మహ్మదాబాద్, జనవరి 28 : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ సోమవారం పరిగికి రానున్నట్లు బీఆర్ఎస్ ఉ మ్మడి మండలాల అధ్యక్షుడు భిక్షపతి, పెంట్యానాయక్ ఆదివారం ప్రకటనలో తెలిపారు.
సోమవారం పరిగి పట్టణంలో మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గస్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహిస్తారని, దీనికి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరువుతున్నట్లు పేర్కొన్నారు. గండీడ్, మహ్మదాబాద్ మండలాలకు చెందిన పార్టీ నాయకులు, ముఖ్య కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలిరావాలని వారు కోరారు.