గండీడ్: కల్యాణ లక్ష్మి పథకం పేదింటి ఆడ బిడ్డలకు వరం లాంటిదని పరిగి ఎమ్మెల్యే మహశ్రెడ్డి తెలిపారు. సోమవారం మండల కేంద్రంలో అర్హులైన 90 మందికి కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ఆడపిల్లల వివాహాల విషయంలో పేదల కష్టాలను గుర్తించిన ముఖ్యమంత్రి కల్యాణ లక్ష్మి షాదీముభారక్ పథకాలు ప్రవేశ పెట్టి పేదలకు ఎంతో మేలు చేశారన్నారు.
ఆడపిల్లల తల్లిదండ్రులు ఈరోజు ధైర్యంగా తమ కూతుళ్ల వివాహలు చేస్తున్నారని అన్నారు. వీటితో పాటు ప్రజా సంక్షేమ మే ధ్యేయంగా అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ మాధవి, జడ్పీటీసీ శ్రీని వాస్రెడ్డి, వైస్ఎంపీపీ ఈశ్వరయ్య గౌడ్, సర్పంచ్ చంద్రకళ, తహసీల్దారు జ్యోతి, ఎంపీడీదో రూపేందర్రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పెంట్యానాయక్, తదితరులు పాల్గొన్నారు.