జడ్చర్లటౌన్, జనవరి 11: జడ్చర్ల అర్బన్హెల్త్ సెంటర్లో 60ఏండ్లు పైబడిని వారికి బూస్టర్డోస్ టీకా వేశారు. మంగళవారం కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మి వ్యాక్సినేషన్ కేంద్రాన్ని పరిశీలించి వ్యాక్సినేషన్ ప్రక్రియను అర్బన్ హెల్త్సెంటర్ డాక్టర్ శివకాంత్ను అడిగి తెలుసుకున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని ప్రతిఒక్కరూ మొదటి, రెండో డోస్ వేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా అర్హులందరికీ బూస్టర్డోస్ వ్యాక్సినేషపై అవగాహన కల్పించాలన్నారు. తప్పనిసరిగా మాస్కులు, శానిటైజర్లను వినియోగించాలని కోరారు.
బాదేపల్లి జెడ్పీహెచ్ఎస్లో..
జడ్చర్ల మున్సిపాలిటీలోని పాత తాసిల్దార్ కార్యాలయంలో నిర్వహిస్తున్న కరోనా పరీక్ష కేంద్రాన్ని మార్చినట్లు అర్బన్ హెల్త్ సెంటర్ డాక్టర్ శివకాంత్ తెలిపారు. మంగళవారం నుంచి సిగ్నల్గడ్డ వద్ద ఉన్న బాదేపల్లి జెడ్పీ హైస్కూల్ ఆవరణలోని వెనుకభాగం భవనంలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు జ్యోతి, ఉమాదేవి, వైద్యసిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
బాలానగర్ మండలంలో..
మండలకేంద్రంలోని గ్రామ పంచాయతీ వద్ద ప్రాథమిక ఆరోగ్య సిబ్బంది మంగళవారం బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ నిర్వహించారు. ఈ సందరక్భంగా సిబ్బంది మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏఎన్ఎంలు, ఆశలు, అంగన్వాడీ టీచర్లు, గ్రామ పంచాయతీ సిబ్బందికి బూస్టర్ డోస్ను వేస్తున్నట్లు తెలిపారు. 60ఏండ్లు పైబడిన వారు బూస్టర్ డోస్ వేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అనిల్కుమార్, లోక్నాథ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రతిఒక్కరూ టీకా వేయించుకోవాలి
ప్రతిఒక్కరూ టీకా వేయించుకోవాలని 4వ వార్డు కౌన్సిలర్ యాదమ్మ పేర్కొన్నారు. మంగళవారం ఎదిరలో వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించి మాట్లాడారు. ప్రతి ఇంటికి వెళ్లి వ్యాక్సిన్ వేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఏఎన్ఎం కవిత, ఆశవర్కర్లు అనురాధ, శారద, అనుసూయ పాల్గొన్నారు.