నమస్తే తెలంగాణ నెట్వర్క్, జనవరి 30 : ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలను సోమవారం మక్తల్ నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ మండలాల అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. బైక్ ర్యాలీలు, ప్రభుత్వ దవాఖానల్లో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ, విద్యార్థులకు పుస్తకాలు, క్రీడా పోటీలు, గెలుపొందిన వారికి బహుమతుల ప్రదానం, ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి, సతీమణి చిట్టెం సుచరిత పాల్గొని కేక్ను కట్ చేశారు. హాజరైన నాయకులు, కార్యకర్తలు అభిమాన నేతను పూల మాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఊట్కూర్ మండలంలో ఎమ్మెల్యే నిధులు రూ.10 లక్షలతో నిర్మించిన పంచ్మసీదు షాపింగ్ కాంప్లెక్స్ను చిట్టెం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భగవంతుడి ఆశీస్సులు, ప్రజల అండదండలతో నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని తెలిపారు.