గద్వాల, జనవరి 3 : ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 26 మంది ఐఏఎస్లను బదిలీ చేసింది. ఇందులో భాగంగా జోగుళాంబ గద్వాల జి ల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతికి స్థాన చలనం కలిగింది. సంగారెడ్డి జిల్లా కు ఆమెను బదిలీ చేశారు. క్రాంతి 2021 సెప్టెంబర్ 1న గద్వాల కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించగా.. 28 నెలలపాటు విధులు నిర్వర్తించారు. 2023 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలను ప్ర శాంతంగా నిర్వహించడంలో సఫలీకృతులై ఉన్నతాధికారుల మన్ననలు పొందారు. ఆమె స్థానంలో కొత్త కలెక్టర్గా టీఎస్పీఎస్సీలో అదనపు సెక్రటరీగా పనిచేస్తున్న (2017 బ్యాచ్) బీఎం సంతోశ్ను ని యమించింది.