వనపర్తి (నమస్తే తెలంగాణ)/చిన్నంబావి, మే 23 : వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం లక్ష్మీపల్లి ఉలిక్కిపడింది. బీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి ప్రధాన అనుచరుడు బొడ్డు శ్రీధర్రెడ్డి (50) బుధవారం అర్ధరాత్రి హ త్యకు గురయ్యాడు. వివాదరహితుడిగా పే రొందిన నేతపై గొడ్డళ్లతో దాడితో రాజకీయవర్గాల్లో కలవరం మొదలైంది. రాజకీయం గా ఎలాంటి అలజడులు లేకుండా ఉన్న మండలంలో గుర్తింపు పొందిన నేత హ త్య చర్చనీయాంశమైంది. మంచికి మారు పేరుగా నిలిచిన శ్రీధర్రెడ్డిని హత్య చేసేంతవరకు ఎందుకు వెళ్లారన్నది మిలియన్ల కొద్ది ప్రశ్న. ఈ హత్య కోసం ముందస్తు పథకం పన్ని అత్యంత చాకచక్యంగా చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికులే హత్య చేశారా..? లేక ఇతర ప్రాంతాల వారితో హత్య చేయించారా..? అన్న కోణంలోనూ విచారణ జరుగుతున్నది. ఎలాంటి అ లజడికి తావులేకుండా పక్కా ప్లాన్తో హత్య జరిగినట్లు పోలీసు అధికారులు, బీఆర్ఎస్ నాయకులు భావిస్తున్నారు.
శ్రీధర్రెడ్డి హత్య సమాచారం తెలుసుకు న్న మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి, మ రో నేత అభిలాష్రావుతో కలిసి వెంటనే లక్ష్మీపల్లికి చేరుకున్నారు. అతడి మృతదేహాన్ని చూసి కన్నీరు ఆపుకోలేకపోయారు. శ్రీధర్ కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. హత్యకు దారితీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. బీఆర్ఎస్ శ్రేణులకు అండగా ఉంటామని, మనోధైర్యంతో ఉండాలని సూచించారు.
లక్ష్మీపల్లికి చెందిన రైతు శేఖర్రెడ్డి, యశోదమ్మ దంపతులకు బొడ్డు శ్రీధర్రెడ్డి (50), మ హేశ్వర్రెడ్డి, శంకర్రెడ్డి సంతా నం. శ్రీధర్రెడ్డికి వివాహం కాలే దు. దీంతో తల్లిదండ్రులతోపాటు గ్రామంలోనే ఉంటూ వ్యవసాయం చేస్తుండగా.. మిగతా ఇద్దరు కుటుంబాలతో కలిసి హైదరాబాద్లో నివసిస్తుంటారు. ఉమ్మడిగా ఉంటున్న ఈ కు టుంబానికి 30 ఎకరాల పొలం ఉంది. సాగుతోపాటు బీఆర్ఎస్ పార్టీలో ఆయన చురుకుగా తిరిగేవాడు. కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి ప్రధాన అనుచరుడిగా గుర్తింపు పొందాడు. ప్రస్తుతం వేస వి కావడంతో తన ఇంటికి సమీపంలో ఉన్న వారి కల్లం దొడ్డి వద్ద మంచంపై నిద్రపోయేవా డు. ఈ క్రమంలో బుధవారం రాత్రి కూడా నిద్రపోగా.. అర్ధరాత్రి 12 గంటల తర్వాత విద్యుత్ సరఫరా నిలిచిపోయిన సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. గాడ నిద్ర లో ఉన్న అతడిపై గొడ్డళ్లతో దాడి చేసి హత్య చేశారు. అయితే నిత్యం తెల్లవారుజామున 4 గంటలకే నిద్రలేచి వచ్చి స్నానం, పూజలు చేసే అతడు 4:30 గంటలైనా ఇంకా రాకపోవడంతో అతడి తల్లిదండ్రులు ఇంటి పక్కనే ఉన్న వ్యక్తిని లేపాలని పంపించారు. అతడు వచ్చి చూడ గా శ్రీధర్రెడ్డి హత్యకు గురై కనిపించడంతో వెంటనే వెళ్లి వారికి విష యం చెప్పాడు. తల్లిదండ్రులు వచ్చి చూసి కన్నీరుమున్నీరయ్యారు. తెల్లారేసరికి ఈ విషయం మండలం మొత్తం దావానంలా వ్యాపించింది. పోలీసులకు సమాచారం అందించగా వారు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. డీఎస్పీ వెంకటేశ్వర్రావు, సీఐ నాగభూషణ్రావు ఆధ్వర్యంలో డాగ్స్కాడ్ బృందం రప్పించారు. మృతదేహాన్ని వనపర్తి ప్రభుత్వ దవాఖానకు తరలించి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
భుత్వ దవాఖానలో పోస్టుమార్టం చేశాక శ్రీధర్రెడ్డి మృతదేహాన్ని చిన్నంబావికి తీసుకొచ్చారు. మృతదేహంతో మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి, అభిలాష్రావు నేతృత్వంలో బీఆర్ ఎస్ శ్రేణులు ధర్నాకు దిగారు. శ్రీధర్రెడ్డి హత్యతో ప్ర భుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు మార్మోగాయి. హ త్యకు కారణమైన వారిని గుర్తించి వెంటనే అరెస్ట్ చేయాలని ఎంపీపీ సోమేశ్వరమ్మ, జెడ్పీటీసీ వెంకట్రావమ్మ, నాయకులు గోవింద్ శ్రీధర్ రెడ్డి, చిన్నారెడ్డి, భాస్కర్రె డ్డి, చక్రధర్గౌడ్, స్వామి, మద్దిలేటి తదితరులు డి మాండ్ చేశారు. అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాకతో ధర్నాను విరమించి మృతదేహం తో లక్ష్మీపల్లి వరకు దాదాపు 400 మంది నాయకులు, శ్రేయోలాభిలాషులు దాదాపు 4 కి.మీ. పొడవునా సు మారు గంటకుపైగా కాలినడకన చేరుకున్నారు. ర్యాలీలో కాంగ్రెస్ డౌన్డౌన్, జూపల్లి డౌన్డౌన్ అంటూ బీఆర్ఎ స్ నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు. కేటీఆర్తోపాటు మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్, నాగర్కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, మాజీ ఎమ్మెల్యేలు బీరం హర్షవర్ధన్రెడ్డి, గువ్వల బాలరాజు, ఆల వెంకటేశ్వర్రెడ్డి, ముఖ్యనాయకులు క్రిశాంక్, అభిలాష్రావు, శ్రీధర్రెడ్డి ఇంటికి చేరుకున్నారు. శ్రీధర్రెడ్డి కుటుంబ సభ్యులను కేటీఆర్ పరామర్శించారు. గుండె నిబ్బరం చేసుకోవాలని సూచించారు. నేరుగా ఇంటికెళ్లి న కేటీఆర్, శ్రీధర్రెడ్డి తల్లిదండ్రులు, ఇద్దరు తమ్ముళ్లతో మాట్లాడారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి ప్రధాన అనుచరుడిగా.. పార్టీలో చురుకైన నేతగా శ్రీధర్రెడ్డి గుర్తింపు పొందాడు. లక్ష్మీపల్లిలోనూ, మండలంలోని పలు గ్రామాల్లో ఆ యనకు వివాదరహితుడిగా, అందరితో కలివిడిగా.. స్నేహశీలిగా ఉండేవాడు. ఎ లాంటి ఘర్షణలకు, దౌర్జన్యాలకు తావు లేకుండా.. ప్రజలతో స్నే హభావంగా మెలిగే వాడని మం డల ప్రజలు చెబుతున్నారు. స మిష్టి కుటుంబంగానే ఉంటూ గ్రామంలోనే మంచిపేరు తెచ్చుకున్న శ్రీధర్రెడ్డి హత్యను గ్రా మ, మండల ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఐదు పదుల వయసున్న ఈ నేత కు ఇటు గ్రామంలోనూ.. అటు మండలంలోనూ మం చి పేరున్నది. వివాహానికి దూరంగా ఉన్న ఆయన వి వాదాలకూ దూరంగా ఉంటాడు. ప్రేమపూర్వకంగానే ప్రతిఒక్కరితో మెలిగాడని గ్రామస్తులందరినోట వినిపిస్తున్నది. చిన్నంబావి మండలంలోనే కాకుండా నియోజకవర్గంలో ఈ హత్య చర్చనీయాంశమైంది. ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సొంత మండ లం చిన్నంబావి కావడంతో ప్రధానంగా చర్చకు కారణమైంది. ఎంతటి కక్షలు, కార్పాణ్యాలున్నా.. ఇలా హత్యల వరకు వెళ్లలేదన్న చర్చ సర్వత్రా జరుగుతున్న ది. ఇదిలా ఉంటే, తమ కొడుకును రాజకీయ కక్షతో నే.. స్థానిక మంత్రి ప్రోత్సాహంతోనే హత్య చేశారని శ్రీధర్రెడ్డి తల్లిదండ్రులు పోలీసుల ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే మూడేండ్ల కిందట గ్రామంలో జరిగిన ఓ ఘర్షణలో కేసు నమోదు కావడం.. అరెస్ట్లు జరగడంపై కూడా చర్చకు దారి తీసింది.
సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే హత్యల పరంపర కొనసాగుతుందని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. నిరంతరం అలజడులకు తార్కాణంగా ఉన్న రాయలసీమ వంటి ప్రాంతాలు నేడు ప్రశాంతంగా ఉంటే.. ఇక్కడి తెలంగాణ పల్లెలు అశాంతికి.. అలజడికి గురవుతున్నాయని వాపోయారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా హత్యలు, అలజడులు, దౌర్జన్యాలు అధికార పార్టీ నాయకుల ఆగడాలు మితిమీరిపోయాయన్నారు. ఇందు కు లక్ష్మీపల్లిలో జరిగిన శ్రీధర్రెడ్డి హత్యా ఘటనే ఉదాహరణగా నిలుస్తుందన్నారు. ప్రశాంతంగా ఉన్న కొల్లాపూర్ ప్రాంతం నేడు ఫ్యాక్షన్కు కేరాఫ్గా మారుతుందన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో పదేళ్లలో ఇలాగే హత్యలు జరిగాయా..? అని శ్రీనివాస్గౌడ్ ప్రశ్నించారు. ఈ హత్యల పరంపరను ఇప్పటితో ఆపకపోతే.. గ్రామాల నుంచి మండలాలకు, మండలాల నుంచి తాలూకాలకు, అక్కడి నుంచి రాష్ర్టానికి చేరి రావణకాష్టంలా రాష్ట్రం మారిపోతుందని హెచ్చరించారు.
లక్ష్మీపల్లిలో శ్రీధర్రెడ్డి హత్య హేయమైనదని బీఆర్ఎస్ నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులపై దాడుల పరంపర కొనసాగుతున్నదని, వీటిపై రాష్ట్ర పోలీసు అధికారులను కలిసి విన్నవించామన్నారు. వంగూరు, పెదకొత్తపల్లి, చి న్నంబావి, పెంట్లవెల్లి తదితర మండలాల్లో దాడులు చేయడం, మళ్లీ తమ కార్యకర్తలపైనే కేసులు పెట్టించడం వంటి ఘటనలు అనేకం జరుగుతున్నాయన్నారు. ఎంత మొర పెట్టుకున్నా మళ్లీ దాడులు, హత్యల పరంపర కొనసాగుతుందన్నారు. మంత్రిగా జూపల్లి బాధ్యతలు తీసుకున్న తర్వాత పరిస్థితులు మారిపోయాయన్నారు. చిన్నంబావి ఎస్సైపై రాష్ట్ర పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేశామన్నారు. మంత్రి జూపల్లి అండతో అధికార పార్టీ కి అండగా నిలుస్తున్నాడని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న దాడులు, హత్యల నుంచి మా కార్యకర్తలను ఎలా కాపాడుకోవాలో తమకు తెలుసని, పరిస్థితులు చేయిదాటక ముందే ప్రభుత్వం అప్రమత్తం కావాలని సూచించారు.
శ్రీధర్రెడ్డి హత్య రాజకీయ కుట్రనే.. హత్యపై సీబీఐ ద్వారా విచారణ జరపాలని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి డి మాండ్ చేశారు. ప్రభుత్వ పెద్దల హస్తం లేకుండా ఈ హత్య జరగలేదని, ఎవరిని కదలించినా ఇదే విషయం తెలియజేస్తారని అన్నారు. హత్య విషయం తెలుసుకొని వందల కిలోమీటర్ల నుంచి మా నాయకుడు కేటీఆర్ రావడం.. మృతుడి కుటుంబానికి, బీఆర్ఎస్ శ్రేణుల్లో కొండంత ధైర్యం నింపిందన్నారు. తన అనుచరుడికి కోల్పోవడం చాలా బాధగా ఉన్నదన్నారు. కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని, మీకు అండగా ఉంటామని భరోసా నింపారు.
హత్యా రాజకీయాలకు తెరలేపిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాగ్రహానికి గురికాక తప్పదని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాగర్కర్నూల్ జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజు హెచ్చరించారు. ప్రభుత్వ అండతోనే బీఆర్ఎస్ శ్రేణులపై దాడులు, హత్యలు జరుగుతున్నాయని, ఇటీవలే తాము రాష్ట్ర పోలీసు అధికారులను కలిసి మొరపెట్టుకున్నామని తెలిపారు. దాడులకు ప్రతిదాడులు మా సంస్కృతి కాదని, కాంగ్రెస్ బెదిరింపులకు భయపడేది లేదని తేల్చిచెప్పారు.
శ్రీధర్రెడ్డి మృతితో గ్రామం మూగబోయింది. కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలతో హృదయ విదారకంగా మారింది. సాయంత్రం శ్రీధర్రెడ్డి అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య నిర్వహించారు. గ్రా మం జనసంద్రమైంది. శ్రేయోభిలాషులు, బీఆర్ఎస్ నాయకులు, కా ర్యకర్తలు, గ్రామ, మండల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి నివాళులర్పించారు. ప్రధాన అనుచరుడిని పోగొట్టుకున్న బీరం హర్షవర్ధన్రెడ్డి అంతిమ యాత్రలో పాడె మోసి నివాళులర్పించారు. ఉదయం నుంచి శ్రీధర్రెడ్డి ఇంటి కుటుంబ సభ్యులకు ధైర్యం నూరిపోశారు. అనంతరం సొంత వ్యవసాయ క్షేత్రంలో అశ్రునయనాల మధ్య అంతిమయాత్ర ముగిసింది. కాగా, వనపర్తి డీఎస్పీ వెంకటేశ్వరావు, సీఐ నాగభూషణ్రావుతోపాటు ఎస్సైలు గ్రామంలో ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. గతంలో కొల్లాపూర్ నియోజకవర్గంలో హత్యా రా జకీయాలు లేవని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఫ్యాక్షన్ సంస్కృతి పాకిందని పలువురు చర్చించుకున్నారు.