తెలంగాణ సర్కారు రైతుల కోసం తెచ్చిన ధరణితో శానా బాగుంది. ఇది వచ్చినంక భూమి రిజిస్ట్రేషన్ కోసం దళారులకు పైసా ఇయ్యాల్సిన పని లేకుండా పోయింది. మధ్యవర్తులు లేకుండానే రిజిస్ట్రేషన్లు అయితున్నయ్. పైసల్ ఆన్లైన్ల కట్టంగనే పని అయిపోతుంది. దళారీలకు డబ్బులిచ్చి మోసపోయే బాధలు తప్పినయ్. భూమి రిజిస్ట్రేషన్కు ఇస్తున్న పైసలన్నీ ప్రభుత్వానికి చేరుతున్నయ్. ఎలాంటి సమస్యలు లేకుండా పనులైతు న్నయ్. రైతుల భూములకు రక్షణ కావాలంటే ధరణి ఉండాల్సిందే. ధరణి పోతే దళారుల రాజ్యం వస్తది. ధరణి లేక ముందు రికార్డులన్నీ పట్వారీ చేతిలో ఉండేవి. ఒకరి భూములను మరొకరి పేరుమీద మార్చే వారు. ఇదంతా తెలియకపోతుండే. మనకు అవసరము న్నప్పుడు పోతే ఆ భూమి మరొకరి పేరుమీద ఉంటుం డె. ఇప్పుడు ధరణితో ఎక్కడ ఉన్నా భూ వివరాలను తెలుసుకోవచ్చు. ఇది రైతులకు ఎంతో మేలు చేస్తుంది. మాకు కాంగ్రెస్ వద్దు.. రైతుల క్షేమం కోరే బీఆర్ఎస్ ముద్దు. రైతులమంతా కారు గుర్తుకు ఓటు వేస్తాం.
ధరణి వచ్చినంక భూమికి భద్రత పెరిగింది. సీఎం కేసీఆర్ ధరణి తీసుకురావడం చాలా మంచిగైంది. ఇంతవరకు భూములు రిజిస్ట్రేషన్ ఇబ్బందిగా ఉండె. భూములు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే పైరవీకారులు, పట్వారీలను ఆశ్రయించా ల్సి వస్తుండే. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. తాసీల్దార్ కార్యాలయలంలో రిజిస్ట్రేష న్లు అవుతుండడంతో సులువుగా ఉంది. గతంలో భూమి రిజిస్ట్రేషన్ చేసుకోవా లంటే రోజంతా రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద ఉండాల్సి వచ్చేది. ఇప్పుడు తాసీల్దార్ కార్యాలయంలో గంట సేపట్లో అయిపోతుంది. రిజిస్ట్రేషన్ అయిన వెంటనే అమ్మిన వారి ఖాతా నుంచి కొన్నవారి ఖాతాలోకి భూమి మార్పిడి జరుగుతుంది. పాస్ పుస్తకం, టైటిల్ పుస్తకం రావాలంటే చాలా సమయం పట్టేది. ఇప్పుడు 15 రోజుల్లో పోస్టులో ఇంటికి వస్తుంది. కాంగ్రెసోళ్లు అధికారం లోనికి వస్తే ధరణి తీసేస్తమంటున్నారు. ధరణి తీసేస్తే మళ్లీ భూమి తగాదాలు తప్పవు. పైరవీకారుల రోజులు మల్లా తీసుకొచ్చేందుకు కాంగ్రెసోళ్లు చూస్తున్నారు. ధరణి కొనసాగాలంటే కాంగ్రెస్ను బొందపెట్టాల్సిందే. మళ్లీ కేసీఆర్ సర్కారు రావల్సిందే..
తెలంగాణ ప్రభు త్వం రికార్డుల న్నీ ప క్కాగా చేసి రైతులు ఎప్పుడైనా చూసు కునేలా ఆన్లైన్లో భద్రప ర్చింది. గతం లో పహాణీ, ఆర్వోఆ ర్ అన్ని రికార్డుల్లో రాసి ఉంచేవారు. రికార్డులు అవస రం ఉన్నప్పుడు తీయడం, పెట్టడంతో అవి చిరిగిపో యేవి. రికార్డులు మార్పులు, చేర్పులు చేయాలన్నా వాటి ని తీసి మార్చేవారు. ధరణి ఏర్పాటు తరువాత క్రయవిక్ర యాలన్నీ ఆన్లైన్లోనే కొనసాగుతున్నది. భూమి అమ్మడం, కొనడం అయ్యాక వారం వారంలోగా పట్టాదారు పాసుపుస్తకం ఇంటికే వస్తుంది. దీంతో రైతులు నిశ్చింతగా ఉంటున్నరు. కాంగ్రెస్ పార్టీ వాళ్లు ధరణిని రద్దు చేసి భూమాత పోర్టల్ తీసుకొస్తమని చెప్తున్నరు. వారు తెచ్చే కొత్త పోర్టల్ ద్వారా మళ్లీ రికార్డులన్నీ తారుమారయ్యే అవకాశం ఉంది. ధరణి ఇలాగే కొనసాగించాలి.
గతంలో రెవెన్యూ అధి కారుల చుట్టూ తిరుగుతూ నా భూమి వివరాలు చూసుకుంటుంటి. తెలం గాణ వచ్చినకం కేసీఆర్ మాకు అండగా ఉంటూ భూమి వివరాలు సులువు గా తెల్సుకునేందుకు ధరణి తీసుకొచ్చిండు. ఇప్పుడైతే భూమి వివరాలు కావా లంటే నా ఫోన్లో ధరణి సైట్ ఓపెన్ చేసి చూసు కోవచ్చు. భూమి భధ్రతతో పాటు అధికారుల చుట్టూ తిరిగే పని తప్పింది. ధరణి వచ్చినంక రిజిస్ట్రేషన్ బాధలు తగ్గినయ్. తక్కువ సమయంలో పని పూర్తయితుంది. అప్పుడైతే వారాలకు వారాలు ఆఫీసుల సుట్టూ తిరుగుతుంటిమి. ఇప్పుడైతే 15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ చేస్తున్నరు. ధరణితో దళారీ వ్యవస్థ కనిపిస్తలేదు. ఇది వచ్చినాకనే రైతులకు భూరికార్డులపై ధైర్యం పెరిగింది. ధరణిని వద్దన్న వాళ్లకు మేమే బుద్ధి చెప్తం. కాంగ్రెస్ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయకుండా.. రైతులకు అండగా నిలిచిన కేసీఆర్ పథకాలపై విషంగ క్కుతున్నరు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెసోళ్లకు సోయి తెప్పిస్తం. తెలిసి తెలిసి కష్టాలను ఎవరు కొని తెచ్చుకుంటారు. ఏ ఇబ్బందులు లేని కేసీఆర్ పాలననే కావాలి. కాబట్టి కారు గుర్తుకే ఓటు వేసి గెలిపించుకుంటాం.
సీఎం కేసీఆర్ రైతుల ఇ బ్బం దులను స్వయంగా చూ సిండు గనుకనే ధరణిని తీసు కువచ్చిం డ్రు. దీంతో రైతుల జీవితాల్లో వెలుగులు వచ్చిన వి. మా భూ ములకు ధరణి రక్షణ కవచంగా ఉంది. గతం లో మా భూములు ఇష్టరా జ్యంగా దళారులు, అధి కారు లు కుమ్మకై ఎవరి పేరు మీద అంటే వారి పేర్లపై ఎక్కిం చటోళ్లు, పహాణీల కోసం అధి కారుల చుట్టూ చెప్పులు అరిగె ల తిరిగేటోళ్లం అయినా ఇచ్చే వారు కాదు. ఇక భూముల రిజిస్ట్రేషన్లు అయితే చెప్పే అవసరం లేదు, నెలలు ఏండు తరబడి తిరిగినా కాకపోవడంతో దళారులు, పట్వారీలకు లంచాలు ఇస్తే కాని పనులు జరిగేవి కావు. ఈ బాధలు అన్ని ఇప్పుడిప్పుడే కుదుట పడుతున్నాం. ఇంతలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేస్తాం, బంగాళాఖాతంలో వేస్తాం అని అంటున్నారు. నిజంగా వీరికి వ్యవసాయంపై ఏమాత్రం సోయిలేని మాటలు మాట్లాడుతున్నరు. ఇలాంటి వాళ్లను గనుక ఎన్నుకుంటే రైతుల ఆగం కావాల్సిందే.. అందుకే రైతులందరూ సీఎం కేసీఆర్ వెంటనే ఉండాలి. ధరణిని కాపాడుకోవాలి.
ధరణి పోర్టల్ను తీసివేస్తే భూ ముల రిజిస్ట్రేషన్ కోసం పైర వీకా రుల చుట్టూ చక్కర్లు కొట్టాల్సివస్తుంది. పటేల్, పట్వారీలకు లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడు తుంది. ధరణి తీసివేసి బంగాళఖాతంలో పడేయాలి అంటున్న కాంగ్రెస్ పెద్దల ఆ మాటల వెనుక మతాలబు ఎందో ప్రజలకు వివరించాలి. కాంగ్రెసోళ్లకు రైతులంటే ఎందుకం త పగనో అర్థం కావడం లేదు. సీఎం కేసీఆర్ రైతులు పడ్డ ఇబ్బందులను గమనించి అధికారంలోకి వచ్చిన వెంటనే ధరణి పోర్టల్ తీసుకురావడంతో పనులన్నీ సజావుగా జరుగుతున్నాయి. ఇంత మంచి వ్యవస్థను తీసివేసి దళారీ రాజ్యం చేద్దామని కాంగ్రెసోళ్లు అనుకుంటున్నారేమో, కానీ వాళ్లు అధికా రంలోకి వచ్చేది లేదు సచ్చేది లేదు. వాళ్లు చెప్పే మాటలు నమ్మితే రైతులు నట్టేల మునాగాల్సిందే. ధరణి పోర్టల్తో సులువుగా రిజిస్రేష్టన్లు జరుగుతున్నాయి. ఎలాంటి ఇబ్బందీ లేదు. మళ్లీ కేసీఆర్ రావాలి ధరణి పోర్టల్ ఉండాలి.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమానికి అనేక పథకాలను అందించారు. ప్రభుత్వం నూతనం గా తీసుకొచ్చిన ధరణి పోర్టల్తో భూసమస్యలు తీరిపోయా యి. నిమిషాల వ్యవధిలోనే రిజిస్ట్రేష న్ పూర్తవుతుంది. ధరణి లేనప్పు డు రైతులు ఎన్నో ఇబ్బం దులు పడ్డారు. రాత్రికి రాత్రే పట్టాదా రుల పేర్లను మారుస్తూ అవినీతి అధికారులు సొ మ్ము చేసుకున్నారు. తాసీ ల్దార్ కార్యాలయాలు పైరవీ కారులతో నిండి పోయేది. నిత్యం గ్రామాల్లో భూములకు సంబం ధించిన గొడవలే జరిగేవి. తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టల్తో రైతుల భూములు భద్రంగా ఉన్నాయి. రైతు అనుమతి లేనిదే మరొకరి పేరు మీదికి భూమి మారదు. రైతుల మేలు కోసం తెచ్చిన ధరణిని వద్దని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. కాంగ్రెస్ నాయకులు రైతులను ఆగం చే సేందుకే ధరణీని రద్దు చేస్తామని పదే పదే ప్రకటిస్తున్నారు. ధరణి రద్దయితే మళ్లీ దళారుల రాజ్యం పుట్టుకొస్తుంది. కాంగ్రెస్ పార్టీని నమ్మితే రైతులు మునగడం ఖాయం.
కాంగ్రెస్ ప్రభుత్వంలో దళా రులదే పెత్తనం ఉండేది. మళ్లీ కాంగ్రెస్ వస్తే దళారులను పోషిం చినట్లే. సీఎం కేసీఆర్ తెచ్చిన ధరణి పోర్టల్ ఎంతో బాగుంది. ఎలాంటి దళారుల ప్రమేయం లేకుండా భూముల రిజి స్ట్రేషన్ల తో పాటు వెంటనే మ్యుటేషన్ అయిపోతుంది. భూముల అమ్మ కాలు ఎంతో సులభతరం అ య్యాయి. ధరణి తోనే భూము లు సరైన భద్రత ఏర్పడింది. గత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో రిజిస్ట్రేషన్లు, మ్యుటేష న్లు కావాలంటే రైతులు దళారునలు ఆశ్రయిస్తే గాని పని అయ్యేదికాదు. ఇప్పడు ధరణితో ఆ సమస్యలు పూర్తిగా తొలగిపోయ్యా యి. సీఎం కేసీఆర్ ముందు చూపుతో ధరణికి శ్రీకారం చుట్టిండు. ధరణిని యథావిధిగా కొనసాగించాలి.
ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొచ్చిన ధరణితో రైతుల భూములకు పూర్తి స్థాయిలో రక్షణ ఏర్పడింది. కాంగ్రెస్ అధి కారంలోకి వస్తే ధరణిని రద్దు చేస్తామని చెప్పడం తెలివి తక్కు వ ఆలోచన. ధరణిని రద్దు చేస్తే భద్రత కరువై దళారుల రా జ్యం మళ్లీ వస్తుంది. కాంగ్రెస్ పార్టీ కౌలు రైతుల కోసం నూత న చట్టాన్ని తెస్తామని చెబుతున్నారు. కొత్త చట్టంలో కౌలు దారు కాలం తెస్తామని ప్రకటించడంతో పట్టాదారుల్లో భయం మొదలైంది. తాతల కాలం నుండి మేము వ్యవసాయం చేస్తు న్నాం. గతంలో ఎప్పుడు కూడా కౌలు రైతులతో ఒప్పంద పత్రం రాసుకోలేదు. నోటి మాటతోనే కౌలుకి ఇచ్చేవాళ్లం. కాంగ్రెసోళ్లు తెస్తామంటున్న కౌలు చట్టంతో పట్టాదారులకు, కౌలుదారులకు దూరం పెరుగుతుంది. కౌలు ఒప్పంద చట్టంతో భవిష్యత్లో అనేక సమస్యలు వస్తాయి. రైతుబంధు పెట్టుబడి సాయాన్ని పట్టాదారుడికి లేదా కౌలు రైతుల్లో ఒకరికే ఇస్తామంటే గొడవలు ప్రారంభమవుతాయి.
కాంగ్రెసోళ్ల మాటలు నమ్మితే ఖచ్చితంగా ఆగమైతం. గతంలో కాంగ్రెసోళ్ల పాలనలో కరెంట్ కోసం ఎన్నో కష్టాలు పడ్డాం. మళ్లీ వాళ్ల మాటలు నమ్మే పరిస్థితుల్లో లేం. గత ప్రభుత్వాల హయాంలో కరెంట్ సరిగా లేక పంటలు ఎండిపోయి వలసలు పోయేవాళ్లము. వారు రైతులను ఏ మాత్రం పట్టించుకోలేదు. ఇప్పుడేమో రైతులకు మూడు గంటల విద్యుత్ చాలని అంటున్నారు. కానీ వారు మూడు గంటల కరెంట్ ఇస్తే పండించే పంటలకు నీళ్లు ఎలా కడుతాం. అందరూ ఎట్లా బతుకుతారు. బీఆర్ఎస్ పాలనలో సీఎం కేసీఆర్ మాకు 24 గంటల కరెంట్ ఇస్తుండు. ఇప్పుడు నీళ్లు కట్టుకోడానికి ఎలాంటి ఇబ్బందులు లేవు. మళీ కేసీఆర్ సార్కే ఓటు వేసి గెలిపించుకుంటాం.
గత ప్రభుత్వాల హయాంలో కరెంటే సరిగ్గా ఉండేది కాదు. మూడు గంటల కరెంట్ ఉండడంతో ఇంటికాడ ఉన్నోళ్లను వదిలేసి పంట చేళ్లపోటి పోయి రాత్రులు కాపలా ఉంటూ నీళ్లు పారబెట్టుకునే వాళ్లం. కేసీఆర్ సీఎం అయ్యాకా ఇంటింటికి నల్లాల ద్వారా తాగునీరు అందిస్తుండు. ప్రజలకు ఎన్నో మంచి పనులు చేయడంతోపాటు రైతులకు అనేక వసతులు కల్పించి 24 గంటల పాటు కరెంట్ మంచిగా అందిస్తుం డడంతో రైతులందరూ ఏటా రెండు పంటలు పండించు కుంటున్నారు. కాంగ్రెసోళ్లు ఇప్పుడొచ్చి అది చేస్తాం, ఇది చేస్తాం అంటే ఎవరం నమ్మకంగా ఇప్పుడు కరెంట్ మంచి గా ఇస్తున్న సీఎం కేసీఆర్ సార్కు మా మద్దతు ఉంటుంది.
కాంగ్రెస్ పాలనలో కరెంట్ లేక ఎంతో ఇబ్బంది పడ్డాం. వారు కరెంట్ సక్రమంగా ఇవ్వకపోవడంతో తెల్లవార్లు పొలాల వద్ద పడిగాపులు కాసినా మడి సక్కగా తడిసేకాదు. దీంతో ఎన్నో పంటలు ఎండబెట్టుకొని నష్టపోయిన ఘటనలు ఉన్నాయి. అలాంటి కష్టాలు మరోసారి చూడదలు చుకోలేదు. తెలంగాణ వచ్చినాక సీఎం కేసీఆర్ అయ్యాక వ్యవసాయానికి 24 గంటల పాటు కరెంట్ ఇస్తుండడడంతో రైతులం పొలాల వద్ద పడిగాపులు గాసే పరిస్థితి లేకుండా పోయింది. ఎప్పుడుపడితే అప్పుడు పొలాలకు వెళ్లి నీళ్లు పెట్టుకొని రెండు పంటలు పండించుకుంటున్నాం. కాంగ్రెసోళ్లు వస్తే 3 గంటలు ఇస్తామనడం చూస్తే భయంగా ఉంది. వ్యవసాయం మళ్లీ ఆగమవుతుందని ఆందోళనకు గురవుతున్నాం.
తెలంగాణ ప్రభుత్వం 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తుండడంతో నాకున్న ఒక్క బోరు మోటర్తో దాదాపు 6 ఎకరాల భూమిలో వరి పంట వేశాను. సాగునీరు పుష్కలంగా ఉన్నాయి. మిగిలిన భూమిలో పత్తి పంట వేశాను. నిరంతరం కరెంట్ ఉండడంతో పంటలు బాగా పండుతున్నాయి. కాంగ్రెస్ నాయకులు మూడు గంటల కరెంట్ ఇచ్చి 10 హెచ్పీ మోటర్తో సాగు చేయాలని చెప్పడంతో ఎలాంటి ప్రయోజనం ఉండదు. 10 హెచ్పీ మోటర్ కొనుగోలు చేసేందుకు చాలా ఇబ్బందులవుతాయి. ఇప్పటివరకు ఉన్న పైపులైన్లతో 10 హెచ్పీ మోటర్ ద్వారా నీటిని పంపింగ్ చేస్తే పైప్లైన్లు పగిలిపోతాయి. చివరకు పైపులైన్లు కూడా మార్చుకోవాలి. మోటర్, పైప్లైన్ ఇతరత్రా సామగ్రికి చాలా ఖర్చులు అవుతాయి. వీటికి డబ్బులు ఎవరు ఇస్తారు. ఇప్పుడు ఉన్న 24 గంటల కరెంటే బాగుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు పొలం పనులు పూర్తి చేసుకుని ఇంటికి వస్తున్నాం. 3, 5 గంటలు కరెంట్ ఇస్తే మళ్లీ పొలాల వద్ద జాగరణ చేయాల్సి వస్తుంది. కరెంటు షాక్, పాము కాటుకు గురికావాల్సి వస్తుందేమో అని భయమైతుంది. నిరంతరం మా గురించి ఆలోచిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికే మా ఓటు.
పదేళ్ల కిందట కాంగ్రెస్ పాలనలో కరెంట్ కష్టాలను కళ్లారా చూశాం. మళ్లీ వాళ్లు పొరపాటు న అధికారంలోకి వస్తే వారిచ్చే మూడు గంటల కరెంట్ రైతులకు కటకటే ఎదురుకానున్నది. కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి 10 హెచ్పీ మోటర్లు పెట్టుకోమంటుం డు అసలు ఆయనకు వ్యవసాయం పట్ల ఏమైనా కనీసం అవగాహ న ఉందా.. ? 3 గంటల కరెంట్తో ఒక ఎకరం కూడా సరిగా పారదు. రైతులందరూ 10 హెచ్పీ మోటర్లు పెట్టుకోవాలంటే దాదాపు రూ. 1 లక్ష పైగా అవుతుంది ఆ డబ్బులు రైతులకు రేవంత్ రెడ్డి ఇస్తాడా. రైతులంతా ఇచ్చే మూడు గంటల్లో 10 హెచ్పీ మోటర్లు ఆన్ చేస్తే ట్రాన్స్ఫార్మర్లు, సబ్స్టేషన్లో ఫీడర్లు కాలిపోవు. ఈ మాత్రం తెలియని రేవంత్రెడ్డి వ్యవసాయం గురించి నోటికి వచ్చినట్లు తగదు. బీఆర్ఎస్ ప్రభుత్వమే రైతులకు ఇప్పుడు 24 గంటల కరెంట్ ఇస్తుంది. సీఎం కేసీఆర్ ఉంటేనే రైతులకు మేలు జరుగుతుంది తప్పా. ఎవరొచ్చినా రైతులకు నష్టమే.
వ్యవసాయానికి తెలంగాణ సర్కారు అందిస్తున్న 24 గంటల ఉచిత కరెంట్తో రైతులు బాగుపడుతుం డ్రు. లోఓల్జేజీ సమస్యలు, మోటర్లు కాలిపోవుడు ఇప్పుడు లేవు. ఇది వరకు కరెంట్ కోసం పడ్డ బాధలు గుర్తొ స్తే దుఃఖం వస్తుంది. పొలాలకు నీళ్లు పెట్టేందుకు అర ్ధరాత్రి పోయేది. పాములు, తేల్లు కరుస్తాయని భయభయంగా ఉండేది. సీఎం కేసీఆర్ సార్ పుష్కలంగా అందిస్తున్న 24 గంటల కరెంట్తో రైతు లు సంతోషంగా ఉండ్రు. రైతు మంచిగుంటే కాంగ్రె సోళ్ల కండ్లు మండు తున్నాయి. వారి పాలనలో వ్యవ సాయం పూర్తిగా ఆగమై రైతులు బతకనికే పట్నం బాట పట్టారు. ఏవుసం తెల్వనోళ్లు కూడా కరెంట్ గురించి మాట్లాడుతుండ్రు. కాంగ్రెసోళ్లు ఇస్తామంటు న్న మూడు గంటల కరెంట్తో పొలం పారదు. 10 హెచ్పీ మోటర్లతో ఏ రైతు కూడాఎవుసం చేయడు. రైతులంతా ఆ మోటర్లను వాడితే ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతాయి. రైతులను కడుపులో పెట్టి చూసుకుం టున్న సీఎం కేసీఆర్ సార్నే తిరిగి గెలిపించుకుంటాం.
నాకున్న ఐదెకరాల్లో వరి సాగుచేశాను. 5 హెచ్పీ మోటర్ ఉన్నది. 24 గంటల కరెంట్ ఉండడంతో ఆ మోటర్ వాడేందుకు వీలవు తున్నది. కానీ, భూమిలో ఊట సరిపోక ఎకరం వరి పంట ఎండిపోయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మూడు గంటల కరెంటు ఇచ్చి.. 10 హెచ్పీ మోటర్ పెట్టుకో వాలని చెబుతున్నారు. వ్యవసాయం గురిం చి తెలవని వాళ్లు చెప్పే మాటలివి. రేవంత్ రెడ్డిని నమ్మి ఓట్లు వేస్తే రైతు బతుకు ఆగమైత ది. గత కాంగ్రెస్ పాలనలో రైతులకు కంటి నిండా కునుకు ఉండేది కాదు. పొలం, ఇంటి కాడికి తిరగడానికి కాళ్లకు నిలకడ ఉండేది కాదు. ఎరువులు ఉంటే, విత్తనాలు ఉండ కుండె, విత్తనాలు ఉంటే ఎరువులు ఉండ కుండె. వాటికి కూడా తిండి తిప్పలు మాని ఎండలో లైన్లో నిలబడి అలసిపోతే చెప్పు లు పెట్టి పక్కకు వచ్చి ఓరిగెటోళ్లం. ఇక కరెంటు కష్టాలైతే చెప్పనవసరం లేదు. మళ్లీ రైతులకు మధ్య కౌలుపేరుతో కొత్త పంచాయితీ తీసుకొచ్చి పెడుతుండ్రు. కౌలురైతు పేరును కాలంలో ఎక్కిస్తే హు క్కుల పేరుతో తలలు పగల గొట్టుకోవా ల్సి వస్తుంది. పంటలు బాగా పండడం వల్ల ధరలు కూడా బాగా పెరిగినవి. ప్రతి రైతు కోటీశ్వరుడిని అనే ధైర్యంతో ఉన్నారు. కాంగ్రెస్ వస్తే పంటలు పండవు. భూము లు ధరలు మళ్లీ పడిపోయి అంతా నష్టమే జరుగుతుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో ఆ తిప్పలు ఏం లేవు. అంతేకాక రైతుబంధు, రైతుబీమా ఇస్తుం డు. మంచి చేసెటోళ్లను కాదని ముంచే మాటలు చెప్పే వాళ్లకు ఓటేస్తే మన గోతిని మనమే తోడుకున్నట్లు అవుతుంది. ప్రతి ఒక్కరూ కేసీఆర్కు మద్దతుగా కారు గుర్తుకు ఓటు వేయాలి.
కరెంట్ తగ్గిస్తే రైతులకు మళ్లీ పడిగాపులు తప్పవు. పనులు ఆగం కావడం ఖాయం. వ్యవసాయనికి సాగునీరు ఎంత ముఖ్యమో కరెంట్ కూడా అంతే.. సాగు అనేది నిత్య ప్రక్రియ. దానికి సమయమంటూ ఉండదు. ఏ సమయంలో ఏం పని చేస్తడో రైతుకే పాలుపోదు. ఒక్కోసారి నారుమడి కోసం చల్లడానికి నీళ్లు అవసరమైతయ్. అలాగే నారు కోసం నీరు అవసరమైతది. ఈ పనులకు సమయం ఉండదు.. సాగుతా పోతవి. ఇంత పెద్ద శాత ఉండే సేద్యానికి మూడుగంటల కరెంట్ అంటే అన్ని వదులుకొని బోర్లకాడ కూసోవాలె. మూడుగంటల కరెంట్ వస్తే మా పిల్లల్ని స్కూల్ మాన్పిచ్చి అందరం సేను కాడనే ఉండాల్సి వస్తది. పంట తీసిన తర్వాత కొత్త పంటకి పది ఆస్పర్ల మోటర్తో భూమిని తడపాలంటే ఎకరానికి రెండ్రోజులు పడ్తది. అటువంటిది, మూడుగంటల, ఐదు కరెంట్ అయితే కొంచమే పారుతది. మల్లీ మరుసటి రోజు కూడా అంతే పారుతది. మరి ముందుకు ఎట్ల పోతదో కాంగ్రెసోళ్లే చెప్పాలి. కాబట్టి 24 గంటల కరెంట్ ఉంటేనే సేద్యమైతది. భూమి కూడా బస్తీ అయితది. లేకపోతే దున్నడానికి ఇబ్బందులే, పంట కోయడానికి, పంట వేయడానికి ఇబ్బందులే ఉంటవి. కాబట్టి కాంగ్రెస్కు రైతుల గురించి ఏం తెల్వదు. ఆ పార్టీని నమ్ముకుంటే మనకు కన్నీళ్లు తప్పవు. 24 గంటల కరెంట్ ఉండాలి. రైతుకు భీమా ఉండాలి. కుటుంబం భరోసాగా ఉండాలంటే కారు గుర్తే మాకు దిక్కు.