గద్వాల, మే 7 : బీఆర్ఎస్ నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్కు మద్దతుగా బుధవారం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గద్వాలలో రోడ్షో నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి తెలిపారు. సాయంత్రం నాలుగు గంటలకు రోడ్ షో అనంతరం పాతబస్టాండ్లో కేటీఆర్ ప్రసంగిస్తారని చెప్పారు. ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కోరారు.