మహబూబ్నగర్ అర్బన్/పాలమూరు, ఏప్రిల్ 14 : దేశం కోసం పాటుపడిన మహనీయుడు అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తామని బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని బస్టాండ్ చౌ రస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ బాబాసాహెబ్ కలలుగన్న నవభారత నిర్మా ణం కోసం పాటుపడతామని, నరేంద్రమోదీ వికసిత్ భారత్ సంకల్పంతో ముందుకెళ్తామన్నారు. అలాగే అంబేద్కర్ జయంతి సందర్భం గా టీఎమ్మార్పీఎస్, ఎమ్మార్పీఎస్ ఆర్ఆర్, మాల మహానాడు నాయకులు ఆదివారం జి ల్లా కేంద్రంలోని బస్టాండ్ చౌరస్తాలో గల అం బేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. మహబూబ్నగర్ పాలమూరు విశ్వవిద్యాలయం పీజీ కళాశాలలో ఆదివారం బీఆర్ అంబేద్కర్ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా పీజీ కళాశాల ప్రి న్సిపాల్ డాక్టర్ చంద్రకిరణ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కా ర్యక్రమంలో పద్మజారెడ్డి, శ్రీనివాస్రెడ్డి, పాం డురంగారెడ్డి, మాజీ కౌన్సిలర్ యాదయ్య, నా యకులు శ్రీనివాస్, జయ న్న, రాందాస్, ర ఘుపతి, రాజయ్య, రమేశ్, పరమేశ్వర్, నర్సింహయ్య, చెన్నకేశవులు, పాల్గొన్నారు.
మహబూబ్నగర్ అర్బన్, ఏప్రిల్ 14 : బ డుగు బలహీన వర్గాల హక్కుల కోసం నిరంత రం పోరాడిన ఆదర్శనీయుడు అంబేద్కర్ అని మహబూబ్నగర్ కలెక్టర్ రవినాయక్ అన్నా రు. జిల్లా కేంద్రంలోని బస్టాండ్ చౌరస్తాలో షె డ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏ ర్పాటు చేసిన అంబేద్కర్ జయంతి కార్యక్రమానికి కలెక్టర్ రవినాయక్ హాజరై విగ్రహానికి పూ లమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమం లో అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి పాండు, పౌరసంబంధాల అధికారి శ్రీనివాస్ పాల్గ్గొన్నారు.
మూసాపేట(అడ్డాకుల), ఏప్రిల్ 14 : అం బేద్కర్ జయంతిని వేడుకలను అడ్డాకుల, మూసాపేట మండలాల వ్యాప్తంగా ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అడ్డాకు ల, మూసాపేట మండలాల్లోని అన్ని గ్రామా ల్లో అంబేద్కర్ విగ్రహాలు, చిత్రపటాలకు పూ లమాల వేసి నివాళులర్పించారు.
హన్వాడ, ఏప్రిల్ 14 : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆదివారం మండలంలోని అన్ని గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహాలతోపాటు చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు.
గండీడ్, ఏప్రిల్ 14 : అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడల్లో నడుచుకోవాలని వెన్నాచేడ్ గ్రామ అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు గు ర్రాల చెన్నయ్య అన్నారు. అంబేద్కర్ జయంతిని మండలంలోని పలు గ్రామాల్లో జరుపుకున్నారు. చిత్రపటాలు, విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచులు పుల్లారెడ్డి, గోపాల్, జితేందర్రెడ్డి, నాయకులు ఉన్నారు.
మహ్మదాబాద్, ఏప్రిల్ 14 : అంబేద్కర్ జయంతి సందర్భంగా మండలంలోని అన్ని గ్రామాల్లో ఆయన విగ్రహాలకు పూలమాల వే సి నివాళులర్పించారు. చౌదర్పల్లి మంగం పే ట్, గాధిర్యాల్ గ్రామాల్లో యువజన సంఘాల ఆధ్వర్యంలో అన్నదానం చేశారు.
మిడ్జిల్, ఏప్రిల్ 14 : మండలంలోని అన్ని గ్రామాల్లో అంబేద్కర్ జయంతిని నిర్వహించా రు. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు యువజన సంఘాలు, రాజకీయ పార్టీల నాయకుల ఆధ్వర్యంలో నివాళులర్పించారు. కార్యక్రమం లో ఎంపీపీ సుదర్శన్, జెడ్పీటీసీ శశిరేఖ, తాసీల్దార్ రాజునాయక్ పాల్గొన్నారు.
దేవరకద్ర, ఏప్రిల్ 14 : సమాజంలోని ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చే యాలని మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆంజనేయులు అన్నారు. ఆదివారం నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించుకున్నారు.
ఊట్కూర్, ఏప్రిల్ 14 : మండలంలోని అన్ని గ్రామాల్లో అంబేద్కర్ జయంతిని నిర్వహించారు. ఆయన విగ్రహాలకు పూలమాల వే సి నివాళులర్పించారు. కార్యక్రమంలో పీఏసీసీఎస్ చైర్మన్ బాల్రెడ్డి, లయన్స్ క్లబ్ మండలాధ్యక్షుడు జనార్దన్రెడ్డి, పాల్గొన్నారు.
మక్తల్ అర్బన్/టౌన్, ఏప్రిల్ 14 : అంబేద్కర్ అన్నివర్గాలకు స్ఫూర్తి అని మక్తల్ లయ న్స్ క్లబ్ అధ్యక్షుడు అంబదాస్రావు అన్నారు. మక్తల్లోని అంబేద్కర్ చౌరస్తాలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించా రు. అనంతరం అన్నదానం చేశారు. కార్యక్రమంలో రీజియన్ చైర్పర్సన్ రమేశ్రావు తది తరులు పాల్గొన్నారు.
నారాయణపేటలో..
నారాయణపేట టౌన్/రూరల్, ఏప్రిల్ 14 : అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని ఎ స్సీ సంక్షేమశాఖ అధికారి కన్యాకుమారి అన్నా రు. ఆదివారం ఎస్సీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే పేట మండల కేంద్రంలోని వివిధ కార్యాలయా లు, మండల పరిధిలో అంబేద్కర్ జయంతి నిర్వహించారు.
దామరగిద్ద, ఏప్రిల్ 14 : మండలంలోని అన్ని గ్రామాల్లో అంబేద్కర్ జయంతిని నిర్వహించారు. మండల కేంద్రంలో బైక్ ర్యాలీ ని ర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
మరికల్, ఏప్రిల్ 14 : అంబేద్కర్ జయంతిని ఆదివారం మండలంలో ఘనంగా నిర్వహించారు. తాసీల్దార్ కార్యాలయం వద్ద అంబేద్కర్ విగ్రహానికి జై భీమ్ సభ్యులు, అఖిలపక్ష నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రభుత్వ దవాఖానలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. తీలేరులో నారాయణ పేట డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్కుమార్రెడ్డి అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు, ఆయా గ్రా మాల మాజీసర్పంచులు, ఎంపీటీసీలు, అఖిల పక్ష నాయకులు పాల్గొన్నారు.
ధన్వాడ, ఏప్రిల్ 14: అంబేద్కర్ జయంతి ని ఆదివారం మండలంలో దళిత సంఘాలు, అఖిలపక్ష నాయకులు ఘనంగా నిర్వహించా రు. అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఆయా గ్రా మాల మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, అఖిలపక్ష, దళిత సంఘాల నాయకులు ఉన్నారు.
నర్వ, ఏప్రిల్ 14: మండలంలోని యువజ న సంఘాలు, ఎమ్మార్పీఎస్, బీఆర్ఎస్, వివిధ రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో అంబేద్కర్ జ యంతిని ఘనంగా నిర్వహించారు. ఎంపీపీ జ యరాములు శెట్టి, విండో చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, నర్వలో వైస్ ఎంపీపీ వీణావతి, తాజా మాజీ సర్పంచ్ సంధ్య, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు జలంధర్రెడ్డి, దళిత సంఘం, బీఆర్ఎస్ నాయకుడు అయ్యప్ప పాల్గొన్నారు.