మరికల్(ధన్వాడ), మార్చి 11: ఖబడ్దార్ బండి.. ఎమ్మెల్సీ కవితకు క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ కవితపై బీజేపీ నేత బండిసంజయ్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ శనివారం జిల్లా వ్యాప్తంగా ధర్నాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మరికల్ మండలకేంద్రంలో నిర్వహించిన ధర్నాకు ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. ఆడబిడ్డ కవితపై అనుచితంగా మాట్లాడిన తీరును తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని.., ఖబడ్దార్ బండి సంజయ్ అని హెచ్చరించారు. తెలంగాణలో బీఆర్ఎస్ను ఎదుర్కోలేక ఈడీ, మోడీ అంటూ నాటకాలాడుతున్న బీజేపీకి రోజులు దగ్గర పడ్డాయన్నారు. తెలంగాణ మహిళలు బండి సంజయ్ను తరిమితరిమి కొట్ట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. అనంతరం మరికల్ పోలీస్స్టేషన్లో జెడ్పీ వైస్ చైర్పర్సన్గౌని సురేఖారెడ్డితో కలిపి బండి సంజయ్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో మరికల్ సర్పంచ్ గోవర్ధన్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తిరుపతయ్య, సీనియర్ నాయకులు రాజవర్ధన్రెడ్డి, హన్మిరెడ్డి, బసంత్, అశోక్, రామస్వామి, కృష్ణారెడ్డి, ఎంపీటీసీ గోపాల్, పట్టణ అధ్యక్షులు చంద్రశేఖర్, బాలకృష్ణ, ఉపసర్పంచ్ శివకుమార్, ప్రకాశ్, నర్సింహులు, రాజేశ్వర్రెడ్డి, వీరన్న పాల్గొన్నారు.
నారాయణపేట, మార్చి 11: ఎమ్మెల్సీ కవితపై విద్వేష, విషపూరిత వాఖ్యలు చేసిన బండి సంజయ్పై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ అనసూయ, జెడ్పీటీసీ అంజలి డిమాండ్ చేశారు. శనివారం పట్టణంలోని వీరసావర్కర్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ శ్రేణులు బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీజేపీ నాయకుల తీరు ప్రజాస్వామ్య వ్యవస్థకే సిగ్గుచేటన్నారు. మోడీ వైఫల్యాలను దేశ ప్రజల ముందు ఎత్తి చూపుతున్నందుకే సీఎం కేసీఆర్ కుటుంబంపై ఈడీ చేత దాడులు చేయిస్తుందన్నారు. అనంతరం స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి చెన్నారెడ్డి, మైనార్టీ పట్టణాధ్యక్షుడు మహిమూద్, మార్కెట్ కమిటీ మాజీ వైస్చైర్మన్ జగదీశ్, నాయకులు చంద్రకాంత్, ప్రతాప్రెడ్డి, శివరాంరెడ్డి, వెంకట్రాములు పాల్గొన్నారు.
కృష్ణ, మార్చి 11: సీఎం కేసీఆర్పై కుట్రలో భాగంగానే ఎమ్మెల్సీ కవితను ఢిల్లీ లిక్కర్ స్కాంలో రెండోసారి ఈడీ విచారణకు ఆదేశించడం బీజేపీ కక్షపూరిత చర్యలని బీఆర్ఎస్ నాయకులు అమరేశ్, సురేశ్, రవి అన్నారు. మండలకేంద్రంలో శనివారం వారు విలేకరులతో మాట్లాడారు. బీజేపీ నాయకులు రాజకీయంగా ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలని, ఈడీ, ఐటీ సంస్థలను ప్రేరేపించడం సరికాదన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మరికల్(ధన్వాడ), మార్చి 11: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వాఖ్యలను నిరసిస్తూ శనివారం మరికల్ మండలకేంద్రంలో అంతరాష్ట్ర ప్రధాన రహదారిపై బీఆర్ఎస్ నాయకులు గంటపాటు రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. ఆడబిడ్డపై అనుచిత వాఖ్యలు చేయడం బండి సంజయ్కు తగదని వెంటనే కవితకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ గోవర్ధన్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తిరుపతయ్య, సీనియర్ నాయకులు రాజవర్ధన్రెడ్డి, హన్మిరెడ్డి, బసంత్, అశోక్, రామస్వామి, కృష్ణారెడ్డి, ఎంపీటీసీ గోపాల్, పట్టణ అధ్యక్షులు చంద్రశేఖర్, బాలకృష్ణ, ఉపసర్పంచ్ శివకుమార్, ప్రకాశ్, నర్సింహులు, రాజేశ్వర్రెడ్డి, వీరన్న, అనంత్రెడ్డి, హన్మంతు, హాసన్ తదితరులు పాల్గొన్నారు.
కోస్గి, మార్చి 11: బీజేపీ రాష్ట అధ్యక్షుడు బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ శాసంరామకృష్ణ అన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. బండి సంజయ్ ఎమ్మెల్సీ కవిత, కేసీఆర్ కుటుంబంపై అనుచిత వాఖ్యలు చేయడం సరికాదన్నారు. మరోసారు అనుచితంగా మాట్లాడితే సహించేదిలేదని హెచ్చరించారు.
దామరగిద్ద, మార్చి 11: మండలకేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. ఎమ్మెల్సీ కవితపై అనుచిత వాఖ్యలు చేసిన బండి సంజయ్ను అరెస్టు చేసి తగిన చర్యలు చేపట్టాలని కోరుతూ మండల నాయకులు దామరగిద్ద అంబేద్కర్ కూడళిలో రాస్తారోకో నిర్వహించారు. అనంతరం పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ బక్క నర్సప్ప, వైస్ ఎంపీపీ దామోదర్రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ భీమయ్యగౌడ్, పీఏసీసీఎస్ అధ్యక్షుడు పుట్టి ఈదప్ప, ఎంపీటీసీ కిషన్రావు, పట్టణ అధ్యక్షుడు అశోక్గౌడ్, వివిధ గ్రామాల నాయకులు పాల్గొన్నారు.
మహబూబ్నగర్ మెట్టుగడ్డ, మార్చి 11: ఎమ్మెల్సీ కవితపై ఆసభ్యకరంగా మాట్లాడిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని మహబూబ్నగర్ టూటౌన్ పోలీస్స్టేషన్లో శనివారం రాత్రి బీఆర్ఎస్ పట్టణ మహిళా కమిటీ అధ్యక్షురాలు లక్ష్మి, ప్రధాన కార్యదర్శి సుధా, కౌన్సిలర్ వనజ, కో ఆప్షన్ సభ్యురాలు జ్యోతి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ అనుచితంగా చేసిన వాఖ్యలను ఉపసంహరించుకోవాలని, వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నర్మదా, పల్లవి, కల్పన, సరిత, వెంకటమ్మ, లక్ష్మి, మున్సిపల్ వైస్చైర్మన్ గణేశ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు శివరాజు, వినోద్, బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుదీప్రెడ్డి, బాలుముదిరాజ్, సత్యపాల్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.