ఈడీ, ఐటీ దాడులకు భయపడేది లేదని.. తిరగబడుతామని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి హెచ్చరించారు. ఈ రెండింటిని కేంద్రం జేబు సంస్థలుగా మార్చుకొని తెలంగాణపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదని ధ్వజమెత్తారు. బుధవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి సమీపంలోని పాలకొండ వద్ద కొత్త కలెక్టరేట్ ఎదురుగా ఉన్న మంత్రి క్యాంపు కార్యాలయంలో ఉమ్మడి జిల్లా ఎంపీలు రాములు, మన్నె శ్రీనివాస్రెడ్డి, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, ఎమ్మెల్యేలు డాక్టర్ లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డి, మర్రి జనార్దన్రెడ్డి, రాజేందర్రెడ్డి, చిట్టెం రామ్మోహన్రెడ్డి, కృష్ణమోహన్రెడ్డి, అబ్రహం, అంజయ్య యాదవ్,
పట్నం నరేందర్రెడ్డితో కలిసి మంత్రులు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీఎం కేసీఆర్ కూతురు కావడం వల్లే ఎమ్మెల్సీ కవితను మోదీ ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తున్నదన్నారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి కృష్ణా నీటి వాటా తేల్చడం లేదని ఆరోపించారు. ఉమ్మడి జిల్లాలో రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయలేని దుస్థితిలో ఉన్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ తీరును ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో వారే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
మహబూబ్నగర్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఈడీ, ఐటీ సంస్థలను కేంద్రంలోని బీజేపీ సర్కార్ వారి జేబు సంస్థలుగా మార్చుకుని తెలంగాణ పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి సమీపంలోని పాలకొండ సమీపంలోని కొత్త కలెక్టరేట్ ఎదురుగా ఉన్న మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఉమ్మడి జిల్లా ఎంపీలు రాములు, మన్నె శ్రీ నివాస్రెడ్డి, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, ఎమ్మెల్యే లు డాక్టర్ లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డి, మర్రి జనార్దన్రెడ్డి, రాజేందర్రెడ్డి, చిట్టెం రామ్మోహన్రెడ్డి, కృష్ణమోహన్రెడ్డి, అబ్రహం, అంజయ్య యాదవ్, పట్నం నరేందర్రెడ్డితో కలిసి మంత్రులు విలేకరుల సమావేశం లో మాట్లాడారు.
మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ కేంద్రం వ్యవహరిస్తున్న తీరును రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. అభివృద్ధి చెందుతున్న రాష్ర్టాన్ని ప్రోత్సహిస్తారా.. లేక దాడులు చేస్తారా..? ఇదేం సం స్కృతి ..? అని నిలదీశారు. దాడులకు ప్రతి దాడి చేస్తామని తీవ్ర స్వరంతో హెచ్చరించారు. ఎమ్మెల్సీ కవితపై కుట్రలు, మంత్రి గంగులపై ఈడీ దాడులు, మరో మం త్రి మల్లారెడ్డిపై ఐటీ దాడులతో కేంద్రంలోని మోదీ స ర్కార్ అరాచకాలకు తెరలేపిందని విమర్శించారు. దే శంలో ఎక్కడా లేని విధంగా ఒక్క తెలంగాణపైనే కేం ద్రం వ్యవహారం సరికాదన్నారు. తెలంగాణ గొంతు పిసి కి అల్లకల్లోలం సృష్టించాలని యత్నిస్తున్నదని దుయ్యబట్టారు.
తెలంగాణలో పేకాట, జూదం లేదు కానీ.. అదే బీజేపీ పాలిత రాష్ర్టాలైన గోవా, ముంబైలో కెసినోలు నడిపిస్తున్నారన్నారు. అక్కడి బీజేపీ ప్రభుత్వాలు చేస్తున్న అవినీతి కనిపించడం లేదా.. అని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా మెడికల్ కళాశాలలు మంజూరు చేసినా తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదన్నారు. మెడికల్ కళాశాలలతో ఎందరో విద్యార్థులు ఎంబీబీఎస్లు పూర్తి చేసేందుకు తోడ్పడుతున్న మంత్రి మల్లారెడ్డిపై కేంద్రం దాడులకు దిగడం సరికాదన్నారు. కేంద్రం ఎన్ని కుట్ర లు చేసినా సీఎం కేసీఆర్ దృష్టి మాత్రం అభివృద్ధిపైనే ఉంటుందన్నారు.
తమ వద్ద కూడా ఏసీబీ, సీఐడీ వం టి అనేక సంస్థలు ఉన్నా దాడుల సంస్కృతిని ఏనాడూ ప్రోత్సహించలేదని గుర్తు చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని చూసిన ఉదంతంలో అన్ని ఆధారాలు ఉన్నాయని, విచారణ జరుగుతున్నదని చె ప్పారు. కానీ మల్లారెడ్డిపై ఎలాంటి ఆధారాలు లేకుండా ఐటీ దాడులు చేస్తున్నారని విమర్శించారు. స్వయంగా ఎదుగుతున్న తెలంగాణపై మోదీ సర్కార్ చేస్తున్న ముప్పేట దాడులు, కుట్రలను దేశ ప్రజలు గమనించాలన్నారు. సాక్షాత్తు ప్రధాని మోదీ మహబూబ్నగర్ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా నేటికీ ఇవ్వలేదన్నారు. బీజేపీ హయాంలో దేశంలో కనీసం ఒక్క ప్రాజెక్టు, ఒక్క భారీ పరిశ్రమ నెలకొల్పలేదన్నారు. ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్ముతూ ఉద్యోగాలు లేకుండా చేస్తున్నారని రూల్ ఆఫ్ రిజర్వేషన్లను తుంగలో తొక్కుతున్నారన్నారు.
డిసెంబర్ 4న సీఎం కేసీఆర్ రాక ..
మహబూబ్నగర్ కలెక్టరేట్తోపాటు ఇతర అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడానికి డిసెంబర్ 4న ము ఖ్యమంత్రి కేసీఆర్ వస్తున్నారని మంత్రులు నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్ తెలిపారు. కొత్త సమీకృత కలెక్టరేట్, టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం ప్రారంభం, సూపర్ స్పె షాలిటీ దవాఖాన, మినీ శిల్పారామం శంకుస్థాపనలకు ముఖ్యమంత్రి హాజరుకానున్నారు. అనంతరం ఎంవీఎస్ కాలేజ్ ఆవరణలో బహిరంగ సభ జరగనున్నది.
కృష్ణా వాటను తేల్చరెందుకు..?
– మంత్రి నిరంజన్రెడ్డి
రెండు రాష్ర్టాల నీటి పంచాయితీని కేంద్రం ఎనిమిదేండ్లుగా తేల్చడం లేదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నదీ నీటి వాటాలు తేలక ఉమ్మడి జిల్లా రైతులు ఇబ్బందు లు పడుతున్నారని చెప్పారు. వ్యవస్థలను వికేంద్రీకరిం చి ప్రజలకు చేరవయ్యేలా చేయడం, పాలనను మ రింత చేరవయ్యేందుకు కొత్త జిల్లాలను ఏర్పాటు చే శామన్నారు. వివిధ రాష్ర్టాల్లో సెక్రటేరియట్ భవనా లు కూడా ఇలా లేవని, చిన్న జిల్లాలతో అభివృద్ధి వేగవంతం అవుతున్నదని చెప్పారు. అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందుతున్నాయని, పాలమూరులో ఎక్కడ చూసినా ధాన్యం రాశులతో కొనుగోలు కేంద్రాలు కళకళలాడుతున్నాయని తెలిపారు.
చెరువులు, రిజర్వాయర్లు జలకళను సంతరించుకున్నాయని, సాగునీటికి ఇబ్బంది లేదన్నారు. రైతులు క్రమంగా వరి సాగు తగ్గించుకోవాలని సూచించారు. సాగునీరు, రైతుబంధు, నిరంతర విద్యుత్తో వ్యవసాయం పండుగ లా జరుగుతుందని పేర్కొన్నారు. రైతుబంధు నిధు లు త్వరలో విడుదల చేస్తామని వెల్లడించారు. రైతు లు వేరుశనగ పంట సాగు 3 లక్షల ఎకరాలు దాటిందని, డిమాండ్ ఉన్న పంట సాగును విస్తరించుకోవాలని కోరారు. దేశంలో తెలంగాణ వేరుశనగ పంటకు ఉన్న డిమాండ్ వేరే రాష్ట్రంలో పండిన పంటకు లేదన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో పండిన పంటను కొనలేని స్థితిలో కేంద్రం ఉందన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి కాకుండా కేసులు వేసి పనులను అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు.
మంత్రి నివాసంలో సుదీర్ఘ భేటీ
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలతో మంత్రులు నిరంజన్రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ సుదీర్ఘ భేటీ అయ్యారు. డిసెంబర్ 4న సీఎం కేసీఆర్ పర్యటనపై చర్చించారు. పర్యటనను విజయవంతం చేసేందుకు చేపట్టాల్సిన చర్యలను నిర్ణయించారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై చర్చించినట్లు తెలుస్తోంది. తెలంగాణపై కేంద్రం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదని, ఈ విషయాన్ని ఆయా నియోజకవర్గాల్లోని ప్రజలకు పార్టీ కార్యకర్తలు ఈ విషయాన్ని తీసుకెళ్లి మోదీ సర్కార్ తీరును ఎండగట్టాలని తీర్మానించారు. సమావేశంలో డీసీసీబీ చైర్మన్ నిజాంపాషా, ముడా చైర్మన్ గంజి వెంకన్న, గ్రంథలయాల సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్గౌడ్, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, మార్కెట్ కమిటీ చైర్మన్ రహమాన్ తదితరులు పాల్గొన్నారు.