పాలమూరు, జనవరి 24: రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా మన్యంకొండపై కేబుల్కార్ ఏర్పాటు చేసి వచ్చే ఏడాది నాటికి అందుబాటులోకి తెస్తామని ఎక్సైజ్, క్రీడలశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. స్పెయిన్ పర్యటనలో భాగంగా మంగళవారం వరల్డ్ ట్రావెల్ టూరిజంమార్ట్లో మంత్రి కేబుల్కార్ నిర్వహణను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి అక్కడినుంచి మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతున్నదన్నారు. ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం మన్యంకొండ లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయం ఆభివృద్ధికి కృషిచేస్తున్నామని తెలిపారు.
మన్యంకొండ వద్ద కేబుల్కార్ పనులను వచ్చే ఏడాది వరకు పూర్తిచేసి కార్యక్రమాలను ప్రారంభించాలని, అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి టూరిజం శాఖ అధికారులను ఆదేశించారు. తెలంగాణలోని అద్భుతమైన పర్యాటక ప్రదేశాలున్నాయని, ఈ ప్రదేశాలను విదేశీ పర్యాటకులకు పరిచయం చేసేందుకు తెలంగాణ ట్యూషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయస్థాయిలో టూరిజం ప్రమోషన్ యాక్టివిటీస్ను కొనసాగిస్తున్నామన్నారు. మహబూబ్నగర్ జిల్లా అభివృద్ధికి నిధులు కేటాయించిన సీఎం కేసీఆర్కు మంత్రి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.