక మొట్టమొదటి మెడికల్ కళాశాల మహబూబ్నగర్కు మంజూరు చేశారన్నారు. అనంతరం ప్రతి జిల్లాకు మెడికల్ కళాశాలను మంజూరు చేసి వైద్యరంగాన్ని మరింత బలోపేతం చేసినట్లు వెల్లడించారు. ఉస్మానియా, గాంధీ తర్వాత అత్యంత పోటీ మహబూబ్నగర్ మెడికల్ కళాశాలకు ఉందన్నారు. నర్సింగ్ కళాశాల తీసుకువచ్చామని, రూ.500కోట్ల రూపాయలతో స్పెషాలిటీ దవాఖాన త్వరలోనే పూర్తికానున్నదని తెలిపారు. మహబూబ్నగర్ జిల్లాను మెడికల్ హబ్గా ఆభివృద్ధి చేస్తామని, భవిష్యత్తులో షాద్నగర్ వరకు ఉన్న మైట్రోట్రైన్ను మహబూబ్నగర్ వరకు పొడిగించేందుకు కృషి చేస్తామన్నారు.
మహబూబ్నగర్లో ఇండియన్ మెడికల్ అసోషియేషన్ భవన నిర్మాణానికి రూ.కోటి వారం రోజుల్లో మంజూరు చే యనున్నట్లు మంత్రి ప్రకటించారు. ప్ర భుత్వ వైద్య కళాశాల ఆడిటోరియం ని ర్మాణానికి ప్రతిపాదనలు అందించాలని, సాధ్యమైనంత త్వరగా మంజూరు చేస్తామని వెల్లడించారు. అనంతరం 150 మంది వైద్యవిద్యార్థులకు పట్టాలు పంపి ణీ చేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల డైరెక్టర్ రమేశ్, ప్రభుత్వ ప్ర ధాన జనరల్ దవాఖాన సూపరిటెండెంట్ జీవన్, వనపర్తి మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ సునందిని, అకాడమిక్ ప్రిన్సిపాల్ నవకళ్యాణి, వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపాల్ నావల్ కిశోర్, పద్మశ్రీ అవార్డు గ్రహీత దాసరి ప్రసాదరావు, డాక్టర్ విజ య ఎల్దండి, ఐఏంఏ అధ్యక్షుడు రామ్మోహన్, గైనిక్ హెచ్వోడీ రాధ, ఎస్పీఎం కిరణ్ప్రకాశ్తోపాటు తదితరులు పాల్గొన్నారు.
శ్రీనన్నను లక్ష మెజార్టీతో గెలిపించాలి : ప్రభుత్వ విప్ బాల్కసుమన్
ప్రస్తుతం మహబూబ్నగర్ను చూస్తే చాలా ఆనందంగా ఉందని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. గతంలో కరువుతో అల్లాడిన పాలమూరు నేడు పచ్చనిపంటలతో ఎక్కడ చూసినా విశాలమైన రోడ్లు, ఊహించని అభివృద్ధి జరిగిందన్నారు. అభివృద్ధిని చూసి శ్రీనన్నను ఈసారి లక్ష మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, ముడా చైర్మన్ గంజి వెంకన్న, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్యాదవ్, బీఆర్ఎస్వీ అధ్యక్షుడు కృష్ణమోహన్, పటణాధ్యక్షుడు శివరాజ్, శ్రీబాలజీ టైల్స్ అండ్ గ్రానైట్స్ వర్కర్స్ అధ్యక్షుడు రవి, ప్రధాన కార్యదర్శి మహేశ్, కోశాధికారి రాందాస్, మల్లేశ్, చంటి, లక్ష్మణ్, గోవింద్ తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధితోపాటు ఉద్యోగ అవకాశాలు పెరిగాయి..
పాలమూరు, ఆగస్టు 28 : జిల్లా కేంద్రంలోని క్రౌన్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో జిల్లా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి శ్రీనివాస్గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి తెలిపారు. ఒకప్పుడు మహబూబ్నగర్లో ఉపాధి అవకాశాలు లేక వలసలు వెళ్లే పరిస్థితి ఉండేదని, ప్రస్తుతం అభివృద్ధితోపాటు ఉపాధి అవకాశాలు కూడా పెరిగాయన్నారు. ప్రైవేట్ పాఠశాలల సైతం పుంజుకున్నాయని, అనేక మందికి ప్రైవేట్ టీచర్లుగా అవకాశం లభిస్తున్నదని తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బాల్కసుమన్, ఎమ్మెల్సీ సురభివాణి, జెడ్పీ చైర్మన్ స్వర్ణసుధాకర్రెడ్డి, డీఈవో రవీందర్, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్యాదవ్, అసోసియేషన్ అధ్యక్షుడు ప్రభాకర్, రాంచందర్జీ, అంజిరెడ్డి, రాఘవేందర్, రాములు, జ్యోతి, అత్తర్బేగం, మల్లికార్జున్, సురేందర్ పాల్గొన్నారు.
పాలమూరు పచ్చబడింది..
మహబూబ్నగర్ అర్బన్, ఆగస్టు 28 : నాడు కరువుకు నిలయంగా ఉ న్న పాలమూరు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పచ్చనిపంటలతో పచ్చబడిందని మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మహబూబ్నగర్ జిల్లా కేం ద్రంలోని న్యూటౌన్లో గల బీఆర్ఎస్ కార్యాలయంలో శ్రీబాలాజీ టైల్స్ అం డ్ గ్రానైట్స్ వర్కర్స్ ఆధ్వర్యంలో దు బాయ్, ముంబాయి, పూణే వలస వెళ్లి తిరిగి సొంత తాండాల కు వచ్చిన సు మారు 300మంది నాయకులు బీఆర్ఎస్లో చేరారు. వీరికి మంత్రి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంతకుముందు న్యూటౌన్ చౌరస్తా నుంచి పార్టీ కార్యాలయం వరకు మంత్రి శ్రీనివాస్గౌడ్, ప్రభు త్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీ సు రభివాణిలకు డప్పులతో ఘనంగా స్వాగతం పలికారు. నాడు వలసలు వెళ్లిన జిల్లాకే నేడు ఇతర రాష్ర్టాల నుంచి వలసలు వచ్చేలా సీఎం కేసీఆర్ తీర్చిదిద్దారన్నారు. సెప్టెంబర్ 2న పెద్దఎత్తున ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నామన్ని, సద్వినియోగం చేసుకోవాలన్నారు. భూముల ధరలు పెరిగాయ ని, త్వరలోనే ఐటీ కారిడార్ నుంచి డబుల్ రోడ్డు, షాద్నగర్ నుంచి ఐటీ కారిడార్ వరకు మెట్రో రైలు ప్రారంభిస్తామని వెల్లడించారు.
సాయిచంద్ మృతి బాధాకరం..
అమరచింత,ఆగస్టు28 : బీఆర్ఎస్ కార్యకర్తలకు పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. సోమవారం అమరచింతలో తెలంగాణ కళాకారుడు సాయిచంద్ చి త్రపటానికి మంత్రితోపాటు ప్రభుత్వ విప్ బాల్కసుమన్, మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంత రం సాయిచంద్ తల్లిదండ్రులు పద్మ మ్మ, వెంకట్రాములుకు సీఎం కేసీఆర్ అందించిన రూ.50లక్షల చెక్కును వా రు అందజేశారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ.. మలిదశ తెలంగాణ ఉద్యమంలో సాయిచంద్ పాత్ర మరువలేనిదని కొనియాడారు. తన పాటలతో ఉద్యమాన్ని ముందుకు నడిపించి చి న్న వయస్సులో మృతిచెందడం బాధాకరమన్నారు. పార్టీలో పనిచేసే వారికి ఎల్లప్పుడూ సీఎం కేసీఆర్ ఎల్లప్పుడూ అండగా ఉంటారని, సాయిచంద్ మర ణం తర్వాత ఆయన సతీమణి రజినీకి రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్పర్సన్ గా నియమించారని గుర్తుచేశారు.
అంతేకాకుండా ఆర్థికసాయంగా రూ.50 లక్షలతోపాటు పిల్లల పేర్లపై చదువుల కోసం రూ.50లక్షలు బ్యాంకులో ఫిక్స్ డ్ డిపాజిట్ చేసినట్లు వివరించారు. సాయిచంద్ తల్లిదంద్రులకు రూ.25 లక్షలు, ఆయన చెల్లెలు ఉజ్వలకు రూ.25లక్షలు ఆర్థికసాయం అందించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారన్నా రు. అమరచింతలో సాయిచంద్ విగ్ర హం ఏర్పాటు చేయాలని తండ్రి వెంకట్రాములు మంత్రి శ్రీనివాస్గౌడ్ను కోరగా, ఇందుకు ఆయన సానుకూలంగా స్పం దించారు. అలాగే లైబ్రరీ ఏర్పాటు చేసి సాయిచంద్ పేరును నామకరణం చేస్తామని మంత్రి వెల్లడించారు. కార్యక్రమంలో అమరచింత మున్సిపల్ చైర్పర్సన్ మంగమ్మ, మా ర్కెట్ కమిటీ చైర్మన్ రాజు, మాజీ జెడ్పీటీసీ రాజేందర్సింగ్, బీఆర్ఎస్ నాయకులు నాగభూషణంగౌడ్, నరేశ్రెడ్డి, రమేశ్, నర్సింహులుగౌడ్, చిన్నబాలరాజు తదితరులు ఉన్నారు.