బీఆర్ఎస్ మ్యానిఫెస్టోపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. పేదలు, సామాన్యుల బాధలు తెలిసిన సీఎం కేసీఆర్ అద్భుత పథకానికి రూపకల్పన చేశారు.పేదలపై మోదీ సర్కారు సిలిండర్ బండభారం మోపితే.. గులాబీ పార్టీ బాస్ మాత్రం తక్కువ ధరకే గ్యాస్ అందించాలని నిర్ణయించారు. త్వరలో హ్యాట్రిక్ విజయం అనంతరం ప్రభుత్వం ఏర్పాట య్యాక వంట గ్యాస్ ధరను భారీగా తగ్గిస్తామని ప్రకటించారు. కేంద్రం పెంచే ధరలతో సంబంధం లేకుండా రూ.400కే అందజేస్తామని వెల్లడించారు. దీంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో 15 లక్షల కుటుంబాలకు ప్రయోజనం చేకూరనున్నది. ఒక్కో సిలిండర్పై ప్రస్తుతం ఉన్న రేట్ల ప్రకారం రూ.600పైగానే భారం తగ్గే అవకాశం ఉన్నది. పేదలు, ముఖ్యంగా మహిళలు కేసీఆర్ ప్రకటనపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ చూసినా మ్యానిఫెస్టోపైనే చర్చ కొనసాగుతున్నది. పేదలకు లబ్ధి చేకూర్చేలా పథకాలు అందించడంలో బీఆర్ఎస్కు ఇంకెవరూ సాటిరారని ప్రశంసలు గుప్పిస్తున్నారు. మళ్లీ సీఎంగా కేసీఆరే రావాలని ముక్తకంఠంతో ప్రకటిస్తున్నారు. మోదీ సర్కారు ధరల మోతతో 30 శాతం కుటుంబాలు మళ్లీ కట్టెలపొయ్యి వెలిగిస్తుండగా.. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంతో వీరందరికీ లబ్ధి చేకూరి గ్యాస్ పొయ్యి వాడనున్నారు.
పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలతో విలవిలలాడుతున్న సామాన్యులకు సీఎం కేసీఆర్ ఊరటనిచ్చే మ్యానిఫెస్టో ప్ర కటించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన లబ్ధిదారులకు రూ.400కే గ్యాస్ సిలిండర్ అందిస్తామని చెప్పారు. ప్రపంచ వ్యా ప్తంగా ముడి చమురు ధరలు తగ్గినా కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధరలను పెంచుతూనే ఉన్నది. ప్రజల మాటలు పెడచెవిన పెడుతూ అడ్డగోలుగా ధరలు ఆకాశాన్నంటేలా చేశాయి. చాలా మంది తెలంగాణలో కట్టెల పొ య్యి పెట్టుకోవాల్సిన దుస్థితి వచ్చేలా చేసింది. ఇప్పుడు సీఎం కేసీఆర్ అర్హులైన ల బ్ధిదారులకు రూ.400 కే గ్యాస్ సిలిండర్ అందిస్తామనడం ఎంతో సంతోషంగా ఉన్నది. ముఖ్యమంత్రి మాట ఇస్తే తప్పరు. కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని దేవుడిని కోరుకుంటున్నాం.
మహబూబ్నగర్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కేంద్ర ప్రభుత్వం పేదలకు సిలిండర్ అందకుండా చేసింది. తొమ్మిదిన్నర ఏళ్ల కాలంలో సిలిండర్ ధర ఒకే సారి మూడింతలు పెంచింది. దీని బండబడ గ్యాస్ అంటేనే భయపడేలా చేసింది. ప్రతిసారి గ్యాస్, పెట్రోల్ ధరలు పెంచుతూ సామాన్యుల నడ్డి విరిచింది. వంట గ్యాస్ ధరలు అమాంతంగా పెరగడంతో గ్రామీణ ప్రాంతాల్లో మళ్లీ కట్టెలపొయ్యిలు అంటుకుంటున్నాయి. ఎన్నిసార్లు విపక్షాలు మొత్తుకున్నా మోదీ కనికరించలేదు. మహిళలు రోడ్డెక్కినా ఫలితం లేకుండాపోయింది. అధికారంలో వచ్చే నాటికి రూ.400 ఉన్న గ్యాస్ ఏకంగా రూ.1200 కు పెంచి ఎన్నికల ఎఫెక్ట్ పడుతుందేమోనన్న భయంతో రూ.200 తగ్గించింది. అయినా పేదలకు ఇది పెనుభారంగా మారింది.
మనసున్న మారాజు సీఎం కేసీఆర్ మాత్రం 15న బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో ధర తగ్గించి ఇస్తామని ప్రకటించింది. పేద, మ ద్య తరగతి మహిళలకు ఏకంగా వంట గ్యాస్ను కేవలం రూ.4 వందలకే అందిస్తామని హామీ ఇచ్చింది. దీంతో మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ చూసి నా బీఆర్ఎస్ మ్యానిఫెస్టోపైనే చర్చ నడుస్తున్నది. కేసీఆర్ ఏది చెబితే అది చేసి చూపిస్తారని గంటాపథంగా చెబుతున్నారు. గ్యాస్ ధరలు పెరగడంతో ఉమ్మడి జిల్లాలో దాదాపు 30 శాతం కుటుంబాలు మళ్లీ కట్టెల పొయ్యినే నమ్ముకున్నాయి. మధ్య తరగతి కుటుంబాలు కూడ గ్యాస్ను పొదుపుగా వాడుకోవడం పట్టణ ప్రాంతా ల్లో కనిపిస్తుంది. గతంలో ఏడాదికి ఐదు నుంచి ఆరు సిలిండర్లు వాడేవాళ్లు ఇప్పుడు మూడింటికీ పరిమితమయ్యారు. పేదలు ఏడాదికి నాలుగు సిలిండర్లు వాడుతుంటే ఇప్పుడు సగానికి తగ్గించేశారు. రెండు సిలిండర్లు అయితే చాలని భావిస్తున్నారు. అంతేగాక వేలాది జర్నలిస్టు కుటుంబాలకు సైతం తక్కువ ధరకే వంట గ్యాస్ అందనున్నది. జర్నలిస్టులు కూడ ఆనందంలో ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో దాదాపు 2500 మంది జర్నలిస్టు కుటుంబాలు కూడ గ్యాస్ పెంపుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మహిళలకు రూ.400లకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని బీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించడంతో మహిళల ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. కేంద్రం లో అధికారంలో ఉన్న బీజేపీ అడ్డగోలుగా గ్యాస్ ధరలను పెంచి పేద, మధ్య తరగతిపై ధరాఘాగం మోపింది. కానీ మహిళల కష్టాలను అర్థం చేసుకున్న బీఆర్ఎస్ మళ్లీ అధికారంలో వచ్చిన వెంటనే రూ.400లకే సిలిండర్ ఇస్తామని ప్రకటించింది. ఇది వెంటనే అమలులో వస్తుందని పార్టీ నాయకులు చెబుతున్నారు. కేంద్రం ఎంత పెంచినా బీఆర్ఎస్ మాత్రం కేవలం రూ. 400లకే ఇవ్వాలని నిర్ణయించడంపై సర్వత్రా చర్చ నడుస్తున్నది. ఇదే గనుక జరిగితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో దాదాపు 15 లక్షల కుటుంబాలకు ప్రయోజనం చేకూరనున్నది. ఇందులో జర్నలిస్టులను కూడ చేర్చడంతో సుమారు 2,500 మంది అక్రిడిటేషన్ ఉన్న వారికి కూడా వర్తించనున్నది.
కేసీఆర్ పేదల పక్షపాతి అని.. వారు పడుతున్న బాధలను అర్థం చేసుకొని చాలా మంచి నిర్ణయం తీసుకున్నారని మహిళలు అంటున్నారు. కట్టెలపొయ్యి పపోయి సిలిండర్ వచ్చిందనే సంతోష పడుతున్న సమయంలోనే కేంద్ర ప్రభుత్వం సిలిండర్ ధరను పెంచుతూ ఏకంగా రూ.12 వందలు చేసింది. గతంలో నెలకు ఒక సిలిండర్, ఏడాదికి సుమారు 8 నుంచి 12 వరకు సిలిండర్లు తీసుకునేవారు.. ప్రస్తుతం వాటి సంఖ్య పూర్తిగా తగ్గిందని ఏజెన్సీ నిర్వాహకులే చెబుతున్నారు. డిమాండ్ పూర్తిగా తగ్గిపోయిందని, చాలామంది సిలిండర్లు అంటే వద్దనే పరిస్థితి నేటిది. ఒక్క రోజు సిలిండర్ రాకపోతే గగ్గోలు పడిన వినియోగదరాఉలు ఇప్పుడు ఆన్లైన్లో బుక్ చేసుకోవాలంటేనే జంకుతున్నారు. మొత్తంపై సిలిండర్ ధర తగ్గించి ఇస్తామన్న సీఎం కేసీఆర్ హామీ మహిళలకు వరంగా మారింది.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కర్ణాటక ప్రాంతం సరిహద్దుగా ఉంది. ఇటీవలే కన్నడ రాష్ట్రంలో అధికారంలో వచ్చిన కాంగ్రెస్ అనేక హామీలు ఇచ్చింది. కానీ అధికారం వచ్చి ఆరునెలలు కాకముందే వాటన్నింటినీ తుంగలో తొక్కింది. హామీలు నెరవేర్చలేమని చేతులేత్తేసింది. అయితే పక్క రాష్ట్రంతో మన రాష్ట్రం వారికి చాలా వరకు బంధుత్వాలు ఉన్నాయి. అక్కడి పరిస్థితిని తెలుసుకున్న మహిళలు కాంగ్రెస్ వాగ్దానాలిచ్చి నేరవేర్చడం లేదని తెలిసి ఖంగుతింటున్నారు. అక్కడి పరిస్థితిని తెలుసుకుంటున్న కాంగ్రెస్ నేతలు ఎలా జనంలోకి వెళ్లాలని మదనపడుతున్నారు. ఇలా అయితే ఎన్నికల్లో ఏ మొఖం పెట్టుకొని ప్రచారం చేస్తామని కొందరైతే బాహాటంగానే పెదవి విరుస్తున్నారు.
కేంద్రంలో బీజేపీ ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సిలిండర్ ధరలను పెం చుతూనే ఉన్నది.నిత్యావసరాల ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. సిలిం డర్ను మూడింతలు పెంచి సామాన్యులపై పెనుభారం మోపిం ది. ఎప్పుడు ఏ ధర ఉంటుందో తెలియక సతమతమవుతున్నాం. ఇయాల ఉన్న ధర మళ్లీ సిలిం డర్ తీసుకునేటప్పుడు ఉండడం లేదు. దీంతో సిలిండర్ కొనలేక.. పొయ్యిలకు కట్టెలు దొరకక చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇటీవల సీఎం కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ మ్యాని ఫెస్టోలో అర్హులకు రూ.400కే సిలిండర్ ఇవ్వనున్నట్లు ప్రకటించడంతో చాలా ఆనం దంగా ఉన్నది. చాలా మంది పేద కుటుంబాలకు ఎంతో ఉపశమనం కలుగు తుంది. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకే మా మద్దతు ఉంటుంది.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఇ టీవల ప్రకటించిన బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో రూ.400కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పడం ఎంతో సం తోషంగా ఉన్నది. బీజేపీ ప్రభుత్వం సిలిండర్ ధరలను మూడింతలు పెంచింది. కట్టెల పొయ్యి మీద వంట చేసుకునే పరిస్థితులు వచ్చాయి. ఎన్నికల వేళ బీజేపీ నాయకులు వచ్చి ఏవో మాయమాటలు చెబుతున్నాం. వారిని ఎట్టి పరిస్థితుల్లోనే నమ్మం. సీఎం కేసీఆర్ మూడోసారి అధికారంలోకి వస్తే రూ.400కే గ్యాస్ ఇస్తామని చెప్పారు. ఆయన మాట ఇచ్చాడంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మరువరు. అలాంటి వ్యక్తికి జీవితాంతం రుణపడి ఉంటాం. నిరంతరం అభివృద్ధికి పాటుపడుతున్న బీఆర్ఎస్కే మా మద్దతు.
పేద, మధ్య తరగతి వారికి అండగా ఉండేది బీఆర్ఎస్ సర్కారు. పేదల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఖర్చుభారం తగ్గించేందుకు సిలిండర్ ధర తగ్గించడం ఆనందంగా ఉంది. కట్టెల పొయ్యి బాధ తప్పించుకొని గ్యాస్ సిలిండర్ పెట్టుకుంటే పెరిగిన సిలిండర్ ధర తలకు మించిన భారంగా తయారైంది. కేసీఆర్ సార్ తీసుకున్న మంచి నిర్ణయంతో ప్రతినెలా ఖర్చు తగ్గి పైసలు ఆదా అవుతాయి. కేసీఆర్ సర్కార్కు మహిళా లోకం రుణపడి ఉంటుంది. సాయం చేసే సర్కారు రుణం తీర్చుకుంటాం. సీఎం కేసీఆర్ ప్రకటించిన మ్యానిఫెస్టోను చూసి ప్రతిపక్షాలకు ఏం చేయాలో పాలుపోక అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. వారిని ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరు.
సీఎం కేసీఆర్ చేసేదే చెప్తా రు. చెప్పింది కచ్చితంగా అమలు చేస్తారు. అర్హులైన మహిళలకు ఒక్కో సిలిండర్కు రూ.400కే ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. సిలిండర్ ధర ఎక్కువ ఉందని కట్టెల పొయ్యి పెట్టుకున్నా.. కేంద్రం ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లు సిలిండర్ ధరలను పెంచుతూ సామాన్యులను ఇబ్బందులకు గురి చేస్తున్నది. కేసీఆర్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.400కే సిలిండర్ ఇస్తే మాలాంటి పేదలకు ఎంతో మేలు జరుగుతది. పీఎం మోదీ ప్రభుత్వం ధరలు పెంచుకుంటా పోతే.. సీఎం కేసీఆర్ ప్రభుత్వం తగ్గించుకుంటూ వస్తున్నది.మళ్లీ తెలంగాణ ప్రభుత్వాన్నే గెలిపించుకుంటాం.సీఎం కేసీఆర్కు వెన్నంటే ఉంటాం. మంచి చేసే ప్రభుతానికే మా మద్దతు.
వచ్చే ఎన్నికల హామీలో భాగం గా సీఎం కేసీఆర్సారు రూ. 400కే సిలిండర్ అందిస్తానని మ్యానిఫెస్టోలో పెట్టడం సంతోషం. ప్రస్తుతం రూ.1100 పైచిలుకు సిలిండర్ ఉండడంతో ఒక పూట కట్టెల పొయ్యి, ఒక పూట సిలిండర్పై వంటలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం. కేంద్రంలో సర్కారు అన్నిరేట్లు పెంచుకుంటూ పోతుండడంతో చాలీచాలని జీవితాలు గడిపే మేము ఒకపూట తిన్నట్లు, ఒకపూట తిననట్లు గడుపుతున్నాం. కానీ సీఎం కేసీఆర్ సారు మహిళా పక్షపాతిగా ఉంటూ రూ.400కే సిలిండర్ ఇస్తాననడం సంతోషంగా ఉంది. పెళ్లీడుకు వచ్చిన ప్రతి ఆడపడుచు పెండ్లికి కల్యాణలక్ష్మితో ఆదుకుంటుండు. వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ను మరోసారి గెలిపించుకుని ఆయన రుణం తీర్చుకుంటాం.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్యాస్ సిలిం డర్ ధర ఆకాశాన్నంటింది. పెంచడ మే తప్పా తగ్గించడం తెలియదు వాళ్లకు. దీంతో సా మాన్యులకు వంట గ్యాస్ అందనంత ఎత్తులో ఉన్నందున కట్టెల పొయ్యి దిక్కయ్యే పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో బీఆర్ఎస్ సర్కారు ప్రవేశపెట్టిన మ్యానిఫెస్టో అద్భుతంగా ఉన్నది. అర్హులైన మహిళలకు రూ.400కే సిలిండర్ అందిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడం ఎంతో ఆనందంగా ఉన్నది. దీంతో సామాన్యులకు సైతం సిలిండర్ అందుబాటు ధరలో దొరకనున్నది. ముఖ్యమంత్రి మాట ఇచ్చాడంటే తప్పకుండా నెరవేరుస్తాడన్న నమ్మకం అందరికీ ఉన్నది. ఇదొక్కటే కాకుండా మహిళల సంక్షేమానికి ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారు. సీఎంసీఎం కేసీఆర్కు మా అండదండలు ఎప్పటికీ ఉంటాయి.
కేంద్రంలో బీజేపీ అధి కారంలోకి వచ్చిన తర్వా త గ్యాస్ సిలిండర్ ధరలు పెంచిం ది. ప్రస్తుతం గ్యాస్ ధరలు మండి పోతున్నాయి. సామాన్య, పేద మహిళలు గ్యాస్ స్టవ్ మీద చేసే పరిస్థితి లేదు. ప్రస్తుతం మార్కెట్లో సిలిండర్ ధర రూ.1,200 వసూలు చేస్తున్నారు. పెద్ద కుటుంబాలకైతే నెల కూడా సిలిండర్ సరిపోదు. గతంలో సబ్సిడీ ఇచ్చేవారు. ప్రస్తుతం అది కూడా బంద్ కావడంతో గ్యాస్ కంపెనీలు చెప్పిన ధరకే కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఇప్పుడేమో ఇష్టారీతిలో ధరలు పెంచుతున్నారు. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళల కోసం గ్యాస్ను రూ.400కే ఇస్తానంటున్నారు. కేసీఆర్ పేదల కష్టాలు తెలిసినోడు కాబట్టి సిలిండర్ ధర తగ్గిస్తామని చెప్పారు. ఆయన మాట ఇస్తే కచ్చితంగా చేసి తీరుతరు. పేదలు ఎప్పుడూ కేసీఆర్కు అండగా ఉంటారు.
సీఎం కేసీఆర్ పేద ప్రజలపాలిట దైవం. అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు తగ్గినా కేంద్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా వంట గ్యాస్ ధరలు పెంచుతూ పోతున్నది. ధరలు భరించలేక మాలాంటి పేదలకు కట్టెల పొయ్యే దిక్కయింది. సిలిండర్ రూ.1,200 ధర పడుతుంది. చేసిన కష్టం దానికే పోతున్నది. ఏమీ మిగలడం లేదు. నిత్యావసర సరుకుల ధరలు కూడా పెరగడంతో ఏమీ తినలేకపోతున్నాం. ఇప్పుడు ఉన్న సిలిండర్ ధర ఇంకో నెల ఉండడం లేదు. ఎప్పుడు ఏ ధర ఉంటుందో తెలియడం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకొని సీఎం కేసీఆర్ సార్ అర్హులైన కుటుంబాలకు ఒక్కో వంటగ్యాస్ సిలిండర్ రూ.400కే ఇవ్వాలని నిర్ణయించారు. చాలామందికి ఉపయోగంగా ఉంటది.మోదీ సర్కారు తీరుతో పేద,మధ్య తరగతిపై ధరల భారం పడగా.. మనసున్న మారాజు సీఎం కేసీఆర్ నిర్ణయంతో వీరికి ఊరట కలగనున్నది.