మక్తల్ టౌన్, జనవరి 30 : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన మక్తల్ మండలం కాచ్వార్ సమీపంలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకున్నది. స్థానికు ల కథనం మేరకు కాచ్వార్ కు చెందిన ప్రభాకర్, మక్తల్ పట్టణానికి చెందిన వడ్డె బాలరాజు బైక్పై మక్తల్ నుంచి కాచ్వార్లోని వారి పొలం వద్దకు వెళ్తున్న క్రమంలో హైదరాబాద్ నుంచి రాయిచూర్ వెళ్తున్న కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ప్రభాకర్, బాలరాజు తీవ్రంగా గాయపడగా వారిని మక్తల్ ప్ర భుత్వ దవాఖానకు తరలించగా చికిత్స పొందు తూ మృతి చెందారు. ఈ ప్రమాదంపై ఎస్సై భాగ్యలక్ష్మిరెడ్డిని వివరణ కోరగా ప్రమాదం జరిగిన విషయం వాస్తవమేనని, దీనిపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పేర్కొన్నారు.