బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాల సంబురం నెలకొన్నది. ఉమ్మడి జిల్లాలో రోజూ కొన్ని చోట్ల సమావేశాలు జరుగుతున్నాయి. శనివారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. అలాగే జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి, నారాయణపేట జిల్లా మక్తల్లో జరిగిన సమావేశాలకు ఎమ్మెల్యే అబ్రహం, ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పార్టీశ్రేణులు భారీగా తరలిరావడంతో మూడు ప్రాంతాలు గులాబీమయంగా మారాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాక్షేత్రంలోకి పార్టీ కార్యకర్తలు వెళ్లి వారి సమస్యలు తెలుసుకొని పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధిని ప్రజలకు వివరించాలన్నారు. ప్రగతిపై విపక్షాల నేతలు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని వారు సూచించారు.
మహబూబ్నగర్, మార్చి 25 (నమస్తే తెలంగాణ ప్ర తినిధి) : పాలమూరు అభివృద్ధి చెందుతుంటే కొంతమం ది పనిగట్టుకొని కుట్రలు, కుతంత్రాలు చేస్తూ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని, వారి ఆగడాలు ఇక సాగవని.. ప్రతి కార్యకర్త కుట్రలను తిప్పికొట్టాలని ఆబ్కారీ, క్రీడా శాఖ మంత్రి డా.వి.శ్రీనివాస్గౌడ్ పిలుపునిచ్చారు. శనివారం మంత్రి క్యాంప్ కార్యాలయంలో మహబూబ్నగర్ మున్సిపాలిటీలోని 16 వార్డుల బీఆర్ఎస్ కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మా ట్లాడుతూ పట్నం దగ్గరున్నందున పా లమూరు అభివృద్ధి చెందదన్నారు. కానీ, నేడు ఎంతో అభివృద్ధి చేసి చూపించామన్నారు. పార్టీ ఇన్చార్జిలు, కార్యకర్తలు వార్డుల్లోని లబ్ధిదారులను నేరుగా వెళ్లి పలకరించాలని, మే మంతా అండగా ఉంటామన్న భరోసా కల్పించాలన్నారు. నిత్యం వారితో టచ్లో ఉం డాలన్నారు. ఇకనుం చి వార్డుల్లో పర్యటిం చి సమస్యలు పరిష్కరిస్తానన్నారు. 24 గంటలూ నియెజకవర్గంలోనే ఉంటానని చెప్పారు. ధర్మం మన వైపు ఉంది కాబట్టి విపక్షాల నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎంతో దగా పడ్డాం.. అన్యాయానికి గురయ్యాం.. ఇప్పుడిప్పుడే జిల్లాను బాగు చేసుకుంటున్నామని అన్నారు. చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని ప్రజాప్రతినిధులకు సూచించారు. మద్యం, పైసలకు అమ్ముడుపోవద్దన్నారు. కావాల్సిది అభివృద్ధి, బాగుపడటమే అన్న విషయాన్ని గుర్తించాలన్నారు. దేశంలోనే అతిపెద్ద లిథియం బ్యాటరీ పరిశ్రమ మహబూబ్నగర్కు వస్తుంటే ఓర్వలేని విపక్షాలు ప్రజలకు తప్పుదోవ పట్టిస్తున్నాయని ధ్వజమెత్తారు. అడ్వాన్స్ టెక్నాలజీతో బ్యాటరీలు తయారవుతాయన్నారు.
రాబోయే కాలం అంతా.. లిథియం బ్యాటరీలదేనని, దేశం ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదుగుతుందని చెప్పారు. జమ్మూకశ్మీర్లో లిథియం నిల్వలు బయటపడ్డాయని, పెట్రోల్ లేకుండానే బ్యాటరీలతో నడిచే వాహనాలు రాబోతున్నాయన్నారు. అలాంటి పరిశ్రమ మన జిల్లాకు వస్తే ఎంత పేరు వస్తుందో గుర్తుంచుకోవాలన్నారు. ఇక్కడ మన పిల్లలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఇది చూసి ఓర్వలేక బీజేపీ, కాంగ్రెస్ నాయకులు కాలుష్యం పేరిట కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. ఈ ప్రాంతానికే తలమానికమైన ఐటీ టవర్ను వచ్చే నెలలో మంత్రి కేటీఆర్తో ప్రారంభిస్తామని చెప్పారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రాజేశ్వర్, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, వైస్ చైర్మన్ గణేశ్, ముడా చైర్మన్ వెంకన్న, డీసీసీబీ వైస్ చైర్మన్ వెంకటయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ రహెమాన్, వైస్ చైర్మన్ గిరిధర్రెడ్డి, పట్టణ అధ్యక్షుడు శివరాజ్, కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.