మహబూబ్నగర్ అర్బన్, అక్టోబర్ 15 : బీఆర్ఎస్ పాలనపై ప్రజలకు భరోసాగా ఉంటుందని, పదేండ్లలో సీఎం కేసీఆర్ సుపరిపాలన దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు గోనెల గాయత్రి భవానీ, రాజేశ్వరి, లా వణ్య, లక్ష్మి, యాదమ్మ, సరస్వతి, మం గమ్మ, నరేశ్, రమణ, శ్యామ్, నిరంజన్, రాము, రాజేశ్, సాయికిరణ్తోపాటు 50 మందికిపైగా మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వీరికి మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యం లో కాంగ్రెస్, బీజేపీ నాయకులు అలవికాని హామీలతో ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. 60ఏండ్ల పాలనలో ఎందుకు అభివృద్ధి చేయలేదని ప్రజలు ఎక్కడికక్కడ నిలదీయాలన్నారు. అమలు హామీలు ఇస్తున్న నా యకులు వారు అధికారంలో ఉన్న రా ష్ర్టాల్లో తెలంగాణలోని పథకాలు, అభివృద్ధి ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. గతంలో రూ.200ల పింఛన్ ఇ స్తుండగా, తాము అధికారంలోకి వచ్చాక పదింతలు చేసి ఇచ్చామన్నారు. మిషన్ భగీరథతో నట్టింట్లోకి తాగునీరు, రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి ఇలా చెప్పుకుంటూపోతే రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకం అందని ఇల్లే లేదని తెలిపారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజక్టు ద్వారా ఉమ్మడి పాలమూరు సస్యశ్యామలం అవుతుందని వెల్లడించారు.
బీజేపీ చేసింది శూన్యం..
దేశంలోనే తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి దూసుకుపోతున్నదని.. అ లాంటి రాష్ర్టానికి అన్యాయం చేస్తున్న బీజేపీకి సింగిల్ స్థానం కూడా దక్కదని బీజేపీ మహిళా మోర్చ అధ్యక్షురాలు గో నెల గాయత్రి భవాని తెలిపారు. బీజేపీ ఎన్నాళ్లు ఉన్నా ఎలాంటి అభివృద్ధి సా ధ్యం కాదని బీఆర్ఎస్లో చేరామన్నా రు. మంత్రి శ్రీనివాస్గౌడ్ గెలుపునకు తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రామకృష్ణ, గోనెల సురేశ్ తదితరులు పాల్గ్గొన్నారు.
ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి..
రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఎ క్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆకాంక్షించారు. దేవీ నవరాత్రు ల సందర్భంగా జిల్లా కేంద్రంలోని కొ త్తగంజి లక్ష్మీనర్సింహస్వామి ఆలయానికి మంత్రి ఊరేగింపుగా వచ్చి పట్టువస్ర్తాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అభివృద్ధికి రూ.6 కోట్ల నిధులను విడుదల చేశామని, పనులు చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. మహబూబ్నగర్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని, లక్ష్మీనర్సింహస్వామి దయతో మ రింత అభివృద్ధి చెందాలని మంత్రి కో రారు. అనంతరం కొత్తబస్టాండ్ సమీపంలో ఉన్న రేణుకా ఎల్లమ్మ ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో పాలకమండ లి చైర్మన్ చంద్రమౌళి, మున్సిపల్ వైస్ చైర్మన్ గణేశ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గిరిధర్రెడ్డి, రాజేశ్వర్, నాయకులు రామకృష్ణ, వర్ద భాస్కర్, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు.