మహబూబ్నగర్, జనవరి 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కొత్త వేరియంట్ ఒమిక్రాన్ సహా పాత డెల్టా ఇతర వేరియంట్లు దేశంలో మళ్లీ కలకలం రేపుతున్న సమయంలో కొవిడ్ వ్యాక్సిన్ మూడో డోస్ పంపిణీని ప్రభుత్వం చేపట్టింది. ఆ రోగ్య కార్యకర్తలు, ఫ్రంట్ లైన్ వారియర్స్, వృద్ధులకు ప్రికాషన్ డోస్ ఇస్తున్నారు. సోమవారం నుం చి అర్హులకు బూస్టర్ డోస్ పంపిణీ మొదలైంది. అర్హులుగా గుర్తించిన వారి ఫోన్ నంబర్కు కొవిన్ పోర్టల్ నుంచి ఎస్ఎంఎస్ అందగా.. సమీపంలో ని వ్యాక్సినేషన్ సెంటర్ చేరుకొని టీకా వేసుకుం టున్నారు. తొలిరోజు ఉమ్మడి జిల్లాలో 1661 మందికి వ్యాక్సిన్ వేశారు. అత్యధికంగా మహబూ బ్నగర్ జిల్లాలో 779 మంది బూస్టర్ డోస్ టీకా తీసుకోగా.. నారాయణపేట జిల్లాలో 57 మంది మాత్రమే తీసుకున్నారు. రెండో డోస్ తీసుకొని 9 నెలలు పూర్తయిన ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ వర్కర్లు, 60 ఏండ్లు పైబడి ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి డోస్ వేస్తున్నట్లు మహబూబ్నగర్ జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డా.శంకర్ తెలిపారు. బూస్టర్ డోస్ పొందాలనుకుంటున్న వారు మళ్లీ కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే రెండు డోసులు తీసుకు న్న అర్హులైన వారు నేరుగా అపాయింట్మెంట్ తీ సుకోకుండా వ్యాక్సినేషన్ కేంద్రానికి వెళ్లి టీకా తీ సుకోవచ్చని అధికారులు వెల్లడించారు. మహబూ బ్నగర్ జిల్లాలో తొలి రోజు 779, నారాయణపేటలో 57, జోగుళాంబ గద్వాలలో 95, వనపర్తిలో 549, నాగర్కర్నూల్లో 181.. మొత్తం 1661 మంది టీకా వేసుకున్నారు.