కోస్గి, జనవరి 28 : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని గ్రంథాలయ సంస్థ జి ల్లా చైర్మన్ రామకృష్ణ, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు హన్మంత్రెడ్డి అన్నారు. స్థానికంగా శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ హథ్ సే హథ్ జోడో యాత్ర పేరుతో రేవంత్రెడ్డి శుక్రవారం కోస్గిలో పర్యటించి ఆసత్య ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. నిజాలు మాట్లాడడం నేర్చుకోవాలన్నారు. ఒకసారి కొడంగల్ ప్రజ లు ఓడించి బుద్ధి చెప్పినా తీరుమారలేదన్నారు. కొడంగల్ నియోజకవర్గాన్ని తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అభివృద్ధయిందని గొప్పలు చెప్పుకోవడం మానుకోవాలన్నారు.
ఎ వరి హయాంలో అభివృద్ధి చెందిందో ప్రజలకు తెలుసన్నా రు. కోస్గి బస్టాండ్, మున్సిపాలిటీ, గ్రామ గ్రామాన రోడ్లు ఎవరు చేశారో ప్రజలకు అన్ని తెలుసన్నారు. నాలుగేండ్లుగా కొడంగల్ ప్రజలు గుర్తుకు రాలేదా ఎన్నికలు దగ్గరపడుతుంటే మళ్లీ కొడంగల్ గుర్తుకొచ్చిందా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్, ఎ మ్మెల్యేను ఇష్టానుసారంగా మాట్లాడితే కొడంగల్ నుంచి తరమికొట్టాల్సి వ స్తుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ శిరీష, ఎంపీపీ మధుకర్రావు, వైస్ఎంపీపీ సాయిలు, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు రాజేశ్, నా యకులు తదితరులు పాల్గొన్నారు.
కొండారెడ్డిపల్లి నుంచి గెలిపిస్తే కొండెక్కిచావు
మద్దూర్ (కొత్తపల్లి), జనవరి 28 : కొండారెడ్డిపల్లి నుం చి టీపీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డిని గెలిపి స్తే మమ్మల్ని కొండెక్కిచావని బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సి.వెంకటయ్య, బీఆర్ఎస్ మండల వైస్ ప్రైసిడెంట్ దాసు, కోస్గి మార్కెట్ కమిటీ చైర్మన్ వీరారెడ్డి, నాయకులు అన్నా రు. పట్టణంలోని షా గార్డెన్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వా రు మాట్లాడుతూ శుక్రవారం హథ్ సే హథ్ జోడో యాత్ర లో రేవంత్రెడ్డి మాట్లాడుతూ గల్లీలో తిరిగే వారిని సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలను చేశామని పేర్కొనడం ఆసత్యమన్నారు.
తమరు ఎమ్మెల్యే కాకముందే సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలము అ య్యామన్నారు. పశువుల సంత, గురుకుల పాఠశాలను గ్రా మస్తులందరం కలిసి తీసుకొచ్చామన్నారు. ప్రజలకు ఎన్ని అబద్దాలు చెప్పినా నిజమేమిటో తెలుసన్నారు. రాజీవ్గాం ధీ, అంబేద్కర్కు పూలమాల వేయకుండా వెళ్లిపోయావన్నారు. హథ్ సే హథ్ జోడో యాత్ర కాదు హథ్ సే చోడో యాత్ర అన్నారు. అబద్దాలు చెప్పడం మా ఎమ్మెల్యేకు సా ధ్యం కాదన్నారు. ప్రజలకు అందుబాటులో ఎప్పుడు ఉం టారన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ బీసీ సెల్ మండలాధ్యక్షుడు రాములు, నాయకులు వెంకట్రాములుగౌడ్, వీరేశ్గౌడ్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.